Munugode bypoll నా గెలుపు ఖాయమైంది: కేఏ పాల్
మునుగోడులో 30 నుంచి 50 వేల ఓట్ల ఆధిక్యంతో తాను గెలుస్తున్నానని, మీ గుండెల్లో నేనున్నానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, స్వతంత్ర అభ్యర్థి కేఏ పాల్ తెలిపారు.
ఓ భోజనశాలలో బెంచీపై పడుకున్న కేఏ పాల్
చౌటుప్పల్, న్యూస్టుడే: మునుగోడులో 30 నుంచి 50 వేల ఓట్ల ఆధిక్యంతో తాను గెలుస్తున్నానని, మీ గుండెల్లో నేనున్నానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, స్వతంత్ర అభ్యర్థి కేఏ పాల్ తెలిపారు. చౌటుప్పల్ పురపాలిక లింగోజీగూడెంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తనకు 27 మంది స్వతంత్ర అభ్యర్థులు మద్దతునిస్తున్నారని చెప్పారు. భాజపా వాళ్లు ఓడిపోతున్నారని తెలిసి నా ప్రియ శిష్యుడు జేపీ నడ్డా మునుగోడు సభకు రాకుండా రద్దు చేశారని తెలిపారు. తన గెలుపే వారి గెలుపుగా ప్రకటించాలని కోరుతున్నానని తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతిరెడ్డి కూడా తనకు మద్దతునివ్వాలని విజ్ఞప్తి చేశారు. తెరాస మూడు నెలల్లో రూ.11,200 కోట్లు ఎన్నికల కోసం ఖర్చు చేసినట్లు సమాచారముందన్నారు. ఇందులో రూ.100 కోట్లు ఖర్చు చేస్తే ఈ నియోజకవర్గం బాగయ్యేది కదా కేసీఆర్ అని ప్రశ్నించారు. తెరాస వాళ్లు తాను అద్దెకు తీసుకున్న గది కూడా దక్కకుండా చేస్తున్నారని, నిన్న దాడి చేయడానికి ప్రయత్నించారని, అయినా...తగ్గేదేలే! అని తెలిపారు.
కొసమెరుపు: లింగోజీగూడెంలోని హైవే-9లో మధ్యాహ్నం 12 గంటలకు విలేకరుల సమావేశం ఉందని కేఏ పాల్ సమాచారం ఇచ్చారు. తీరా విలేకరులు అక్కడికి వెళ్లేసరిగా హోటల్ ఫ్యామిలీ విభాగంలో బెంచీపై పడుకుని నిద్రపోయారు. గంట విశ్రాంతి తీసుకున్నాక విలేకరులతో మాట్లాడారు. తన గది తాళంచెవి తన దగ్గరే ఉందని, ఆ గదిని తెరాస ఎమ్మెల్యేలకు కేటాయించడంతో ఇక్కడ పడుకున్నానని వివరణ ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆయుధాలు అప్పగించారు..!
[ 02-05-2024]
వ్యక్తిగత భద్రత కోసం లైసెన్సు తీసుకొని వెంట ఉంచుకున్న ఆయుధాలను ఉమ్మడి నల్గొండ జిల్లావాసులు ఠాణాలకు అప్పగించారు. -
ఆరో తరగతిలో వేయి పడగలు నవల చదివా
[ 02-05-2024]
మాది భువనగిరి. 12వ తరగతి వరకు అక్కడే చదివాను. ఆరో తరగతి చదివే రోజుల్లో వేసవి సెలవులొస్తే స్నేహితులు యంజాల గోపాల్, బుద్దగిరి లక్ష్మీనర్సయ్య, చల్ల కృష్ణలతో కలిసి నార్ఖాన్ బావికి ఈతకు వెళ్లేవాళ్లం. -
నీలగిరి.. నిప్పుల కొలిమి!
[ 02-05-2024]
భానుడి భగభగలతో ఉమ్మడి జిల్లా నిప్పుల కుంపటిలా మారుతోంది. రోజురోజుకీ రాష్ట్రంలోనే అత్యధికంగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. -
ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రతిభా అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
[ 02-05-2024]
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5న ప్రతిభా అవార్డులు ప్రదానం చేయనున్నట్లు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సీనియర్ సోషల్ సైంటిస్ట్ డబ్ల్యూజీ ప్రసన్నకుమార్ తెలిపారు. -
పేరు చెప్పనందుకు ఓటు కట్
[ 02-05-2024]
భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించాక 1951లో ఓటర్ల నమోదు చేపట్టారు. అప్పట్లో 21 సంవత్సరాలు నిండిన అందరికీ ఓటు హక్కును రాజ్యాంగం కల్పించింది. -
పోలింగ్ కేంద్రాల్లో అధికారుల నంబర్లు
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల్లో కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. బయట గోడలపై పోలింగ్ కేంద్రం, లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గ నంబర్లు వేస్తున్నారు. -
18 ఏళ్లకు ఓటుహక్కు ఎప్పుడు కల్పించారంటే..!
[ 02-05-2024]
1952లో సాధారణ ఎన్నికల సందర్భంగా అధికరణ 326 ద్వారా సార్వత్రిక వయోజన ఓటు హక్కు కల్పించారు. దీని ద్వారా 21 ఏళ్లు పైబడిన వారు ఓటు హక్కును వినియోగించుకునేవారు.
తాజా వార్తలు (Latest News)
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?
-
స్విమ్మింగ్ పూల్లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి