ఓటెత్తేలా.. స్ఫూర్తి చాటేలా..!
లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంపొందించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది.
దివ్యాంగులు, వృద్ధులకు ప్రత్యేక సౌకర్యాలు
కుడకుడలో శాసనసభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వరుసలో ఉన్న ఓటర్లు
సూర్యాపేట కలెక్టరేట్, న్యూస్టుడే: లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంపొందించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. ప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకునేలా అవగాహన, స్వీప్ కార్యక్రమాలను ముమ్మరంగా చేపడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో దివ్యాంగులు 96 శాతం, వృద్ధులు 87, ట్రాన్స్జెండర్లు వంద శాతం ఓటుహక్కు వినియోగించుకుని పలువురికి స్ఫూర్తిగా నిలిచారు. ఎన్నికల సంఘం వికలాంగులు, వృద్ధులకు కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని గత అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో అత్యధికంగా ఓటు వేశారు. వృద్ధులు, మంచానికే పరిమితమైన వారికి ఇంటి వద్ద ఓటు వేయించడం, దివ్యాంగులను ఆటోలో పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లి ప్రత్యేక వరుసలో వీల్ఛైర్లతో వాలంటీర్ల సహకారంతో ఓటేయించడం, ట్రాన్స్జెండర్లకు ఓటు ఆవశ్యకత గురించి అధికారుల పూర్తి స్థాయి అవగాహన కల్పించడంతో వారి ఓటింగ్ శాతం పెరిగింది. ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లోనూ ఇప్పటికే ఇంటి వద్దే ఓటింగ్కు సంబంధించి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. పోలింగ్ కేంద్రాల్లోనూ వృద్ధులకు వీల్ఛైర్ల ఏర్పాటు, ర్యాంపుల నిర్మాణం తదితర పనులు చేపడుతున్నారు. ఆ సౌకర్యాలను వినియోగించుకొని లోక్సభ ఎన్నికల్లో ఓటుహక్కును సద్వినియోగం చేసుకుని స్ఫూర్తిని నిలుస్తామని పలువురు ఓటర్లు ‘న్యూస్టుడే’కు తెలిపారు.
ప్రత్యేక వెసులుబాటు హర్షణీయం
-ఎం.లక్ష్మయ్య, వృద్ధుడు
వృద్ధులకు పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక వెసులుబాటు కల్పించడం హర్షణీయం. గత అసెంబ్లీ ఎన్నికల్లో 80 సంవత్సరాలు పైబడిన వారికి ఇంటి వద్ద ఓటు వేయించడంతో ఓటింగ్ శాతం పెరిగింది. ఈ సారి 85 సంవత్సరాలు పైబడిన వారికి ఎన్నికల సంఘం ఈ అవకాశం కల్పిస్తోంది. పోలింగ్ కేంద్రాల్లోనూ ఓటర్లు బారులు తీరినట్లయితే వృద్ధులను వాలంటీర్లు గుర్తించి వారికి మరో వరుసలో తీసుకెళ్లి ఓటు వేసేలా అవకాశం కల్పించడం బాగుంది.
సౌకర్యాలు బాగున్నాయి
-కె.సైదులు, దివ్యాంగుడు
పోలింగ్ కేంద్రాల్లో దివ్యాంగులకు నిబంధనల మేరకు కల్పిస్తున్న సౌకర్యాలు బాగున్నాయి. వీల్ఛైర్లు, ఆటోలు, వాలంటీర్లను ఏర్పాటు చేయించడంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో 96 శాతం మందిమి ఓటుహక్కు సద్వినియోగం చేసుకున్నాం. ఈ ఎన్నికల్లోనూ వంద శాతం ఓటు వేసేందుకు మాతోటి వారందరికీ అవగాహన కల్పిస్తున్నాం.
స్వేచ్ఛగా సద్వినియోగం
-శ్రీలేఖ్య, ట్రాన్స్జెండర్
మాపై ఎలాంటి వివక్ష చూపకుండా రాజ్యాంగం ఓటుహక్కు కల్పించడంతో స్వేచ్ఛగా సద్వినియోగం చేసుకున్నాం. జిల్లాలో పాలనాధికారి గత ఎన్నికల్లో తొలిసారిగా ఓటరు గుర్తింపు కార్డులు అందించారు. తొలిసారిగా జిల్లాలో ఉన్న 55 మంది ట్రాన్స్జెండర్లం ఓటు వేశాం. ఈ ఎన్నికల్లోనూ ఓటుహక్కును సద్వినియోగం చేసుకుంటాం.
