సమకూరని మౌలిక వసతులు
మండలంలోనే పెద్ద పంచాయతీ బ్రాహ్మణక్రాక అరుంధతి వాడలోని అంతర్గత రోడ్డు ఇది. మురుగు నీటి కాలువలు పూడి పోయాయి. దిగువ ప్రాంతాలకు మురుగు పారక..రోడ్డుపై నిల్వ ఉంది. కాలనీ వాసులు ఈ రోడ్డుపై నిత్యం రాకపోకలు సాగించాల్సి వస్తోంది.
మండుటెండల్లో మురుగు సమస్య
మండలంలోనే పెద్ద పంచాయతీ బ్రాహ్మణక్రాక అరుంధతి వాడలోని అంతర్గత రోడ్డు ఇది. మురుగు నీటి కాలువలు పూడి పోయాయి. దిగువ ప్రాంతాలకు మురుగు పారక..రోడ్డుపై నిల్వ ఉంది. కాలనీ వాసులు ఈ రోడ్డుపై నిత్యం రాకపోకలు సాగించాల్సి వస్తోంది.
జలదంకి, న్యూస్టుడే : వైకాపా ప్రభుత్వం గత అయిదేళ్లుగా పంచాయతీల నిధులను దారి మళ్లించటంతో గ్రామాలు మౌలిక వసతులకు నోచుకోలేదు. నిధుల లేమితో గ్రామాల్లో అభివృద్ధి పనులు అట కెక్కాయి. ఆర్థిక సంఘం నిధులను సైతం విద్యుత్తు బిల్లుల చెల్లింపుల పేరుతో ప్రభుత్వం జమ చేసుకోవటంతో అంతర్గత రోడ్లు, మురుగు నీటి కాలువల్లో పూడికతీత పనులు అటకెక్కాయి. దీంతో గ్రామాలు దుర్గంధంతో సతమతమవుతున్నాయి. ్ర మండల పరిధి చామదల, అన్నవరం, జమ్మలపాలెం, బ్రాహ్మణక్రాక, చోడవరం, జలదంకి, వేములపాడు పంచాయతీ ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో అంతర్గత రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. మురుగు నీటి కాలువలు సైతం పూడిపోయాయి. దీంతో కొద్దిపాటి వర్షానికే అంతర్గత రోడ్లు చిత్తడిగా మారి రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పూడికతీత పనులు, అంతర్గత రోడ్లు నిర్మించాలని సర్పంచులను కోరినా నిధులు లేవని చెబుతున్నారు.
మురుగు ఇబ్బందులు
- పాజర్ల లక్ష్మమ్మ, బ్రాహ్మణక్రాక
గ్రామంలోని అరుంధతివాడలో అంతర్గత రోడ్ల పక్క నిర్మించిన మురుగు నీటి కాలువలు పూడిపోయాయి. దీంతో ఎగువ నుంచి వచ్చే మురుగు దిగువకు పారక రోడ్డుతోపాటు నివాసాల ముందు నిల్వ ఉండి దుర్వాసన వెదజల్లుతోంది. రోడ్డుపై మురుగు నీటిలోనే రాకపోకలు సాగించాల్సి వస్తోంది. సమస్యను అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు.
అంతర్గత రోడ్లు నిర్మించాలి
- ఏగూరు రఘు, జలదంకి
జలదంకి అరుంధతి వాడలో మురుగు నీటి కాలువలు, అంతర్గత రోడ్లు నిర్మించాలని అధికారులు, పాలకులను వేడుకున్నా ప్రయోజనం లేదు. అంతర్గత రోడ్లు సక్రమంగా లేక పోవటంతో కొద్దిపాటి వర్షం కురిసినా రహదారులపై వరద నీరు చేరుతోంది. బురద నీటిలోనే నడవాల్సి వస్తుంది. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాను నిధుల ద్వారా కాలనీల్లో సిమెంట్ రోడ్లు, మురుగు కాలువలు నిర్మించటంలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పదండి.. ఓటెత్తుదాం!
[ 13-05-2024]
ఎన్నికల ఘట్టం.. తుది అంకానికి చేరుకుంది. ఓటర్లు.. రానున్న అయిదేళ్లకు ప్రజాప్రతినిధులను ఎన్నుకునే ఘడియలు వచ్చేశాయి. -
సిబ్బందికి.. భోజన కష్టాలు
[ 13-05-2024]
సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధమని పదేపదే చెబుతున్న జిల్లా యంత్రాంగం.. ఈ బృహత్తర క్రతువులో కీలకంగా వ్యవహరించే పోలింగ్ సిబ్బందికి సక్రమంగా భోజన ఏర్పాట్లు చేయలేదు. -
చివరి రోజు.. ప్రలోభాల వల
[ 13-05-2024]
పోలింగ్కు ముందు రోజు.. ఆదివారం జిల్లా వ్యాప్తంగా పెద్దఎత్తున ప్రలోభాలపర్వం సాగింది. తనిఖీలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నా.. -
ఓటేయకుంటే.. ఓడిపోతాం!
[ 13-05-2024]
‘నేను నా దేశ ప్రజల చేతికి పదునైన కత్తి ఏదీ ఇవ్వలేదు. నేను ఇచ్చింది ఓటు హక్కు మాత్రమే.. అది కత్తి కంటే పదునైంది. దాని సాయంతో పోరాడి రాజులవుతారో? అమ్ముకుని బానిసలవుతారో తేల్చుకోవాల్సింది వారే’ -
అంతటా పటిష్ఠ ఏర్పాట్లు
[ 13-05-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎస్పీ కె.ఆరిఫ్ హఫీజ్ ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు జిల్లా వ్యాప్తంగా పలు పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. -
నాడు-నేడు చతికిల ‘బడి’
[ 13-05-2024]
నాడు- నేడు మనబడి పథకం ద్వారా పాఠశాలల్లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించి విద్యార్థులకు అసౌకర్యం లేకుండా చూస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. -
వంతెనలు లేక.. చింత
[ 13-05-2024]
చెర్లోవంగల్లుకు చెందిన షేక్ సర్దార్ 2021 నవంబరులో తన ఇంటి సమీపంలో కలుజువాగును తల్లిదండ్రులతో కలసి దాటే క్రమంలో ఉద్ధృతికి కొట్టుకుపోయారు. -
‘నిషా’దాంతం
[ 13-05-2024]
మద్యానికి బానిసైన యువకుడు నిత్యం తల్లితో గొడవకు దిగేవాడు. ఏ పనికి వెళ్లేవాడు కాదు. ఈ క్రమంలోనే మద్యానికి నగదు ఇవ్వలేదని ఆమెపై కత్తితో దాడి చేశాడు. -
ప్రయాణం.. ప్రయాస
[ 13-05-2024]
ఎన్నికల్లో సొంతూరులో ఓటు వేయడానికి వస్తున్న వారికి ఆర్టీసీ చుక్కల చూపించింది. సరిపడా బస్సులు నడపకపోవడంతో గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
వలస ఓటర్ల కష్టాలు
[ 13-05-2024]
ఎన్నికల్లో ఓటు వేయడానికి వలసవాసులు స్వగ్రామాలకు చేరుకున్నారు. పోటీలో నిలిచిన ప్రధాన పార్టీలైన తెదేపా, వైకాపా అభ్యర్థులు వలస ఓటర్లను గుర్తించి ఓటు వేయించుకోవడానికి స్వగ్రామాలకు తీసుకొచ్చే ఏర్పాట్లు చేశారు. -
సుభాషిణి కుటుంబానికి రూ. 50లక్షల ఎక్స్గ్రేషియో ఇవ్వాలి
[ 13-05-2024]
ఎన్నికల విధులకు వెళుతూ రైలుప్రమాదంలో మరణించిన అంగన్వాడీ కార్యకర్త బట్టా సుభాషిణితోపాటు తనయుడు విజయకుమార్ కుటుంబానికి రూ.50 లక్షల వంతున