logo

శుభకార్యానికి వచ్చి.. అనంతలోకాలకు..

వివాహ వేడుకకు వచ్చిన ఓ యువకుడు తిరుగు ప్రయాణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. ఈ ఘటన చింతపల్లి మండలం మదనపురం గేట్‌ సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల

Published : 22 May 2022 04:40 IST

తరుణ్‌

చింతపల్లి, న్యూస్‌టుడే: వివాహ వేడుకకు వచ్చిన ఓ యువకుడు తిరుగు ప్రయాణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. ఈ ఘటన చింతపల్లి మండలం మదనపురం గేట్‌ సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. అనుముల మండలం పేరూరు గ్రామానికి చెందిన పసుల సోమయ్యకు ఇద్దరు కుమారులు, కుమార్తె సంతానం. పెద్ద కుమారుడు తరుణ్‌(20) ఐటీఐ పూర్తి చేశాడు. కొంతకాలంగా హైదరాబాద్‌లో ఎలక్ట్రీషియన్‌గా పనులు చేస్తున్నాడు. శుక్రవారం స్నేహితుడి వివాహ వేడుక నిమిత్తం ద్విచక్రవాహనంపై కొండమల్లేపల్లికి వచ్చి సంతోషంగా గడిపాడు. వేడుక ముగిసిన అనంతరం అర్ధరాత్రి హైదరాబాద్‌కు తిరుగుపయనమయ్యాడు. మదనపురం గేట్‌ వద్దకు చేరుకోగానే గుర్తు తెలియని వాహనం ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొట్టి తరుణ్‌ శరీరంపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు చేరుకుని జేబులో ఉన్న ఆధారాలతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ మేరకు మృతుడి సోదరుడు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని