నుడా ఏర్పాటుకు కసరత్తు షురూ
నీలగిరి పట్టణ విస్తరణకు జిల్లా యంత్రాంగం శ్రీకారం చుట్టింది. కొత్తగా నల్గొండ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(నుడా)ఏర్పాటకు కసరత్తు ప్రారంభించారు. నల్గొండ పట్టణంలో గడియారం కేంద్రాన్ని కేంద్ర బిందువుగా తీసుకుని నలు దిశలా 14 కి.మీ మేర
మారనున్న నీలగిరి రూపురేఖలు
నల్గొండ పురపాలిక, న్యూస్టుడే
అధికారులు ప్రతిపాదించిన నుడా విస్తరణ చిత్రం
నీలగిరి పట్టణ విస్తరణకు జిల్లా యంత్రాంగం శ్రీకారం చుట్టింది. కొత్తగా నల్గొండ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(నుడా)ఏర్పాటకు కసరత్తు ప్రారంభించారు. నల్గొండ పట్టణంలో గడియారం కేంద్రాన్ని కేంద్ర బిందువుగా తీసుకుని నలు దిశలా 14 కి.మీ మేర పరిధిలో ఉన్న గ్రామాలను నుడా కిందకు తీసుకొచ్చేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. మరో పక్క నల్గొండ పట్టణ రూపురేఖలు మార్చేందుకు పుర యంత్రాంగం కుస్తీ పడుతుంది. ప్రధాన రహదారుల విస్తరణ, జంక్షన్ల సుందరీకరణ చేపట్టేందుకు అవసరమైన ప్రతిపాదనల తయారు చేసే పనిలో నిమగ్నమైంది నుడా పరిధిలోకి వచ్చే గ్రామాల్లో కొత్త వెంచర్లు వేసి పట్టణాభివృద్ధికి నిధులు సమకూర్చేలా ప్రణాళికలు రూపొందించే పనిలో యంత్రాంగం దృష్టి సారించింది.
615 చదరపు కి.మీ పరిధితో..
పట్టణాభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం పట్టణాన్ని నలుదిశలా అభివృద్ధి చేసేందుకు నూతనంగా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని తెర మీదకు తీసుకొచ్చింది. నల్గొండ మున్సిపాలిటీలోని 48 వార్డులతోపాటు నల్గొండ, తిప్పర్తి, కట్టంగూరు, నార్కట్పల్లి మండలాల పరిధిలోని 26 గ్రామాలను కలుపుకొని నుడా ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించినట్లు తెలిసింది. ప్రస్తుతం నల్గొండ మున్సిపాలిటీ పరిధిలో 105 చ.కి.మీ వైశాల్యం విస్తరించి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలు తయారు చేయాలని ఆదేశించడంతో జిల్లా యంత్రాంగం నల్గొండ చుట్టు 14 కి.మీ మేర విస్తరించాలని ప్రతిపాదనలు తయారు చేశారు. 6 కి.మీ పరిధి పరిగణనలోకి తీసుకుంటే నుడా విస్తీర్ణం 113.04 చ.కి.మీ పెరుగుతుంది. 8 కి.మీ పరిధి పరిగణనలోకి తీసుకుంటే 200 చ.కి.మీ, 10కి.మీ పరిధిలో చూస్తే 341 చ.కి.మీ విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. 14కి.మీ పరిధి పరిగణలోకి తీసుకుంటే 615 చ.కి.మీ వైశాల్యం పరిధిలో పరిశీలిస్తే నల్గొండ, తిప్పర్తి, కట్టంగూరు, నార్కట్పల్లి మండలాల పరిధిలోని గ్రామాలు కంచనపల్లి, మేళ్ల దుప్పలపల్లి, చందనపల్లి, ముషంపల్లి, అప్పాజిపేట, రాములబండ, కాకుల కొండారం, కనగల్, చర్లగౌరారం, పగడిమర్రి, దోరపల్లి, పర్వతగిరి, ధర్వేశిపురం, తొర్రగల్, పజ్జూరు, ఎర్రగడ్డలగూడెం, సూరారం, బొల్లెపల్లి, కట్టంగూరు, యల్లారెడ్డిగూడెం, కంకణాపల్లి, కొర్రివానిగూడెం, మద్దివాణిగూడెం, రామాలింగాలగూడెం, జంగమదేవిగూడెం, మల్లెపల్లివారిగూడెం వరకు నుడాను విస్తరించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. నుడా కార్యరూపం దాల్చితే త్వరలో అమల్లోకి రానున్న కొత్త మాస్టర్ప్లాన్లో గ్రామాల చేర్పుల మూలంగా మరింత ఆలస్యంఅయ్యే అవకాశం ఉంది.
ఛైర్మన్ కుర్చీపై ఆశలు
నల్గొండ నుడా ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించడంతో సంస్థ ఛైర్మన్ కుర్చీపై అప్పుడే అధికారపార్టీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. అధికార పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు పైరవీలు ప్రారంభించినట్లు ప్రచారం సాగుతోంది. మరో పక్క కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిని తెరాసలో తీసుకొచ్చి నుడా ఛైర్మన్ పదవి అప్పగించేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికార పార్టీ నాయకులే మాట్లాడుకోవడం చర్చనీయాశంగా మారింది.
విస్తరించనున్న పట్టణ రహదారులు
పట్టణంలో రహదారులు ఇరుకుగా ఉండటంతో ఇబ్బందులు గమనించిన మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు రోడ్లను విస్తరించే దిశగా అడుగులు వేస్తున్నారు. ముందుగా నల్గొండ పట్టణంలోని మాస్టర్ ప్లాను ప్రకారం ఏడు మార్గాల్లో రోడ్లను 12 జంక్షన్లు విస్తరించాలని ప్రతిపాదనల రూపొందించారు. అందులో తొలిదశ ఆరు జంక్షన్లు, హైదరాబాద్రోడ్డు, దేవకొండరోడ్డు, కలెక్టరేట్రోడ్డు మార్గాలను విస్తరించాలని నిర్ణయించారు. రెండో విడతలో మిగతా పనులు చేపట్టేందుకు అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. నుడా ఏర్పాటుకు కసరత్తు ప్రారంభించడంతో నల్గొండ చుట్టూ స్థిరాస్తి వ్యాపారం పుంజుకునే అవకాశంఉంది
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
[ 11-05-2024]
భారాస ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్ గెలుపును కోరుతూ భువనగిరి పట్టణంలో పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. -
ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి
[ 11-05-2024]
నియోజకవర్గంలో పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు ఏర్పాటు పూర్తి చేసినట్లు కలెక్టర్ హనుమంతు కే జండగే తెలిపారు. -
జిల్లా కేంద్రంలో 2 కే రన్
[ 11-05-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజు జిల్లా కేంద్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట 2కే రన్ నిర్వహించారు. -
11 గుర్తింపు కార్డుల్లో ఏదైనా చూపి ఓటేయవచ్చు
[ 11-05-2024]
భారత ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ఓటరు జాబితాలో పేరు ఉన్నవారు ఓటు వేసే అధికారం ఉన్నప్పటికీ, ఆ పేరు గల వ్యక్తిని తానేనని నిరూపించుకోవాల్సి ఉంటుంది. -
మేమూ ఓటేశాం.. మరి మీరూ?
[ 11-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరకొచ్చింది. పల్లెల్లో మైకుల హోరు తగ్గింది. ఇక పోలింగ్ క్రతువే మిగిలి ఉంది. అభ్యర్థుల భవితవ్యం మరికొద్ది రోజుల్లో తేలనుంచి. సమర్థ నాయకత్వాన్ని ఎన్నుకునేందుకు ఓటర్లు, శతశాతం పోలింగ్కు అధికారగణం సిద్ధపడుతున్నారు. -
లోక్సభలో గళమెత్తా ..ప్రజాక్షేత్రంలో పోరాడా
[ 11-05-2024]
దేశంలో లోక్సభ కీలకమైన చట్టసభ. నల్గొండ లోక్సభ స్థానం నుంచి 1998లో సీపీఐ తరఫున సురవరం సుధాకర్రెడ్డి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. -
అతిథి తరలి రాగా.. అదిరే జనజాతర..!
[ 11-05-2024]
నకిరేకల్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా నిర్వహించిన కాంగ్రెస్ బహిరంగ సభ పార్టీ శ్రేణుల్లో జోష్ను నింపింది. -
నేటితో ప్రచారం పరిసమాప్తం
[ 11-05-2024]
గత నెల రోజులకు పైగా క్షేత్రస్థాయిలో ప్రధాన పార్టీలు, అభ్యర్థులు చేస్తున్న లోక్సభ ఎన్నికల ప్రచారానికి నేటి సాయంత్రం తెరపడనుంది -
పరిధి దాటితే కటకటాలే
[ 11-05-2024]
కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి అన్ని చర్యలు తీసుకుంటోంది. -
ఎన్నికల ఫైనల్ మ్యాచ్కు ఇంకా రెండ్రోజులే
[ 11-05-2024]
భారత్లో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు కొనసాగుతుండగా.. లోక్సభ ఎన్నికల క్రీడలూ ఈ మధ్యే మొదలయ్యాయి. దేశవ్యాప్తంగా ప్రధాన జట్ల (పార్టీల) మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. -
నకిలీ బంగారంతో బ్యాంకుకు బురిడీ
[ 11-05-2024]
నకిలీ బంగారం బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.53.89 లక్షలు స్వాహా చేసిన ఘటన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల పరిధిలోని రాయినిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో జరిగింది. -
మట్టపల్లిలో ముగిసిన విశ్వశాంతి మహాయాగం
[ 11-05-2024]
మట్టపల్లి క్షేత్రంలో 12 రోజులుగా నిర్వహిస్తోన్న విశ్వశాంతి మహాయాగం శుక్రవారం విశేష హోమాలు, ఆధ్యాత్మిక క్రతువులతో ముగిసింది. -
నాలుగు నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు నరకం: జగదీశ్రెడ్డి
[ 11-05-2024]
కేసీఆర్ నాయకత్వంలోని భారాసతోనే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. -
నారసింహుడి సన్నిధిలో ఊంజల్ సేవోత్సవం
[ 11-05-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో స్వయంభువులైన పంచనారసింహులకు శుక్రవారం నిత్యపూజలతో పాటు అమ్మవారిని ఆరాధిస్తూ ప్రత్యేక క్రతువులను ఆలయ ఆచారంగా కొనసాగించారు. -
‘రాజ్యాంగం రద్దుకు భాజపా కుట్ర’
[ 11-05-2024]
మోదీ మళ్లీ గెలిస్తే దేశం సర్వనాశనం అవుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు.
తాజా వార్తలు (Latest News)
-
టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లాండ్ స్టార్ పేసర్
-
యమునోత్రికి పోటెత్తిన భక్తులు.. బారులు తీరిన దృశ్యాలు వైరల్
-
నేను ఏ నిర్ణయం తీసుకొన్నా షారుక్ మద్దతు ఉంటుంది: గంభీర్
-
ఓటర్ల కోసం ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు: ఎండీ ద్వారకా తిరుమలరావు
-
కడుపు కోతలో తల్లిదండ్రులు.. చిన్నారి మృతదేహాన్ని వదిలేసిన విమాన సిబ్బంది
-
లింక్డ్ఇన్లో పోస్ట్ డిలీట్.. మైక్రోసాఫ్ట్తో ఓలా కటీఫ్