సినీ ఫక్కీలో ఎల్లయ్య హత్య
గత నెల 19న ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటకు వచ్చి అదృశ్యమైనట్లు కేసు నమోదైన సూర్యాపేట మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు వడ్డె ఎల్లయ్యను కొంతమందితో కలిసి హత్య చేసినట్లు సూర్యాపేట జిల్లాకు చెందిన తాడూరి శ్రీకాంతరాజు (చారి) ఒప్పుకొన్నారు.
హత్యకు గురైన వడ్డె ఎల్లయ్య
జగ్గయ్యపేట, న్యూస్టుడే: గత నెల 19న ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటకు వచ్చి అదృశ్యమైనట్లు కేసు నమోదైన సూర్యాపేట మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు వడ్డె ఎల్లయ్యను కొంతమందితో కలిసి హత్య చేసినట్లు సూర్యాపేట జిల్లాకు చెందిన తాడూరి శ్రీకాంతరాజు (చారి) ఒప్పుకొన్నారు. ఈ మేరకు ఆయన తహసీలా్దార్ ఎదుట లొంగిపోగా సీఐ జానకీరాం కోర్టులో హాజరుపరిచారు. జగ్గయ్యపేటలోని అద్దె ఇంట్లో చారి తన అనూయాయులతో కలిసి ఎల్లయ్యను హత్య చేయడంతో పాటు మృతదేహం దొరకకుండా దూరంగా తరలించారు. మృతదేహం, నిందితుల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని ఎస్సై సూర్యభగవాన్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లయ్య, చారి జన జీవన స్రవంతిలో మాజీ నక్సలైట్లుగా జీవనం సాగిస్తూ... ప్రస్తుతం స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నారు. డబ్బుల విషయమై వారి మధ్య వివాదం ఏర్పడి గొడవలు పెద్దవయ్యాయి. ఎలాగైనా ఎల్లయ్యను హత మార్చాలని నిర్ణయించుకున్న శ్రీకాంతాచారి.. పథకం ప్రకారం.. గత నెల మొదటి వారంలోనే జగ్గయ్యపేట శివారులో ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. ఎల్లయ్యను అక్కడికి రప్పించేందుకు హైదరాబాద్కు చెందిన మహిళను, సూర్యాపేటకు చెందిన ఒకరిని సహ జీవన దంపతులుగా చిత్రీకరించారు. వారి మధ్య నగదు లావాదేవీల వివాదం ఉందని, సెటిల్మెంట్ చేసేందుకు రావాలని ఎల్లయ్యను జగ్గయ్యపేటకు పిలిచారు. తొలుత ఏప్రిల్ 16న జగ్గయ్యపేట బయలుదేరిన ఎల్లయ్యతో పాటు మిత్రుడు అంజయ్య వస్తున్నాడని తెలిసి నిందితుడు అకస్మాత్తుగా ప్లాన్ మార్చాడు. 18న రావాలని సూచించాడు. ఆ రోజు దంపతులతో పాటు అనుచరులతో జగ్గయ్యపేట చేరుకున్న నిందితుడు విజయవాడ రోడ్డులోని ఎస్జీఎస్ కళాశాల సమీపంలోని టీ పాకలో ఎల్లయ్య, అంజయ్యలను కలిశారు. అక్కడ మాట్లాడుకున్నాక.. ఇక్కడ సొమ్ము ఇస్తే బాగుండదని, మహిళకు డబ్బులు ఇచ్చేందుకు దగ్గర్లోని తన ఇంటికి రావాలని ఎల్లయ్యను చారి పిలిచాడు. మహిళతో పాటు అంజయ్యను అక్కడే ఉండమన్నారు. తాను మూత్రశాలకు వెళ్లాలని ఆమె చెప్పడంతో జగ్గయ్యపేట బస్టాండ్కి కారులో అంజయ్య తీసుకెళ్లారు. తిరిగి ఆమె రాకపోవడంతో అనుమానంతో అంజయ్య ఫోన్లు చేశారు. ఎవరూ ఎత్తకపోవడంతో ఎల్లయ్య సోదరుడు సతీష్కి విషయాన్ని తెలియజేశారు. అద్దె ఇంట్లో ఎల్లయ్యను తన అనుచరుల సాయంతో చారి చంపేశాడు. మృతదేహాన్ని చేపలు రవాణా చేసే బాక్సులో ఉంచి లారీలో విశాఖపట్నం పంపారు. మృతదేహంతో పాటు వినియోగించిన ఫోన్లు, సిమ్ కార్డులు సముద్రంలో పడేసేలా పథకం రూపొందించుకున్నారు. పోలీసులు ప్రస్తుతం వాటి కోసం గాలిస్తున్నారు. ఇప్పటికే 34 కేసుల్లో ముద్దాయైన శ్రీకాంతాచారి ఈ హత్యను తమ ప్రాంతంలో చేస్తే పోలీసులకు దొరికిపోతానని జగ్గయ్యపేటను ఎంచుకున్నాడని పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎవరికో పట్టం..!
[ 15-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసి అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తం అయింది.గెలుపుపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. బూత్లు, గ్రామాల వారీగా ఓట్ల లెక్కలతో కుస్తీ పడుతున్నారు. -
ప్రవేశాల సమయం.. సన్నద్ధతతో విజయం
[ 15-05-2024]
ఇంటర్మీడియట్లో 2024-25 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు తొలి విడత ప్రక్రియ మొదలైంది. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ప్రారంభించాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
చైతన్యకొండ..!
[ 15-05-2024]
లోక్సభ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రెండు స్థానాల్లోనూ భారీగా పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికల్లో తుది గణాంకాలను మంగళవారం వెల్లడించింది. -
ఆమె ఇంట్లోనే ఉండిపోయింది..!
[ 15-05-2024]
ఉమ్మడి జిల్లాలో సోమవారం జరిగిన లోక్సభ ఎన్నికల్లో మహిళలు ఓటింగ్కు అంతగా ఆసక్తి చూపలేదు. జిల్లాలోని రెండు లోక్సభ స్థానాలైన నల్గొండ, భువనగిరిలో ఓటర్ల పరంగా మహిళలే ముందంజలో ఉన్నప్పటికీ పోలింగ్ -
ఈవీఎంలలో అభ్యర్థుల భవితవ్యం
[ 15-05-2024]
లోక్సభ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ముగియడంతో ఈవీఎంలు స్ట్రాంగ్రూంలకు తరలించారు. నల్గొండ లోక్సభ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ, సూర్యాపేట, నల్గొండ అసెంబ్లీ -
ఆయువు తీస్తున్న పిడుగు
[ 15-05-2024]
నిన్నా మొన్నటి వరకు ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా నమోదయ్యాయి. ఎండల తీవ్రతతో ప్రజలు బెంబేలెత్తారు. ఇటీవల వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని ఈదురుగాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. -
అటకెక్కిన చలువ పైకప్పు
[ 15-05-2024]
భానుడు తన ప్రతాపాన్ని చూపుతూనే ఉన్నాడు. మేఘాలు కమ్ముకొన్నప్పుడు మినహా ఈ నెలలో ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే జిల్లాలో 40పైగా డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతోంది. -
మళ్లీ అగ్రస్థానమే..!
[ 15-05-2024]
భువనగిరి లోక్సభ నియోజకవర్గంలోని ప్రజలు ఓటుకు జైకొట్టారు. ఎన్నికేదైనా మరోసారి రాష్ట్రంలో అగ్రస్థానాన్ని నిలుపుకొని ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటారు. రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలు ఉండగా.. అత్యధికంగా ఇక్కడే 76.78శాతం నమోదు కావడం విశేషం. -
బాలికల విద్యకు భరోసా.. కస్తూర్బా
[ 15-05-2024]
ప్రస్తుత కాలంలో కార్పొరేటు స్థాయి పాఠశాల, కళాశాల విద్యనభ్యసించాలంటే దూర ప్రాంతాలకు వెళ్లి రూ.లక్షలు పెట్టాల్సిందే. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు తమ పిల్లల చదువు కోసం అన్ని రూపాయలు ఖర్చు పెట్టాలంటే సాధ్యం కానీ విషయమే. -
ఎన్నికలు తెచ్చిన లాభాలు!
[ 15-05-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఆర్టీసీ లాభాల పంట పండింది. ఎన్నికలకు ప్రత్యేకంగా ఉమ్మడి జిల్లా నుంచి 290 బస్సులను అద్దె ప్రాతిపదికన పంపగా.. సుమారు రూ.1.50 కోట్ల ఆదాయం రాగా.. -
పల్లెవించె.. పట్టణం నీరసించె
[ 15-05-2024]
నల్గొండ, భువనగిరి లోక్సభ ఎన్నికల్లో పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణంలోనే ఓటర్లు ఎక్కువ చైతన్యం చూపారు. దేవరకొండ లాంటి మారుమూల ప్రాంతాల్లో మాత్రం పోలింగ్ శాతం తక్కువగా నమోదైనా 2019 ఎన్నికలతో పోలిస్తే పెరిగింది. -
రద్దీ తగ్గింది
[ 15-05-2024]
జాతీయ రహదారిపై వాహనాల రద్దీ తగ్గింది. వచ్చిన వాహనాలు వచ్చినట్టుగా టోల్ప్లాజాను దాటి హైదరాబాద్ వైపు వస్తున్నాయి. మంగళవారం ఒక్కరోజే విజయవాడ వైపు నుంచి హైదరాబాద్కు పంతంగి టోల్గేట్లోంచి 30వేల వాహనాలు వచినట్లు లెక్క తేలింది. -
బోర్లు, బావులవైపే ఆసక్తి
[ 15-05-2024]
సాగర్ ఆయకట్టులో ఈసారి వానాకాలంలో సైతం బావులు, బోర్లు నీటి వనరులుగా మారే అవకాశాలే ఎక్కువగా కన్పిస్తున్నాయి. ఎల్నినో ప్రభావం జులై వరకు ఉంటుందని వాతావరణ శాఖ చెబుతుండటంతో ఆగస్టులో వర్షాలు పడతాయనే నమ్మకం కలుగుతోంది. -
వరస చోరీలతో కర్షకుల కంటతడి
[ 15-05-2024]
ప్రకృతి వైపరీత్యాలతో తల్లడిల్లుతున్న కర్షకులకు నియంత్రికలు, వ్యవసాయ మోటార్లలో రాగితీగను అపహరించే దొంగల ముఠాలు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. -
ట్రావెల్ బస్సు ఢీకొని కార్మికుడి మృతి
[ 15-05-2024]
తుప్రాన్పేట శివారులో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కార్మికుడు మృతి చెందినట్లు పోలీస్ ఇన్స్పెక్టర్ అశోక్రెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
పిఠాపురంలో పవనోత్సాహం.. అత్యధికంగా పోలింగ్ నమోదు
-
మధ్యవర్తి వంచన.. వలస జీవులు కాలినడకన
-
నిశిరాత్రిలో ఘోరం.. అయిదుగురి సజీవదహనం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (15/05/24)
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
-
అమెరికాలో చైనా ‘సైన్యం’.. ట్రంప్ ప్రచారంపై రచ్చ!