సంఘాలను కాదని.. సంస్థకు అప్పగించి..
పురపాలక సంఘం పరిధిలో చేపట్టాల్సిన పనులకు ముందస్తుగా ఒప్పందం కుదుర్చుకోవడంలో పాలకులు విఫలమవుతున్నారు. అర్హులకు లబ్ధి చేకూరకపోగా పనులు ముందుకు సాగడం లేదు.
పొడి చెత్త విక్రయంపై కుదరని ఒప్పందం
బండిల్స్గా మార్చిన ఖాళీ ప్లాస్టిక్ బాటిళ్లు, వ్యర్థాలు
భువనగిరి పట్టణం, న్యూస్టుడే: పురపాలక సంఘం పరిధిలో చేపట్టాల్సిన పనులకు ముందస్తుగా ఒప్పందం కుదుర్చుకోవడంలో పాలకులు విఫలమవుతున్నారు. అర్హులకు లబ్ధి చేకూరకపోగా పనులు ముందుకు సాగడం లేదు. డంపింగ్ యార్డులో పొడిచెత్త సేకరణ, విక్రయాల హక్కులను ఫిబ్రవరి నెల నుంచి ఒప్పందం ఖరారు చేయకపోవడంతో మహిళా సంఘాలు నష్టపోయాయి. వీరి స్థానంలో ఒప్పందం లేకుండానే యార్డులో తడి, పొడి చెత్తను సేకరిస్తూ ఓ సంస్థ లాభాలు గడించడం గమనార్హం. పురపాలక సంఘం డంపింగ్ యార్డులో రెండేళ్లుగా రెండు మహిళా సంఘాలకు చెందిన మహిళలకు పొడి చెత్తను సేకరిస్తూ ఉపాధి పొందుతున్నారు. వీరి ఒప్పంద గడువు గత ఫిబ్రవరితో ముగిసింది. తిరిగి మహిళా సంఘాలకు ఈ హక్కులను కట్టబెట్టాల్సి ఉండగా గత కమిషనర్ ఓ సంస్థకు ఒప్పందం చేసుకోకుండానే యార్డులో కార్యకలాపాలు కొనసాగించేందుకు అనుమతించారు. మూడు నెలలుగా సంస్థ ప్లాస్టిక్ వ్యర్థాలు, సీసాలు, గాజు సీసాలు, అట్ట, కాగితం, ఐరన్ వ్యర్థాలను సేకరించి లాభాలను మూటకట్టుకుంది. విషయం తెలిసి నూతనంగా బాధ్యతలు చేపట్టిన కమిషనర్ రామాంజులరెడ్డి గత మూడు రోజుల క్రితం పట్టణంలోని ప్రగతి మహిళా సంఘం సభ్యురాలు సొప్పరి బిందు, చైతన్య మహిళా సంఘం సభ్యురాలు గీస లక్ష్మికి సేకరణ బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం పట్టణం నుంచి భారీగా తడి, పొడిచెత్త యార్డుకు రావాల్సి ఉన్నప్పటికి చెత్త సేకరణ వాహనాల కార్మికులు తాము సేకరించిన వ్యర్థాలను అధిక మొత్తంలో మార్కెట్లోని స్క్రాప్ వ్యాపారులకు విక్రయించి, కొద్ది మొత్తంలో మహిళా సంఘాల సభ్యులకు అప్పగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తడి, పొడి చెత్త సేకరణపై గతంలో మహిళా సంఘాల సభ్యులు నెలకు రూ.35 నుంచి రూ.40 వేల ఆదాయాన్ని గడించే వారు. పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల రీసైకిల్ జరిగి యార్డులో స్థలం అందుబాటులోకి వస్తుందన్న ఉద్దేశంతో పురపాలకులు ఈ కార్యకలాపాలను నిర్వహించేందుకు యార్డులో షెడ్లు, విలువైన కంప్రెస్ యంత్రంతో పాటు నెలనెలా భారీగా వచ్చే విద్యుత్తు బిల్లును చెల్లిస్తూ ఉచితంగా వసతి, ఇతర సదుపాయాలను కల్పిస్తుండటం గమనార్హం. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ రామాంజులరెడ్డిని వివరణ కోరగా గత కమిషనర్ ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోకుండానే సంస్థకు బాధ్యతలు అప్పగించారని, మహిళలకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతోనే బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించామని వివరణ ఇచ్చారు. గత మూడు నెలలుగా సంస్థ సేకరించిన వ్యర్థాలపై మున్సిపాలిటీకి ఎలాంటి రుసుం చెల్లించలేదని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
[ 11-05-2024]
భారాస ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్ గెలుపును కోరుతూ భువనగిరి పట్టణంలో పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. -
ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి
[ 11-05-2024]
నియోజకవర్గంలో పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు ఏర్పాటు పూర్తి చేసినట్లు కలెక్టర్ హనుమంతు కే జండగే తెలిపారు. -
జిల్లా కేంద్రంలో 2 కే రన్
[ 11-05-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజు జిల్లా కేంద్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట 2కే రన్ నిర్వహించారు. -
11 గుర్తింపు కార్డుల్లో ఏదైనా చూపి ఓటేయవచ్చు
[ 11-05-2024]
భారత ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ఓటరు జాబితాలో పేరు ఉన్నవారు ఓటు వేసే అధికారం ఉన్నప్పటికీ, ఆ పేరు గల వ్యక్తిని తానేనని నిరూపించుకోవాల్సి ఉంటుంది. -
మేమూ ఓటేశాం.. మరి మీరూ?
[ 11-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరకొచ్చింది. పల్లెల్లో మైకుల హోరు తగ్గింది. ఇక పోలింగ్ క్రతువే మిగిలి ఉంది. అభ్యర్థుల భవితవ్యం మరికొద్ది రోజుల్లో తేలనుంచి. సమర్థ నాయకత్వాన్ని ఎన్నుకునేందుకు ఓటర్లు, శతశాతం పోలింగ్కు అధికారగణం సిద్ధపడుతున్నారు. -
లోక్సభలో గళమెత్తా ..ప్రజాక్షేత్రంలో పోరాడా
[ 11-05-2024]
దేశంలో లోక్సభ కీలకమైన చట్టసభ. నల్గొండ లోక్సభ స్థానం నుంచి 1998లో సీపీఐ తరఫున సురవరం సుధాకర్రెడ్డి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. -
అతిథి తరలి రాగా.. అదిరే జనజాతర..!
[ 11-05-2024]
నకిరేకల్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా నిర్వహించిన కాంగ్రెస్ బహిరంగ సభ పార్టీ శ్రేణుల్లో జోష్ను నింపింది. -
నేటితో ప్రచారం పరిసమాప్తం
[ 11-05-2024]
గత నెల రోజులకు పైగా క్షేత్రస్థాయిలో ప్రధాన పార్టీలు, అభ్యర్థులు చేస్తున్న లోక్సభ ఎన్నికల ప్రచారానికి నేటి సాయంత్రం తెరపడనుంది -
పరిధి దాటితే కటకటాలే
[ 11-05-2024]
కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి అన్ని చర్యలు తీసుకుంటోంది. -
ఎన్నికల ఫైనల్ మ్యాచ్కు ఇంకా రెండ్రోజులే
[ 11-05-2024]
భారత్లో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు కొనసాగుతుండగా.. లోక్సభ ఎన్నికల క్రీడలూ ఈ మధ్యే మొదలయ్యాయి. దేశవ్యాప్తంగా ప్రధాన జట్ల (పార్టీల) మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. -
నకిలీ బంగారంతో బ్యాంకుకు బురిడీ
[ 11-05-2024]
నకిలీ బంగారం బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.53.89 లక్షలు స్వాహా చేసిన ఘటన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల పరిధిలోని రాయినిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో జరిగింది. -
మట్టపల్లిలో ముగిసిన విశ్వశాంతి మహాయాగం
[ 11-05-2024]
మట్టపల్లి క్షేత్రంలో 12 రోజులుగా నిర్వహిస్తోన్న విశ్వశాంతి మహాయాగం శుక్రవారం విశేష హోమాలు, ఆధ్యాత్మిక క్రతువులతో ముగిసింది. -
నాలుగు నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు నరకం: జగదీశ్రెడ్డి
[ 11-05-2024]
కేసీఆర్ నాయకత్వంలోని భారాసతోనే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. -
నారసింహుడి సన్నిధిలో ఊంజల్ సేవోత్సవం
[ 11-05-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో స్వయంభువులైన పంచనారసింహులకు శుక్రవారం నిత్యపూజలతో పాటు అమ్మవారిని ఆరాధిస్తూ ప్రత్యేక క్రతువులను ఆలయ ఆచారంగా కొనసాగించారు. -
‘రాజ్యాంగం రద్దుకు భాజపా కుట్ర’
[ 11-05-2024]
మోదీ మళ్లీ గెలిస్తే దేశం సర్వనాశనం అవుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు.
తాజా వార్తలు (Latest News)
-
కడుపు కోతలో తల్లిదండ్రులు.. చిన్నారి మృతదేహాన్ని వదిలేసిన విమాన సిబ్బంది
-
లింక్డ్ఇన్లో పోస్ట్ డిలీట్.. మైక్రోసాఫ్ట్తో ఓలా కటీఫ్
-
గవర్నర్ వీడియోల పెన్డ్రైవ్ ఉంది.. మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు
-
ఓడినా.. గెలిచినా పట్టించుకోరు.. ధోనీ ఎంటర్టైన్ చేస్తున్నాడంతే: సెహ్వాగ్
-
ఛత్తీస్గడ్లో మావోయిస్టుల కోటకు బీటలు.. దండకారణ్యంలో భద్రతా దళాల దూకుడు
-
‘ఎర్ర బంగారానికి’ యుద్ధం సెగ.. కేజీ ధర @ రూ.5 లక్షలు