నిద్రలేమి.. నిండు ప్రాణాలు బలి
నిద్రలేమి కారణంగానే ఈ మధ్యలో ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రహదారి వెంబడి నిలిపి ఉంచిన వాహనాలను నేరుగా వచ్చి ఢీకొట్టడం వెనక గత రాత్రి డ్రైవర్లకు నిద్ర లేకుండా ఉండటం, ఏకాగ్రత లోపించడమే ప్రధాన కారణం.
ఈ చిత్రంలో లారీ కంటైనర్ కిందకు కారు దూసుకుపోవడంతో దంపతులిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన ఈ నెల 21న మునగాల మండలం ముకుందాపురం గ్రామ సమీపంలోని పెట్రోల్ బంకు దగ్గర చోటు చేసుకుంది. నవీన్రాజు, భార్గవి దంపతులు విజయవాడలో నివాసం ఉంటున్నారు. 20న భార్గవి పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్లో తల్లిదండ్రుల సమక్షంలో వేడుకలు నిర్వహించుకున్నారు. 21న ఉదయం ఐదు గంటలకు హైదరాబాద్ నుంచి విజయవాడకు బయలుదేరగా ఎనిమిది గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. రాత్రి సరైన నిద్ర లేకపోవడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ చిత్రంలో లారీని వెనక నుంచి కారు ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందడం అందరినీ కలచి వేసింది. వీరు హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. ఈ నెల 25న విజయవాడలో పుట్టు వెంట్రుకల కార్యక్రమం నిర్వహించేందుకు తెల్లవారుజామున ఒంటి గంటకే హైదరాబాద్ నుంచి బయలుదేరారు. 24న రాత్రి శుభకార్యానికి కావాల్సిన ఏర్పాట్లలో నిమగ్నమై ఉండి, నిద్ర లేకుండా విజయవాడకు బయలుదేరారు. డ్రైవర్ సీటులో కూర్చున్న కృష్ణంరాజుకు నిద్ర లేకపోవడంతో కోదాడ సమీపంలోకి రాగానే రహదారి వెంబడి నిలిపి ఉంచిన లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదానికి అతివేగంతో పాటు నిద్రలేమి ప్రధాన కారణమని పోలీసులు చెబుతున్నారు.
కోదాడ, న్యూస్టుడే: నిద్రలేమి కారణంగానే ఈ మధ్యలో ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రహదారి వెంబడి నిలిపి ఉంచిన వాహనాలను నేరుగా వచ్చి ఢీకొట్టడం వెనక గత రాత్రి డ్రైవర్లకు నిద్ర లేకుండా ఉండటం, ఏకాగ్రత లోపించడమే ప్రధాన కారణం. నిద్రలేమి, అతివేగంతో నడపడంతో వాహనాలు అదుపు తప్పి ప్రమాదాలు జరుగుతుండటంతో నిండు ప్రాణాలు ఆరిపోతున్నాయి.
ఉదయపు ప్రమాదాలే ఎక్కువ..
చాలా మంది పుట్టిన రోజు వేడుకలు, శుభకార్యాల పేరిట అర్ధరాత్రి దాటే వరకు డీజే పాటలతో నృత్యాలు చేస్తున్నారు. మరుసటి రోజు విరామం లేకుండా వారి పనుల నిమిత్తం దూరపు ప్రయాణాలు చేస్తున్నారు. దీంతో సరైన నిద్ర లేకపోవడంతో వాహనం నడిపేటపుడు కునుకు తీస్తుంటారు. ఈ మధ్య కాలంలో జరిగిన అన్ని ప్రమాదాలు ఉదయమే చోటు చేసుకోవడం గమనార్హం. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో సుమారు 200లకు పైగా ప్రమాదాలు జరగగా, వాటిలో 100 మందికి పైగా మరణించడం గమనార్హం. మరో 200 మంది ప్రమాదంలో గాయపడి దివ్యాంగులుగా మారారు.
నిద్రలేమితో వాహనాలు నడపొద్దు
రాహుల్ హెగ్డే, జిల్లా ఎస్పీ
ఈ మధ్య కాలంలో జిల్లాలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటం బాధాకరం. వాహనం నడిపే వ్యక్తులకు సరైన నిద్ర ఉండట్లేదని మా విచారణలో తెలుస్తోంది. వివిధ కార్యక్రమాల పేరిట సరైన నిద్ర లేకుండా మరుసటి రోజు వాహనాన్ని నడిపి ప్రమాదాల బారిన పడుతున్నారు. నిద్రలేమి, మద్యం తాగి ఉండటంతోనే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. డ్రైవర్లు నిద్రలేమితో వాహనాలు నడపొద్దు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
[ 11-05-2024]
భారాస ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్ గెలుపును కోరుతూ భువనగిరి పట్టణంలో పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. -
ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి
[ 11-05-2024]
నియోజకవర్గంలో పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు ఏర్పాటు పూర్తి చేసినట్లు కలెక్టర్ హనుమంతు కే జండగే తెలిపారు. -
జిల్లా కేంద్రంలో 2 కే రన్
[ 11-05-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజు జిల్లా కేంద్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట 2కే రన్ నిర్వహించారు. -
11 గుర్తింపు కార్డుల్లో ఏదైనా చూపి ఓటేయవచ్చు
[ 11-05-2024]
భారత ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ఓటరు జాబితాలో పేరు ఉన్నవారు ఓటు వేసే అధికారం ఉన్నప్పటికీ, ఆ పేరు గల వ్యక్తిని తానేనని నిరూపించుకోవాల్సి ఉంటుంది. -
మేమూ ఓటేశాం.. మరి మీరూ?
[ 11-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరకొచ్చింది. పల్లెల్లో మైకుల హోరు తగ్గింది. ఇక పోలింగ్ క్రతువే మిగిలి ఉంది. అభ్యర్థుల భవితవ్యం మరికొద్ది రోజుల్లో తేలనుంచి. సమర్థ నాయకత్వాన్ని ఎన్నుకునేందుకు ఓటర్లు, శతశాతం పోలింగ్కు అధికారగణం సిద్ధపడుతున్నారు. -
లోక్సభలో గళమెత్తా ..ప్రజాక్షేత్రంలో పోరాడా
[ 11-05-2024]
దేశంలో లోక్సభ కీలకమైన చట్టసభ. నల్గొండ లోక్సభ స్థానం నుంచి 1998లో సీపీఐ తరఫున సురవరం సుధాకర్రెడ్డి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. -
అతిథి తరలి రాగా.. అదిరే జనజాతర..!
[ 11-05-2024]
నకిరేకల్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా నిర్వహించిన కాంగ్రెస్ బహిరంగ సభ పార్టీ శ్రేణుల్లో జోష్ను నింపింది. -
నేటితో ప్రచారం పరిసమాప్తం
[ 11-05-2024]
గత నెల రోజులకు పైగా క్షేత్రస్థాయిలో ప్రధాన పార్టీలు, అభ్యర్థులు చేస్తున్న లోక్సభ ఎన్నికల ప్రచారానికి నేటి సాయంత్రం తెరపడనుంది -
పరిధి దాటితే కటకటాలే
[ 11-05-2024]
కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి అన్ని చర్యలు తీసుకుంటోంది. -
ఎన్నికల ఫైనల్ మ్యాచ్కు ఇంకా రెండ్రోజులే
[ 11-05-2024]
భారత్లో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు కొనసాగుతుండగా.. లోక్సభ ఎన్నికల క్రీడలూ ఈ మధ్యే మొదలయ్యాయి. దేశవ్యాప్తంగా ప్రధాన జట్ల (పార్టీల) మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. -
నకిలీ బంగారంతో బ్యాంకుకు బురిడీ
[ 11-05-2024]
నకిలీ బంగారం బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.53.89 లక్షలు స్వాహా చేసిన ఘటన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల పరిధిలోని రాయినిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో జరిగింది. -
మట్టపల్లిలో ముగిసిన విశ్వశాంతి మహాయాగం
[ 11-05-2024]
మట్టపల్లి క్షేత్రంలో 12 రోజులుగా నిర్వహిస్తోన్న విశ్వశాంతి మహాయాగం శుక్రవారం విశేష హోమాలు, ఆధ్యాత్మిక క్రతువులతో ముగిసింది. -
నాలుగు నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు నరకం: జగదీశ్రెడ్డి
[ 11-05-2024]
కేసీఆర్ నాయకత్వంలోని భారాసతోనే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. -
నారసింహుడి సన్నిధిలో ఊంజల్ సేవోత్సవం
[ 11-05-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో స్వయంభువులైన పంచనారసింహులకు శుక్రవారం నిత్యపూజలతో పాటు అమ్మవారిని ఆరాధిస్తూ ప్రత్యేక క్రతువులను ఆలయ ఆచారంగా కొనసాగించారు. -
‘రాజ్యాంగం రద్దుకు భాజపా కుట్ర’
[ 11-05-2024]
మోదీ మళ్లీ గెలిస్తే దేశం సర్వనాశనం అవుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు.
తాజా వార్తలు (Latest News)
-
నేను ఏ నిర్ణయం తీసుకొన్నా షారుక్ మద్దతు ఉంటుంది: గంభీర్
-
ఓటర్ల కోసం ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు: ఎండీ ద్వారకా తిరుమలరావు
-
కడుపు కోతలో తల్లిదండ్రులు.. చిన్నారి మృతదేహాన్ని వదిలేసిన విమాన సిబ్బంది
-
లింక్డ్ఇన్లో పోస్ట్ డిలీట్.. మైక్రోసాఫ్ట్తో ఓలా కటీఫ్
-
గవర్నర్ వీడియోల పెన్డ్రైవ్ ఉంది.. మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు
-
ఓడినా.. గెలిచినా పట్టించుకోరు.. ధోనీ ఎంటర్టైన్ చేస్తున్నాడంతే: సెహ్వాగ్