అడ్డదారి.. కలప చోరీ
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా హరితహారం కార్యక్రమాలు చేపడుతోంది. రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా అక్రమార్కులు చెట్లను అడ్డంగా నరికేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
కలప దుంగ.. చోరుల బెంగ
చందంపేట మండలం ముర్పునూతల వద్ద మూతపడిన అటవీ శాఖ చెక్పోస్టు
దేవరకొండ, న్యూస్టుడే: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా హరితహారం కార్యక్రమాలు చేపడుతోంది. రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా అక్రమార్కులు చెట్లను అడ్డంగా నరికేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న చెక్పోస్టు కాస్తా మూతపడి దశాబ్దకాలం గడుస్తోంది. దీంతో అక్రమార్కులు వృక్షాలను నరికి కలపను పక్కదారి పట్టిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
నల్లమల అటవీ ప్రాంతం పరిధిలోని పోలేపల్లి ప్రధాన కేంద్రంగా అక్రమ కలప రవాణా జోరందుకుంది. అక్రమార్కులు ఈ గ్రామాన్ని అడ్డాగా ఎంచుకొని నిత్యం దేవరకొండ పట్టణంలోని హోటళ్లు, మిల్లులకు కలపను తరలిస్తున్నారు. మరోవైపు బొగ్గు బట్టీలుగా మారుస్తున్నారు. ముదిగొండ, గొట్టిముక్కల, చింతపల్లి మండలం ఉమ్మెంతాలపల్లి, గుర్రంపోడు మండలం పాల్వాయి వద్ద, కొండమల్లేపల్లి మండలం గుమ్మడవెల్లి శివారులో కలపను బొగ్గుగా మార్చి పొరుగు రాష్ట్రం విశాఖపట్టణానికి తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
దేవరకొండ పట్టణం మీదుగా అడ్డదారిన పోతున్న కలప
మూతపడిన చెక్పోస్టులు
నల్లమల అటవీ ప్రాంత పరిసర గ్రామాల నుంచి అక్రమంగా కలపను తరలించి పోలెపల్లి గ్రామాన్ని అడ్డాగా ఎంచుకొని తరలిస్తున్నారు. ఇదిలా ఉండగా చందంపేట మండలం ముర్పునూతల వద్ద దశాబ్దకాలం క్రితం అక్కడున్న చెక్పోస్టు మూతపడింది. అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చెక్పోస్టు పునరుద్ధరించకపోవడంతో రాత్రివేళలో గుట్టుగా కలప తరలిస్తూ అటవీ శాఖ సిబ్బందికి గతంలో పట్టుబడ్డారు. పోలెపల్లి వద్ద మరో చెక్పోస్టును ఏర్పాటు చేసినట్లయితే అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడుతుందని పర్యావరణ ప్రేమికులు పేర్కొంటున్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారిని వివరణ కోరేందుకు ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
11 గుర్తింపు కార్డుల్లో ఏదైనా చూపి ఓటేయవచ్చు
[ 11-05-2024]
భారత ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ఓటరు జాబితాలో పేరు ఉన్నవారు ఓటు వేసే అధికారం ఉన్నప్పటికీ, ఆ పేరు గల వ్యక్తిని తానేనని నిరూపించుకోవాల్సి ఉంటుంది. -
మేమూ ఓటేశాం.. మరి మీరూ?
[ 11-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరకొచ్చింది. పల్లెల్లో మైకుల హోరు తగ్గింది. ఇక పోలింగ్ క్రతువే మిగిలి ఉంది. అభ్యర్థుల భవితవ్యం మరికొద్ది రోజుల్లో తేలనుంచి. సమర్థ నాయకత్వాన్ని ఎన్నుకునేందుకు ఓటర్లు, శతశాతం పోలింగ్కు అధికారగణం సిద్ధపడుతున్నారు. -
లోక్సభలో గళమెత్తా ..ప్రజాక్షేత్రంలో పోరాడా
[ 11-05-2024]
దేశంలో లోక్సభ కీలకమైన చట్టసభ. నల్గొండ లోక్సభ స్థానం నుంచి 1998లో సీపీఐ తరఫున సురవరం సుధాకర్రెడ్డి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. -
అతిథి తరలి రాగా.. అదిరే జనజాతర..!
[ 11-05-2024]
నకిరేకల్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా నిర్వహించిన కాంగ్రెస్ బహిరంగ సభ పార్టీ శ్రేణుల్లో జోష్ను నింపింది. -
నేటితో ప్రచారం పరిసమాప్తం
[ 11-05-2024]
గత నెల రోజులకు పైగా క్షేత్రస్థాయిలో ప్రధాన పార్టీలు, అభ్యర్థులు చేస్తున్న లోక్సభ ఎన్నికల ప్రచారానికి నేటి సాయంత్రం తెరపడనుంది -
పరిధి దాటితే కటకటాలే
[ 11-05-2024]
కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి అన్ని చర్యలు తీసుకుంటోంది. -
ఎన్నికల ఫైనల్ మ్యాచ్కు ఇంకా రెండ్రోజులే
[ 11-05-2024]
భారత్లో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు కొనసాగుతుండగా.. లోక్సభ ఎన్నికల క్రీడలూ ఈ మధ్యే మొదలయ్యాయి. దేశవ్యాప్తంగా ప్రధాన జట్ల (పార్టీల) మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. -
నకిలీ బంగారంతో బ్యాంకుకు బురిడీ
[ 11-05-2024]
నకిలీ బంగారం బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.53.89 లక్షలు స్వాహా చేసిన ఘటన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల పరిధిలోని రాయినిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో జరిగింది. -
మట్టపల్లిలో ముగిసిన విశ్వశాంతి మహాయాగం
[ 11-05-2024]
మట్టపల్లి క్షేత్రంలో 12 రోజులుగా నిర్వహిస్తోన్న విశ్వశాంతి మహాయాగం శుక్రవారం విశేష హోమాలు, ఆధ్యాత్మిక క్రతువులతో ముగిసింది. -
నాలుగు నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు నరకం: జగదీశ్రెడ్డి
[ 11-05-2024]
కేసీఆర్ నాయకత్వంలోని భారాసతోనే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. -
నారసింహుడి సన్నిధిలో ఊంజల్ సేవోత్సవం
[ 11-05-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో స్వయంభువులైన పంచనారసింహులకు శుక్రవారం నిత్యపూజలతో పాటు అమ్మవారిని ఆరాధిస్తూ ప్రత్యేక క్రతువులను ఆలయ ఆచారంగా కొనసాగించారు. -
‘రాజ్యాంగం రద్దుకు భాజపా కుట్ర’
[ 11-05-2024]
మోదీ మళ్లీ గెలిస్తే దేశం సర్వనాశనం అవుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు.
తాజా వార్తలు (Latest News)
-
కేపీహెచ్బీలో గొలుసు దొంగ.. సాఫ్ట్వేర్ ఉద్యోగి
-
అమరావతి వద్దన్న నాని కావాలా..రాజధాని నిర్మించే తెదేపా కావాలా?
-
ఓటేసేందుకు తరలివస్తున్నారు.. గన్నవరం విమానాశ్రయంలో పెరిగిన రద్దీ
-
డెంగీ రాకను చెప్పే హిందూ మహాసముద్రం
-
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?