మరో ఉద్యమానికి శ్రీకారం: జగదీశ్రెడ్డి
ఉమ్మడి రాష్ట్రంలో 14 ఏళ్ల పోరాటం చేసి దిల్లీ పెద్దల మెడలు వంచి రాష్ట్రం సాధించిన భారాస మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతుందని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు.
నల్గొండ భారాస కార్యాలయంలో జెండా ఆవిష్కరించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర కుమార్ నాయక్, చిత్రంలో మాజీ మంత్రి జగదీశ్రెడ్డి, ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు
నల్గొండ నేరవిభాగం, న్యూస్టుడే: ఉమ్మడి రాష్ట్రంలో 14 ఏళ్ల పోరాటం చేసి దిల్లీ పెద్దల మెడలు వంచి రాష్ట్రం సాధించిన భారాస మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతుందని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. భారాస ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ జెండా ఎగరవేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజల గోసకు కారణమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు ప్రజల పక్షాన పోరాటం చేస్తామన్నారు. రైతాంగ సమస్యలతో పాటు నేతన్నల సమస్యలు కూడా తీవ్రరూపం దాల్చాయన్నారు. ప్రజలు ఉపాధి కోసం విదేశాలబాట పట్టాల్సిన దుస్థితి ఏర్పడిందని తెలిపారు. భారాస ప్రభుత్వంలో ఉమ్మడి జిల్లాలో మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించామని.. రేవంత్రెడ్డి సర్కారు బీడు భూములుగా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిజ జీవితంలో ఏనాడు కూడా నిజాలు చెప్పని కోమటిరెడ్డి సోదరుల గురించి మాట్లాడి స్థాయి దిగజార్చుకోవడం ఇష్టం లేదని తెలిపారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి, జడ్పీ ఛైర్మన్ బండా నరేందర్రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, చిరుమర్తి లింగయ్య, భాస్కర్రావు, నాయకులు తిప్పన విజయసింహారెడ్డి, చీరపంకజ్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
[ 11-05-2024]
భారాస ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్ గెలుపును కోరుతూ భువనగిరి పట్టణంలో పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. -
ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి
[ 11-05-2024]
నియోజకవర్గంలో పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు ఏర్పాటు పూర్తి చేసినట్లు కలెక్టర్ హనుమంతు కే జండగే తెలిపారు. -
జిల్లా కేంద్రంలో 2 కే రన్
[ 11-05-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజు జిల్లా కేంద్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట 2కే రన్ నిర్వహించారు. -
11 గుర్తింపు కార్డుల్లో ఏదైనా చూపి ఓటేయవచ్చు
[ 11-05-2024]
భారత ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ఓటరు జాబితాలో పేరు ఉన్నవారు ఓటు వేసే అధికారం ఉన్నప్పటికీ, ఆ పేరు గల వ్యక్తిని తానేనని నిరూపించుకోవాల్సి ఉంటుంది. -
మేమూ ఓటేశాం.. మరి మీరూ?
[ 11-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరకొచ్చింది. పల్లెల్లో మైకుల హోరు తగ్గింది. ఇక పోలింగ్ క్రతువే మిగిలి ఉంది. అభ్యర్థుల భవితవ్యం మరికొద్ది రోజుల్లో తేలనుంచి. సమర్థ నాయకత్వాన్ని ఎన్నుకునేందుకు ఓటర్లు, శతశాతం పోలింగ్కు అధికారగణం సిద్ధపడుతున్నారు. -
లోక్సభలో గళమెత్తా ..ప్రజాక్షేత్రంలో పోరాడా
[ 11-05-2024]
దేశంలో లోక్సభ కీలకమైన చట్టసభ. నల్గొండ లోక్సభ స్థానం నుంచి 1998లో సీపీఐ తరఫున సురవరం సుధాకర్రెడ్డి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. -
అతిథి తరలి రాగా.. అదిరే జనజాతర..!
[ 11-05-2024]
నకిరేకల్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా నిర్వహించిన కాంగ్రెస్ బహిరంగ సభ పార్టీ శ్రేణుల్లో జోష్ను నింపింది. -
నేటితో ప్రచారం పరిసమాప్తం
[ 11-05-2024]
గత నెల రోజులకు పైగా క్షేత్రస్థాయిలో ప్రధాన పార్టీలు, అభ్యర్థులు చేస్తున్న లోక్సభ ఎన్నికల ప్రచారానికి నేటి సాయంత్రం తెరపడనుంది -
పరిధి దాటితే కటకటాలే
[ 11-05-2024]
కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి అన్ని చర్యలు తీసుకుంటోంది. -
ఎన్నికల ఫైనల్ మ్యాచ్కు ఇంకా రెండ్రోజులే
[ 11-05-2024]
భారత్లో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు కొనసాగుతుండగా.. లోక్సభ ఎన్నికల క్రీడలూ ఈ మధ్యే మొదలయ్యాయి. దేశవ్యాప్తంగా ప్రధాన జట్ల (పార్టీల) మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. -
నకిలీ బంగారంతో బ్యాంకుకు బురిడీ
[ 11-05-2024]
నకిలీ బంగారం బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.53.89 లక్షలు స్వాహా చేసిన ఘటన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల పరిధిలోని రాయినిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో జరిగింది. -
మట్టపల్లిలో ముగిసిన విశ్వశాంతి మహాయాగం
[ 11-05-2024]
మట్టపల్లి క్షేత్రంలో 12 రోజులుగా నిర్వహిస్తోన్న విశ్వశాంతి మహాయాగం శుక్రవారం విశేష హోమాలు, ఆధ్యాత్మిక క్రతువులతో ముగిసింది. -
నాలుగు నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు నరకం: జగదీశ్రెడ్డి
[ 11-05-2024]
కేసీఆర్ నాయకత్వంలోని భారాసతోనే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. -
నారసింహుడి సన్నిధిలో ఊంజల్ సేవోత్సవం
[ 11-05-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో స్వయంభువులైన పంచనారసింహులకు శుక్రవారం నిత్యపూజలతో పాటు అమ్మవారిని ఆరాధిస్తూ ప్రత్యేక క్రతువులను ఆలయ ఆచారంగా కొనసాగించారు. -
‘రాజ్యాంగం రద్దుకు భాజపా కుట్ర’
[ 11-05-2024]
మోదీ మళ్లీ గెలిస్తే దేశం సర్వనాశనం అవుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఓటర్ల కోసం ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు: ఎండీ ద్వారకా తిరుమలరావు
-
కడుపు కోతలో తల్లిదండ్రులు.. చిన్నారి మృతదేహాన్ని వదిలేసిన విమాన సిబ్బంది
-
లింక్డ్ఇన్లో పోస్ట్ డిలీట్.. మైక్రోసాఫ్ట్తో ఓలా కటీఫ్
-
గవర్నర్ వీడియోల పెన్డ్రైవ్ ఉంది.. మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు
-
ఓడినా.. గెలిచినా పట్టించుకోరు.. ధోనీ ఎంటర్టైన్ చేస్తున్నాడంతే: సెహ్వాగ్
-
ఛత్తీస్గడ్లో మావోయిస్టుల కోటకు బీటలు.. దండకారణ్యంలో భద్రతా దళాల దూకుడు