జిల్లాలో వికలాంగులు, వృద్ధులు, ట్రాన్స్జెండర్ ఓటర్ల వివరాలు
వృద్ధులు 17,216
85 సంవత్సరాల పైబడిన వారు 6,425
దివ్యాంగులు 13,421
ట్రాన్స్జెండర్లు 55
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిర్భయంగా ఓటుహక్కు వినియోగించుకోండి: కలెక్టర్
[ 13-05-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా 2061 పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లను పూర్తిచేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దాసరి హరిచందన తెలిపారు. -
ఈ రోజు మనదే..!
[ 13-05-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలక క్రతువైన పోలింగ్కు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. నేటి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది -
స్వయంవరంలో.. ఆ ఇద్దరు
[ 13-05-2024]
ఇది ఐదేళ్ల ఒప్పంద వేడుక. దీనికి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇద్దరు వధువులు (ఎంపీ స్థానాలు) స్వయంవరం ప్రకటించుకున్నారు -
గడప దాటిస్తే.. గండం గడిచినట్లే
[ 13-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ సమయం రానే వచ్చింది. ఇన్నాళ్లుగా ఓటర్లను ఆకట్టుకోవడానికి చేసిన ప్రచారం ఒక ఎత్తైతే.. పోలింగ్ రోజు ఓటర్లను ఇంటి గడప దాటించి పోలింగ్ కేంద్రానికి రప్పించి ఓట్లేయించడం ఇంకో ఎత్తు. కొన్నేళ్లుగా లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదవుతోంది. -
ఎన్నికల కేసులో ఇరుక్కోకు తమ్ముడూ..!
[ 13-05-2024]
లోక్సభ ఎన్నికల వేళ పోలింగ్ కేంద్రాల వద్ద యువత జాగ్రత్తగా వ్యవహరించాలి. రాజకీయ నేతలు చెప్పారనో.. ప్రలోభాలకు లొంగిపోయో ఎన్నికల వేళ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే కేసుల్లో ఇరుక్కునే ప్రమాదం ఉంది. ముఖ్యంగా యువత ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. -
ఆదర్శ కళాశాలలు పిలుస్తున్నాయ్..!
[ 13-05-2024]
ఆదర్శ కళాశాలల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో చేరేందుకు ప్రభుత్వం ఈ నెల 9న ప్రకటన విడుదల చేసింది. -
మనోళ్లు ఓటేసేదిక్కడే!
[ 13-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ సోమవారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. -
పకడ్బందీగా... ప్రణాళికగా
[ 13-05-2024]
లోక్సభ ఎన్నికల సందర్భంగా సోమవారం జిల్లావ్యాప్తంగా జరిగే పోలింగ్కు అన్ని ఏర్పాట్లు చేపట్టామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటరావు తెలిపారు. -
ప్రలోభాలకు గురిచేస్తే చర్యలు: ఎస్పీ
[ 13-05-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో పటిష్ఠమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు -
పదండి..ఓటేద్దాం..!
[ 13-05-2024]
భువనగిరి లోక్సభ నియోజకవర్గంలో సోమవారం పోలింగ్ నిర్వహించేందుకు యంత్రాంగం సర్వసన్నద్ధమైంది. తుది ఏర్పాట్లను పూర్తి చేసింది -
పంపిణీ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
[ 13-05-2024]
భువనగిరి లోక్సభ స్థానం పరిధిలో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో ఆలేరు అసెంబ్లీ సెగ్మెంట్కు ఏర్పాటు చేసిన పోలింగ్ సామగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రాన్ని ఆదివారం జిల్లా కలెక్టర్, ఆర్వో హన్మంతు కె.జెండగే పరిశీలించారు -
అంతా గుట్టుగా..!
[ 13-05-2024]
రసవత్తర పోరుకు వేదికగా మారిన భువనగిరి లోక్సభ నియోజకవర్గంలో అన్ని పార్టీల అభ్యర్థులు పోల్ మేనేజ్మెంట్పై దృష్టిపెట్టాయి
తాజా వార్తలు (Latest News)
-
గుజరాత్ ఆశలపై నీళ్లు చల్లిన వరుణుడు.. కోల్కతాతో మ్యాచ్ రద్దు
-
రాహుల్తో చర్చకు భాజపా రెడీ.. యువ నాయకుడికి అవకాశం
-
మహిళ కిడ్నాప్ కేసు.. హెచ్డీ రేవణ్ణకు బెయిల్
-
అది టీకప్పులో తుపానులాంటిది.. కేఎల్ రాహుల్-సంజీవ్ గోయెంకా ఎపిసోడ్పై ఎల్ఎస్జీ
-
కుప్పకూలిన భారీ హోర్డింగ్.. ఎనిమిది మంది మృతి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM