రణమా.. ఉపసంహరణమా!
నామపత్రాల దాఖలు... పరిశీలన ముగిసింది. ఇక బరిలో నిలిచే అభ్యర్థుల పేర్లను ప్రకటించడమే తరువాయి. ఎవరు ఉంటారు... ఎవరెవరు ఉపసంహరించుకుంటారనేది నేడు తేలనుంది. గతంలో ఎన్నడు లేని విధంగా పెద్దసంఖ్యలో నామపత్రాలను దాఖలు చేశారు.
నేటితో ముగియనున్న గడువు
మెదక్ సమీకృత కలెక్టరేట్
న్యూస్టుడే, మెదక్: నామపత్రాల దాఖలు... పరిశీలన ముగిసింది. ఇక బరిలో నిలిచే అభ్యర్థుల పేర్లను ప్రకటించడమే తరువాయి. ఎవరు ఉంటారు... ఎవరెవరు ఉపసంహరించుకుంటారనేది నేడు తేలనుంది. గతంలో ఎన్నడు లేని విధంగా పెద్దసంఖ్యలో నామపత్రాలను దాఖలు చేశారు. పరిశీలన అనంతరం రాష్ట్రంలో అత్యధిక మంది అభ్యర్థులు బరిలో ఉన్నది కేవలం మెదక్ పార్లమెంట్ నియోజకవర్గమే. ఇందులో ప్రధాన పార్టీలతో పాటు, గుర్తింపు పొందిన పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటు స్వతంత్రులు ఉన్నారు. ఐదారుగురు స్వతంత్రులు ఉంటే వారిని బుజ్జగించేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రయత్నాలు చేసే వారు. కానీ పదుల సంఖ్యలో ఉండడంతో వారి వైపు కన్నెత్తి చూడడం లేదని తెలుస్తోంది. ఒక వేళ ఉపసంహరించుకోకుండా, 53 మంది అభ్యర్థులు బరిలో ఉంటే...నాలుగు బ్యాలెట్ యూనిట్లను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇందుకు ఎన్నికల అధికారులు సన్నద్ధమవుతున్నారు.
ఖమ్మం నుంచి వచ్చి: మెదక్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు మొత్తం 54 మంది నామపత్రాలు సమర్పించగా, పరిశీలనలో ఒక స్వతంత్ర అభ్యర్థిని తిరస్కరించారు. దీంతో ప్రసుత్తం 53 మంది ఉన్నారు. వీరిలో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు నలుగురు ఉండగా, మిగిలిన 13 మంది గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు. ఇక మిగిలిన 36 మంది స్వతంత్ర అభ్యర్థులు కావడం గమనార్హం. ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు, హైదరాబాద్, ఖమ్మం జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ నామినేషన్ వేశారు.
శుక్రవారం పరిశీలన చేపట్టగా..: నామపత్రాల పరిశీలన శుక్రవారం నుంచి చేపట్టగా, నిబంధనల ప్రకారం శని, ఆదివారాల్లో ఉపసంహరణ పత్రాలను స్వీకరించలేదు. దీంతో సోమవారం మధ్యాహ్నం మూడుగంటల లోపు ఉపసంహరించేందుకు గడువు విధించారు. స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులు కేటాయించి, అనంతరం బరిలో ఉన్న వారి వివరాలను రిటర్నింగ్ అధికారి ప్రకటిస్తారు.
బుజ్జగింపులు లేవు...
సాధారణంగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు... ఇతర పార్టీలు, స్వతంత్రులు నామినేషన్లు దాఖలు చేస్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో అయితే చాలా తక్కువ మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసిన వారై ఉండడంతో, అందులో పలువురిని ప్రధాన పార్టీల అభ్యర్థులు బుజ్జగించి, నామినేషన్ ఉపసంహరించుకునేలా దృష్టిసారించేవారు. అదే లోక్సభ ఎన్నికలకు వచ్చే సరికి పెద్దసంఖ్యలో నామినేషన్లు దాఖలవ్వడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులకు తలనొప్పిగా మారింది. మెదక్ లోక్సభ స్థానానికి 36 మంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ వేశారు. వీరికి నచ్చజెప్పడం ప్రధాన పార్టీలకు తలకు మించిన భారమవుతోంది. నయానో...బయానో కొంత అప్పజెప్పి...పోటీలో నుంచి ఉపసంహరించుకునేలా చేద్దామన్నా...వారి డిమాండ్లు పెద్దఎత్తున ఉండడంతో ఎటువంటి ప్రయత్నం చేయడం లేదని తెలుస్తోంది. ఎంతో కొంత ముట్టజెప్పే బదులు...ఎన్నికల ఖర్చులకు వెచ్చించవచ్చని ఓ పార్టీ నేత అభిప్రాయపడ్డారు. ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులుండడంతో అందులో కొంత మందిని తప్పించేలా ప్రయత్నం చేస్తే, పెద్దఎత్తున డిమాండ్ ఉండడంతో అటు వైపు వెళ్లడం లేదని మరో పార్టీ నేత పేర్కొన్నారు. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థుల పేర్లు, ఫొటో...మొదటి ఈవీఎంలోనే ముందు వరుసలో ఉండనున్నాయి. ఈ కారణంగా వారు స్వతంత్రులను పోటీ నుంచి తప్పుకొనేలా ప్రయత్నం చేయడం లేదని తెలుస్తోంది. ఈ లెక్కన ఎంత మంది బరిలో ఉంటారనేది సోమవారం తేలనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పండగలా.. కదిలొచ్చారు
[ 14-05-2024]
ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో ఓటర్లు ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటారు. పండగలా కదిలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
నొక్కి.. వక్కాణించారు
[ 14-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోరు జోరుగా సాగింది. మెదక్, జహీరాబాద్, చేవెళ్ల లోక్సభ స్థానాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల తరఫున ఆయా పార్టీల అధినేతలు ప్రచారం హోరెత్తించి మాటల తూటాలు పేల్చారు. -
సంగాయిపేట తండాలో శత శాతం పోలింగ్
[ 14-05-2024]
కొల్చారం మండలం సంగాయిపేట తండాలోని 62/ఏ పోలింగ్ కేంద్రంలో శత శాతం పోలింగ్ నమోదైంది. -
సమస్యాత్మక కేంద్రాల్లో ప్రశాంత పోలింగ్
[ 14-05-2024]
జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేలా పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. -
సీఎంపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలి: బండి సంజయ్
[ 14-05-2024]
ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ డిమాండ్ చేశారు. -
బీవీఆర్ఐటీలో 5, గురుకులంలో 2
[ 14-05-2024]
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం ఎన్నికల ఓట్ల లెక్కింపును నర్సాపూర్లో జూన్ 4న నిర్వహించనున్నామని ఆర్డీవో జగదీశ్వర్రెడ్డి తెలిపారు. -
భారాస, కాంగ్రెస్ శ్రేణుల ఘర్షణ
[ 14-05-2024]
లోక్సభ ఎన్నికల సందర్భంగా పలు చోట్ల కాంగ్రెస్, భారాస పార్టీల కార్యకర్తలు, నాయకులు గొడవ పడ్డారు. -
కార్పొరేట్ విద్య.. అందిపుచ్చుకుంటే భవిత
[ 14-05-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివి 7 జీపీఏకు పైగా ఫలితం సాధించిన విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలల్లో ఇంటర్ విద్యనభ్యసించేందుకు ప్రభుత్వం ఉచితంగా అవకాశం కల్పిస్తుండటం విశేషం. -
పోలింగ్ శాతంపై తర్జనభర్జన
[ 14-05-2024]
కరీంనగర్ లోక్సభ పరిధి బెజ్జంకి మండలంలో సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ శాతం నమోదులో అధికారులు తర్జనభర్జనకు గురయ్యారు. -
ఓటు వేసి వీడియో చిత్రీకరణ.. యువకులపై కేసు
[ 14-05-2024]
పోలింగ్ కేంద్రంలో ఓటు వేసి చరవాణిలో స్వీయ వీడియో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో ఇద్దరు యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
హల్దీ వాగులో దూకి వృద్ధుడి ఆత్మహత్య
[ 14-05-2024]
ఆర్థిక ఇబ్బందులతో వృద్ధుడు హల్దీ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం తూప్రాన్లో జరిగింది.