ఆయిల్పాం తోటలకు నీటి కొరత
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్రోత్సహిస్తున్న ఆయిల్పాం సాగుపై కరవు ప్రభావం పడుతోంది. భూగర్భజలాలు అడుగంటడంతో బోర్లలో నీరు అందక, ఈ తోటల్లో బిందుసేద్యం పరికరాలు సరిగా పనిచేయక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
చిట్యాల: వెంకటాపురంలో నీటి కొరత ఎదుర్కొంటున్న ఆయిల్పాం తోట
నకిరేకల్, న్యూస్టుడే: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్రోత్సహిస్తున్న ఆయిల్పాం సాగుపై కరవు ప్రభావం పడుతోంది. భూగర్భజలాలు అడుగంటడంతో బోర్లలో నీరు అందక, ఈ తోటల్లో బిందుసేద్యం పరికరాలు సరిగా పనిచేయక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండల తీవ్రతకు క్రమంగా బోర్లు వట్టి పోతుండటంలో వడలి పోతున్న తోటలను కాపాడుకునేందుకు రైతులు భగీరథ ప్రయత్నం చేయాల్సి వస్తోంది. ఆరు నెలలు, ఏడాది లోపు వయసున్న తోటలను నీటి ఎద్దడి నుంచి కాపాడుకునేందుకు రైతులు కష్టాలు పడుతున్నారు.
వేల ఎకరాలపై ప్రభావం
ఉమ్మడి జిల్లాలో 16 వేల ఎకరాలకుపైగా ఆయిల్పాంను రైతులు సాగుచేస్తున్నారు. భూగర్భ జలాలు వేగంగా అండుగంటుతుండటం, ఎండల తీవ్రత కొనసాగుతుండటంలో 4,500 ఎకరాల్లో ఆయిల్పాం సాగు నీటి సమస్యను ఎదుర్కొంటున్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేసినట్లు సమాచారం. ఈ సమస్యతో ఇతర జిల్లాల్లో తోటల సంరక్షణను రైతులు వదిలేస్తున్నారన్న సమాచారం అందుతుండటంతో ఉద్యానశాఖ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. తోటలను కాపాడుకునేందుకు అవసరమైన సూచనలు, సలహాలు అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నారు. ఆయిల్పాం మొక్కలు తాటి, ఈత, కొబ్బరి వంటి ఫామ్ జాతికి చెందినవైనందున నీటి ఎద్దడిని తట్టుకుంటాయని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.
రైతులు ఆందోళన చెందవద్దు
రావుల విద్యాసాగర్, ఉద్యానశాఖ క్లస్టర్ అధికారి, నకిరేకల్
ఆయిల్పాం సాగుచేస్తున్న రైతులు నీటి కొరత సమస్యతో ఆందోళన చెందవద్దు. రెండు మూడు నెలలు నీరు తగ్గడం వల్ల మొత్తం మొక్కలన్నీ చనిపోవు. ఎదుగుదలపై కొంత ప్రభావం ఉంటుంది. దీని వల్ల తోట మొత్తం నష్టం ఉండదు. నీటి సమస్య వల్ల చెట్లకు ఆడ గెలల స్థానంలో మగ గెలలు వచ్చే అవకాశం ఉంటుంది కానీ చెట్లు చనిపోవు. మొక్కల పాదుల్లో జనుము విత్తనాలు చల్లి నీరు పట్టడం వల్ల పాదుల్లో తేమ వాతావరణం కొనసాగుతుంది. వరి గడ్డి, వరి పొట్టు, వేరుశనగ పొట్టుతో ఒక దానితో పాదుల్లో కప్పి ఉంచడం వల్ల తేమ ఎక్కువ కాలం ఉంటుంది. వారం వరకు నీటి తడిని ఇవ్వలేని పరిస్థితులు ఉంటే 15-20 రోజులకు ఒకసారి లీటరు నీటిలో 5 గ్రాములు యూరియా కలిపి మొక్కలపై పిచికారి చేయాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపాను ఓడించాలి: సీపీఎం
[ 11-05-2024]
ప్రశ్నించే కమ్యూనిస్టులను పార్లమెంట్కు పంపించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్.వీరయ్య అన్నారు. -
ఎన్నికల్లో గెలుపు నాదే: చామల కిరణ్ కుమార్ రెడ్డి
[ 11-05-2024]
ప్రచారంలో ప్రజాధరణ చూస్తే గెలుపు తనదేనని తేలిపోయిందని భువనగిరి లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. -
భారాస ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
[ 11-05-2024]
భారాస ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్ గెలుపును కోరుతూ భువనగిరి పట్టణంలో పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. -
ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి
[ 11-05-2024]
నియోజకవర్గంలో పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు ఏర్పాటు పూర్తి చేసినట్లు కలెక్టర్ హనుమంతు కే జండగే తెలిపారు. -
జిల్లా కేంద్రంలో 2 కే రన్
[ 11-05-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజు జిల్లా కేంద్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట 2కే రన్ నిర్వహించారు. -
11 గుర్తింపు కార్డుల్లో ఏదైనా చూపి ఓటేయవచ్చు
[ 11-05-2024]
భారత ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ఓటరు జాబితాలో పేరు ఉన్నవారు ఓటు వేసే అధికారం ఉన్నప్పటికీ, ఆ పేరు గల వ్యక్తిని తానేనని నిరూపించుకోవాల్సి ఉంటుంది. -
మేమూ ఓటేశాం.. మరి మీరూ?
[ 11-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరకొచ్చింది. పల్లెల్లో మైకుల హోరు తగ్గింది. ఇక పోలింగ్ క్రతువే మిగిలి ఉంది. అభ్యర్థుల భవితవ్యం మరికొద్ది రోజుల్లో తేలనుంచి. సమర్థ నాయకత్వాన్ని ఎన్నుకునేందుకు ఓటర్లు, శతశాతం పోలింగ్కు అధికారగణం సిద్ధపడుతున్నారు. -
లోక్సభలో గళమెత్తా ..ప్రజాక్షేత్రంలో పోరాడా
[ 11-05-2024]
దేశంలో లోక్సభ కీలకమైన చట్టసభ. నల్గొండ లోక్సభ స్థానం నుంచి 1998లో సీపీఐ తరఫున సురవరం సుధాకర్రెడ్డి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. -
అతిథి తరలి రాగా.. అదిరే జనజాతర..!
[ 11-05-2024]
నకిరేకల్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా నిర్వహించిన కాంగ్రెస్ బహిరంగ సభ పార్టీ శ్రేణుల్లో జోష్ను నింపింది. -
నేటితో ప్రచారం పరిసమాప్తం
[ 11-05-2024]
గత నెల రోజులకు పైగా క్షేత్రస్థాయిలో ప్రధాన పార్టీలు, అభ్యర్థులు చేస్తున్న లోక్సభ ఎన్నికల ప్రచారానికి నేటి సాయంత్రం తెరపడనుంది -
పరిధి దాటితే కటకటాలే
[ 11-05-2024]
కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి అన్ని చర్యలు తీసుకుంటోంది. -
ఎన్నికల ఫైనల్ మ్యాచ్కు ఇంకా రెండ్రోజులే
[ 11-05-2024]
భారత్లో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు కొనసాగుతుండగా.. లోక్సభ ఎన్నికల క్రీడలూ ఈ మధ్యే మొదలయ్యాయి. దేశవ్యాప్తంగా ప్రధాన జట్ల (పార్టీల) మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. -
నకిలీ బంగారంతో బ్యాంకుకు బురిడీ
[ 11-05-2024]
నకిలీ బంగారం బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.53.89 లక్షలు స్వాహా చేసిన ఘటన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల పరిధిలోని రాయినిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో జరిగింది. -
మట్టపల్లిలో ముగిసిన విశ్వశాంతి మహాయాగం
[ 11-05-2024]
మట్టపల్లి క్షేత్రంలో 12 రోజులుగా నిర్వహిస్తోన్న విశ్వశాంతి మహాయాగం శుక్రవారం విశేష హోమాలు, ఆధ్యాత్మిక క్రతువులతో ముగిసింది. -
నాలుగు నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు నరకం: జగదీశ్రెడ్డి
[ 11-05-2024]
కేసీఆర్ నాయకత్వంలోని భారాసతోనే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. -
నారసింహుడి సన్నిధిలో ఊంజల్ సేవోత్సవం
[ 11-05-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో స్వయంభువులైన పంచనారసింహులకు శుక్రవారం నిత్యపూజలతో పాటు అమ్మవారిని ఆరాధిస్తూ ప్రత్యేక క్రతువులను ఆలయ ఆచారంగా కొనసాగించారు. -
‘రాజ్యాంగం రద్దుకు భాజపా కుట్ర’
[ 11-05-2024]
మోదీ మళ్లీ గెలిస్తే దేశం సర్వనాశనం అవుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు.