కుటుంబ వైద్యం.. దైన్యం
స్థానికులకు మెరుగైన వైద్య సేవలందించటానికి గ్రామీణ ప్రాంతాల్లో విలేజ్ హెల్త్ క్లినిక్లు నిర్మాణానికి మూడేళ్ల క్రితం వైకాపా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
ప్రచారానికే పరిమితం
వైకాపా ప్రభుత్వ తీరు
వరికుంటపాడు మండలం విరువూరులో ప్రారంభం కాని హెల్త్ క్లినిక్ భవనం
దుత్తలూరు, వరికుంటపాడు, న్యూస్టుడే: స్థానికులకు మెరుగైన వైద్య సేవలందించటానికి గ్రామీణ ప్రాంతాల్లో విలేజ్ హెల్త్ క్లినిక్లు నిర్మాణానికి మూడేళ్ల క్రితం వైకాపా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వీటి నిర్మాణాలు చేపట్టి మూడేళ్లవుతున్నా పనులు ముందుకు సాగలేదు. గత ఏడాది మార్చి ఒకటో తేదీ నుంచి ప్రయోగాత్మకంగా చేపట్టిన ఫ్యామిలీ ఫిజీషియన్ కార్యక్రమం ఇతర సేవలు ప్రచారాలకే పరిమితమయ్యాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ వైద్యం అందటం గగనంగా మారింది.
- ఉదయగిరి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో 93 సచివాలయాలున్నాయి. మొదటి విడతగా 82 ఆరోగ్య కేంద్రాలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఆరోగ్య కేంద్రాల భవనాలను పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్మించాలి. ఒక్కో భవనానికి రూ. 17.50 లక్షల వంతున నిధులు కేటాయించారు.
- నియోజకవర్గానికి మంజూరైన 82 భవనాల్లో 54 మాత్రమే ఇప్పటి వరకు పూర్తయ్యాయి. కొన్ని మండలాల్లో భవనాలు పూర్తి అయినా గుత్తేదారులకు బిల్లులు చెల్లించలేదు. దీంతో వాటిని అధికారులకు అప్పగించలేదు. ఆరు భవనాలు పలు కారణాలతో పనుల ప్రారంభానికే నోచుకోలేదు.
- ప్రయోగాత్మకంగా చేపట్టిన ఫ్యామిలీ ఫిజీషియన్ విధానాన్ని(ఎఫ్పీˆసీˆ) పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు అన్ని క్లినిక్లను సిద్ధం చేయాలని ఇటీవల ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా పురోగతి లేదు. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన కొన్ని భవనాల్లో ఎఫ్సీˆపీˆ సేవలు కొనసాగుతున్నాయి.
- వసతికి సంబంధించిన సమస్యలు వేధిస్తుండటంతో వైద్య సిబ్బందితోపాటు స్థానికులుతీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని గ్రామాల్లో పాఠశాలల్లోని చెట్ల కింద వైద్య సేవలు అందిస్తున్నారు.
ఆరుబయటే సేవలు
గుండాల కృష్ణారెడ్డి, సోమలరేగడ
దుత్తలూరు మండలం సోమలరేగడలో మూడేళ్ల క్రితం విలేజ్ హెల్త్క్లినిక్ భవనం మంజూరైంది. అయినా ఇప్పటి వరకు ఈ భవనం పూర్తి కాలేదు. ప్రతి పదిహేను రోజులకొకసారి వైద్య సిబ్బంది వచ్చి పాఠశాల ఆవరణలోనే ఆరు బయట ఉండి స్థానికులకు సేవలందిస్తున్నారు. అరకొర సేవలతో స్థానికులు, వైద్య సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జనంపై జగన్ బాదుడు!
[ 11-05-2024]
ప్రతిపక్ష హోదాలో ఊరూరా తిరుగుతూ.. ధరలు, పన్నులపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన జగన్మోహన్రెడ్డి.. అధికారంలోకి రాగానే వాటిని రెట్టింపు చేశారు. -
పేదల జాగాల్లో భూచోళ్లు
[ 11-05-2024]
వెంకటాచలం మండలం చౌటపాళెం పంచాయతీ పరిధిలోని సర్వే నంబరు 1062, 1063లో యర్రగుంట వద్ద వేసిన లేఅవుట్లో తొలుత యర్రగుంట, చౌటపాళెం గ్రామాల్లోని పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించారు. -
ప్రభుత్వ కార్యాలయాల్లో భయం భయం!
[ 11-05-2024]
జిల్లాలో కీలక సేవలందించే ప్రభుత్వ ఆసుపత్రి, గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య విభాగం, తదితర భవనాల నిర్వహణను యంత్రాంగం పూర్తిగా గాలికొదిలేసింది. -
గుంతలు.. గంతలు
[ 11-05-2024]
రహదారులు అభివృద్ధి చేశామని వైకాపా ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి దారుణంగా ఉంది. అయిదేళ్లలో చాలావరకు కనీసం మరమ్మతులు చేపట్టలేదు. కొన్నింటికి తట్టమట్టి పోసిన దాఖలాలు లేవు. -
రంగు మార్తాండ.. ప్రచార యావ
[ 11-05-2024]
గ్రామాల్లో సక్రమంగా మురుగు కాలువలు లేవు. వాటిని శుభ్రం చేయించడానికి సొమ్ములు లేవు. ఎప్పుడో ఏర్పాటు చేసిన తాగునీటి పైపులైన్లే దిక్కు. -
ఇచ్చేది గోరంత... వసూలు కొండంత
[ 11-05-2024]
‘అక్కచెల్లెమ్మలకు అండగా ఉంటానని జగన్ చెప్పిన మాటలను నమ్మినందుకు నట్టేట ముంచారు. నవరత్నాలు కాదు.. -
ముస్లిం రిజర్వేషన్లు ఆపాలని యత్నించారు: ఆనం
[ 11-05-2024]
ముస్లిం రిజర్వేషన్లు ఆపాలంటూ కోర్టుకెళ్లిన ఆర్.కృష్ణయ్యని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎం.పి.గా చేశారని ఆత్మకూరు తెదేపా అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. -
మూడు రోజుల్లో సర్వేపల్లికి కాకాణి నుంచి విముక్తి
[ 11-05-2024]
మరో మూడు రోజుల్లో మంత్రి కాకాణి అరాచక పాలన నుంచి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు విముక్తి పొందనున్నారని తెదేపా అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అన్నారు. -
తెదేపా పాలనలోనే అభివృద్ధి
[ 11-05-2024]
తెదేపాతోనే అభివృద్ధి సాధ్యమని తెదేపా నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి అన్నారు. -
12 రకాల గుర్తింపు కార్డులతో ఓటుహక్కు
[ 11-05-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ రోజున ఓటరు కార్డుతో పాటు 12 రకాల గుర్తింపు కార్డులతో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.హరినారాయణన్ తెలిపారు. -
రెండు రోజులు మద్యం దుకాణాలు బంద్
[ 11-05-2024]
ఎన్నికల నేపథ్యంలో రెండు రోజులు మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు, కల్లు కేంద్రాలు మూసివేయనున్నట్లు జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారి నాగమల్లేశ్వరి ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఓటేసేందుకు తరలివస్తున్నారు.. గన్నవరం విమానాశ్రయంలో పెరిగిన రద్దీ
-
డెంగీ రాకను చెప్పే హిందూ మహాసముద్రం
-
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్