logo

చంద్రబాబును కలిసిన మాలేపాటి

తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు మాలేపాటి సుబ్బానాయుడు తెదేపా అధినేత చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు.

Updated : 28 Apr 2024 13:19 IST

కావలి: తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు మాలేపాటి సుబ్బానాయుడు తెదేపా అధినేత చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కావలి నియోజకవర్గంలో పార్టీ స్థితిగతుల గురించి చంద్రబాబు సుబ్బానాయుడిని అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గంలో తెదేపా జెండా ఎగరవేసే బాధ్యత మీకు ఇచ్చానని, సక్రమంగా నిర్వహించాలని పేర్కొన్నారు. కావలి నియోజకవర్గాన్ని తెదేపా కైవసం చేసుకోవడం ఖాయమని సుబ్బానాయుడు చంద్రబాబుకు హామీ ఇచ్చారు. 

తెదేపాలో చేరిన వైకాపా నేత

కావలి: కావలి పట్టణ వైకాపా నాయకుడు గొట్టిపాటి మధుసూధన్‌రావు తెదేపాలో చేరారు. ఎన్డీయే కూటమి ఉమ్మడి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని