పుర పాలనపై శ్వేతపత్రం విడుదల చేయాలి
రెండేళ్ల పుర పాలనపై శ్వేతపత్రం విడుదల చేయాలని భువనగిరి మున్సిపల్ కౌన్సిల్ కాంగ్రెస్ ఫ్లోర్లీడర్ పోత్నక్ ప్రమోద్కుమార్, పురపాలిక మాజీ ఛైర్మన్ బర్రె జహంగీర్, కాంగ్రెస్ కౌన్సిలర్లు కైరంకొండ వెంకటేశ్వర్లు, ఈరపాక నర్సింహ
ప్రశ్నలతో కూడిన కరపత్రాన్ని చూపుతున్న కాంగ్రెస్ నాయకులు పోత్నక్ ప్రమోద్కుమార్,
బర్రె జహంగీర్, కౌన్సిలర్లు కైరంకొండ వెంకటేశ్వర్లు, ఈరపాక నర్సింహ
భువనగిరి పట్టణం, న్యూస్టుడే: రెండేళ్ల పుర పాలనపై శ్వేతపత్రం విడుదల చేయాలని భువనగిరి మున్సిపల్ కౌన్సిల్ కాంగ్రెస్ ఫ్లోర్లీడర్ పోత్నక్ ప్రమోద్కుమార్, పురపాలిక మాజీ ఛైర్మన్ బర్రె జహంగీర్, కాంగ్రెస్ కౌన్సిలర్లు కైరంకొండ వెంకటేశ్వర్లు, ఈరపాక నర్సింహ డిమాండ్ చేశారు. పట్టణంలోని ముస్లిం షాదీఖానాలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. రెండేళ్లుగా ఎలాంటి అభివృద్ధి జరగలేదని, నిధులు సాధించడంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, అధికార పక్షం పుర పాలకులు విఫలమయ్యారని ఆరోపించారు. పట్టణం నుంచి హెచ్ఎండీఏకు కోట్లాది రూపాయలు ఆదాయంగా వెళ్తున్నప్పటికీ, అక్కడి నుంచి పట్టణాభివృద్ధి, ప్రజల మౌలిక సదుపాయాల కల్పనకు ఎన్ని నిధులు మంజూరు చేయించారో చెప్పాలని డిమాండ్ చేశారు. పురపాలికలోని కీలక పదవులను రాయగిరికి కట్టబెట్టి పట్టణానికి అన్యాయం చేశారన్నారు. అన్ని వార్డుల్లో సమస్యలు నెలకొన్నప్పటికీ పరిష్కరించిన దాఖలాలు లేవని ఆరోపించారు. కౌన్సిలర్లు చేసిన తీర్మానాలకు విరుద్ధంగా పనులు చేపడుతున్నారని ఆరోపించారు. కోతులు, కుక్కలను నియంత్రించడంలో విఫలమయ్యారన్నారు. మినీ ట్యాంక్బండ్, అవుట్డోర్ స్టేడియం పనులు ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. ముందస్తుగా చిరువ్యాపారులకు ఆశ్రయం కల్పించకుండా రహదారిని విస్తరిస్తూ 208 మంది ఉపాధిని హరించారని పేర్కొన్నారు. నిధుల వినియోగంలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. పారిశుద్ధ్య కార్మికుల వేతనాల పెంపులో నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. పట్టణ అభివృద్ధి, ప్రజలకు కల్పించిన సదుపాయాలపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పడిగెల ప్రదీప్, సలావొద్దీన్, గంగాధర్, కృష్ణ యాదవ్, కొల్లూరి రాజు, దర్గాయి దేవేందర్, సాయి, నరేష్, పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
11 గుర్తింపు కార్డుల్లో ఏదైనా చూపి ఓటేయవచ్చు
[ 11-05-2024]
భారత ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ఓటరు జాబితాలో పేరు ఉన్నవారు ఓటు వేసే అధికారం ఉన్నప్పటికీ, ఆ పేరు గల వ్యక్తిని తానేనని నిరూపించుకోవాల్సి ఉంటుంది. -
మేమూ ఓటేశాం.. మరి మీరూ?
[ 11-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరకొచ్చింది. పల్లెల్లో మైకుల హోరు తగ్గింది. ఇక పోలింగ్ క్రతువే మిగిలి ఉంది. అభ్యర్థుల భవితవ్యం మరికొద్ది రోజుల్లో తేలనుంచి. సమర్థ నాయకత్వాన్ని ఎన్నుకునేందుకు ఓటర్లు, శతశాతం పోలింగ్కు అధికారగణం సిద్ధపడుతున్నారు. -
లోక్సభలో గళమెత్తా ..ప్రజాక్షేత్రంలో పోరాడా
[ 11-05-2024]
దేశంలో లోక్సభ కీలకమైన చట్టసభ. నల్గొండ లోక్సభ స్థానం నుంచి 1998లో సీపీఐ తరఫున సురవరం సుధాకర్రెడ్డి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. -
అతిథి తరలి రాగా.. అదిరే జనజాతర..!
[ 11-05-2024]
నకిరేకల్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా నిర్వహించిన కాంగ్రెస్ బహిరంగ సభ పార్టీ శ్రేణుల్లో జోష్ను నింపింది. -
నేటితో ప్రచారం పరిసమాప్తం
[ 11-05-2024]
గత నెల రోజులకు పైగా క్షేత్రస్థాయిలో ప్రధాన పార్టీలు, అభ్యర్థులు చేస్తున్న లోక్సభ ఎన్నికల ప్రచారానికి నేటి సాయంత్రం తెరపడనుంది -
పరిధి దాటితే కటకటాలే
[ 11-05-2024]
కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి అన్ని చర్యలు తీసుకుంటోంది. -
ఎన్నికల ఫైనల్ మ్యాచ్కు ఇంకా రెండ్రోజులే
[ 11-05-2024]
భారత్లో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు కొనసాగుతుండగా.. లోక్సభ ఎన్నికల క్రీడలూ ఈ మధ్యే మొదలయ్యాయి. దేశవ్యాప్తంగా ప్రధాన జట్ల (పార్టీల) మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. -
నకిలీ బంగారంతో బ్యాంకుకు బురిడీ
[ 11-05-2024]
నకిలీ బంగారం బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.53.89 లక్షలు స్వాహా చేసిన ఘటన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల పరిధిలోని రాయినిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో జరిగింది. -
మట్టపల్లిలో ముగిసిన విశ్వశాంతి మహాయాగం
[ 11-05-2024]
మట్టపల్లి క్షేత్రంలో 12 రోజులుగా నిర్వహిస్తోన్న విశ్వశాంతి మహాయాగం శుక్రవారం విశేష హోమాలు, ఆధ్యాత్మిక క్రతువులతో ముగిసింది. -
నాలుగు నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు నరకం: జగదీశ్రెడ్డి
[ 11-05-2024]
కేసీఆర్ నాయకత్వంలోని భారాసతోనే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. -
నారసింహుడి సన్నిధిలో ఊంజల్ సేవోత్సవం
[ 11-05-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో స్వయంభువులైన పంచనారసింహులకు శుక్రవారం నిత్యపూజలతో పాటు అమ్మవారిని ఆరాధిస్తూ ప్రత్యేక క్రతువులను ఆలయ ఆచారంగా కొనసాగించారు. -
‘రాజ్యాంగం రద్దుకు భాజపా కుట్ర’
[ 11-05-2024]
మోదీ మళ్లీ గెలిస్తే దేశం సర్వనాశనం అవుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు.
తాజా వార్తలు (Latest News)
-
జగన్ సభకు ప్రైవేట్ వాహనాల స్వాధీనం!
-
కేపీహెచ్బీలో గొలుసు దొంగ.. సాఫ్ట్వేర్ ఉద్యోగి
-
అమరావతి వద్దన్న నాని కావాలా..రాజధాని నిర్మించే తెదేపా కావాలా?
-
ఓటేసేందుకు తరలివస్తున్నారు.. గన్నవరం విమానాశ్రయంలో పెరిగిన రద్దీ
-
డెంగీ రాకను చెప్పే హిందూ మహాసముద్రం
-
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం