ఆత్మస్తుతి.. హామీల ఊసేది
ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కందుకూరు పట్టణానికి వస్తున్నారని తెలిసి.. ఆశతో వచ్చిన ప్రజలు అసంతృప్తితో వెనుదిరిగారు.
కందుకూరు అభివృద్ధిని మరిచిన ముఖ్యమంత్రి
ప్రసంగం.. విమర్శలకే పరిమితం
ఈనాడు, నెల్లూరు: కందుకూరు పట్టణం, గ్రామీణం, గుడ్లూరు, వలేటివారిపాళెం, న్యూస్టుడే
ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కందుకూరు పట్టణానికి వస్తున్నారని తెలిసి.. ఆశతో వచ్చిన ప్రజలు అసంతృప్తితో వెనుదిరిగారు. గతంలో ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తారో చెబుతారని, ఈ సారి కొత్తగా ఏమైనా వరాలు ప్రకటిస్తారేమోనని భావించిన వారికి నిరాశ తప్పలేదు. దాదాపు 45 నిమిషాల పాటు సాగిన ముఖ్యమంత్రి ప్రసంగం మొత్తం ఆత్మస్తుతి, పర నిందలతోనే సరిపోయింది. కనీసం కందుకూరు పేరు ఎత్తకుండా కార్యక్రమాన్ని ముగించడంపై తీవ్ర విమర్శలు వినిపించాయి. సీఎం హోదాలో తొలిసారి కందుకూరు పట్టణానికి వస్తున్నందున.. నియోజకవర్గ అభివృద్ధి గురించి కీలక హామీలు ఇస్తారని అంతా భావించారు. అటువంటివి ఏమీ లేకుండానే, కేవలం రాజకీయ విమర్శలకే పరిమితమవడం అందరినీ విస్మయానికి గురి చేసింది.
జగన్ ప్రసంగిస్తుండగానే.. వెనుదిరిగిన ప్రజలు
సభ జరుగుతుండగానే.. వెనుదిరిగిన జనం
జగన్ ఎన్నికల ప్రచార సభకు గ్రామాల నుంచి వచ్చిన మహిళలు, ప్రజలు.. వచ్చామా! నాయకులకు కనిపించామా! అక్కడి నుంచి వెళ్లామా!! అన్నట్లు కనిపించింది. సభ ప్రారంభమైనప్పటి నుంచే మహిళలు అధిక సంఖ్యలో వెనుదిరిగారు. సభకు జనాన్ని తరలించేందుకు నాయకులకు పోలింగ్ కేంద్రాల వారీగా రూ. 30వేల వరకు ఖర్చులకు ఇచ్చినట్లు కొందరు వైకాపా నాయకులే చెప్పుకొన్నారు. మహిళలకు రూ.500, పురుషులకు రూ. 300, మద్యం సీసా ఇచ్చేలా ఒప్పందం చేసుకుని తీసుకువచ్చారు. సభా ప్రాంగణం సమీపంలో కొందరు నాయకులు ఆయా గ్రామాల వారు ఎవరెవరు వచ్చారో వివరాలు నమోదు చేసుకుంటూ కనిపించారు. ద్విచక్ర వాహనాలపై వచ్చిన వారికి రూ. 200 చొప్పున పెట్రోల్ పోయించారు. పామూరు రోడ్డులోని దుకాణాల వెనుక.. వైకాపా నాయకులు మద్యం తాగుతున్న దృశ్యాలు కనిపించాయి. మధ్యాహ్నం నుంచి బస్సులను పట్టణంలోకి రాకుండా అడ్డుకోవడంతో పామూరు, లింగసముద్రం, వలేటివారిపాలెం వైపు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఊరి చివరి వరకు నడిచి.. అక్కడి నుంచి వెళ్లారు. అంకభూపాలపురం ప్రాథమిక పాఠశాల వంట ఏజెన్సీ నిర్వాహకులు వైకాపా నాయకులతో కలిసి సభకు వచ్చారు. కొండి కందుకూరు గ్రామ క్షేత్రసహాయకులు హాజరయ్యారు.
వైకాపా కండువాలతో బార్లో మద్యం తాగుతున్న కార్యకర్తలు.. నగదు ఇచ్చేందుకు.. గ్రామాల నుంచి వచ్చిన వారి పేర్ల నమోదు
పదేళ్లుగా కనిగిరి నియోజకవర్గంలో ఉండటంతో.. వైకాపా అభ్యర్థి బుర్రా మధుసూదన్యాదవ్ కనిగిరి మరిచిపోలేకున్నారు. ఆదివారం కందుకూరులో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం వచ్చే ముందు వైకాపా పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి విజయసాయిరెడ్డితో కలిసి ప్రసంగించారు. మాట్లాడటం ప్రారంభించగానే.. అందరికీ స్వాగతం పలుకుతూ.. నేడు కనిగిరి నియోజకవర్గంలో జరుగుతున్న అని.. వెంటనే సరిదిద్దుకుని కందుకూరు నియోజకవర్గంలో అని అనడంతో.. సభకు హాజరైన వారు.. కనిగిరిని మరిచిపోలేకుండా ఉన్నారని, రేపు ఇక్కడేం చేస్తారోనని చర్చించుకోవడం కనిపించింది.
నాడు అలా.. నేడిలా..
ప్రతిపక్ష నేతగా పాదయాత్ర సమయాన 2018 ఫిబ్రవరిలో కందుకూరుకు వచ్చిన జగన్.. నియోజకవర్గానికి కీలకమైన రాళ్లపాడు ప్రాజెక్టు అభివృద్ధి, కాలువల మరమ్మతులు, రామాయపట్నం ఓడరేవు తదితరాలను తాము అధికారంలోకి వచ్చిన వెంటనే నెరవేరుస్తామని హామీలిచ్చారు. సీఎం అయ్యాక.. 2022 జులైలో రామాయపట్నం ఓడరేవు భూమి పూజకు వచ్చిన సందర్భంలో పట్టణంలో మౌలిక వసతుల కల్పన, బైపాస్, రాళ్లపాడు ఎడమ కాలువ పొడిగింపు, కరేడు పీహెచ్సీకి నూతన భవనం వంటి వాటిపై హామీ ఇచ్చారు. ఇచ్చిన వాటిలో ఒక్కటంటే ఒక్కటీ నెరవేర్చలేదు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కందుకూరుకు వచ్చిన జగన్.. వాటి గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. గత హామీల సంగతి సరేలే అనుకున్నా.. నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేస్తామో కూడా కనీసం ప్రస్తావించలేదు. కేవలం తానుంటేనే పథకాలు వస్తాయని, ఇంకెవరూ ఇవ్వరంటూ ఉపన్యసించారు. ప్రతిపక్ష నాయకులను విమర్శించడానికే వచ్చారన్నట్లు మాట్లాడి.. ప్రసంగం ముగించడం ప్రజలను నిరాశ పరచింది. జగన్ సభా ప్రాంగణానికి రాకముందు.. నియోజకవర్గ వైకాపా అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ మాట్లాడుతూ.. రాళ్లపాడు ఎడమ కాలువ పనులు వేగవంతం చేయాలని, వెలిగొండ నుంచి 1.5 టీఎంసీ రాళ్లపాడుకు వచ్చేలా, కందుకూరును తిరిగి ప్రకాశం జిల్లాలో కలిపేందుకు పరిశీలించాలని, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ తదితరాలపై సీఎంకు అర్జీ ఇవ్వనున్నట్లు తెలిపారు. కనీసం వాటి గురించి కూడా జగన్మోహన్రెడ్డి మాట్లాడలేదు.
ఎండ వేడిమికి.. అల్లాడిన జనం
జగన్మోహన్రెడ్డి సభ షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు ఉండటంతో.. అంతకంటే అరగంట ముందే నాయకులు జనాలను అక్కడికి ఆటోల్లో తరలించారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. కొందరు దుకాణాల నీడన సేదతీరారు. జగన్ వచ్చే వరకు అక్కడే ఉన్న జనం.. ఆయన బస్సు ఎక్కి ప్రసంగం ప్రారంభించగానే.. అక్కడి నుంచి తిరుగు పయనమయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కావ్య కృష్ణారెడ్డి గెలుపు ఖాయం
[ 14-05-2024]
కావ్య కృష్ణారెడ్డి గెలుపు తథ్యమని ముసునూరు తెదేపా నాయకులు కనుమూరు భాస్కర్ రెడ్డి అన్నారు. మంగళవారం ఎన్డీయే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డికి అభినందనలు తెలిపారు. -
‘ఇది మీ రోజు.. ప్రతి రోజు అందరిదీ.. గుర్తుపెట్టుకో.!’
[ 14-05-2024]
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి వైకాపా అభ్యర్థి మేకపాటి రాజగోపాల్రెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వింజమూరు ఊటుకూరులోని పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్లినప్పుడు ఓ ఓటరు అతన్ని ప్రశ్నించారు. -
ఓటెత్తిన జనం.. వెల్లువిరిసిన చైతన్యం
[ 14-05-2024]
ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభించాల్సి ఉండగా- అంతకు ముందే మాక్ పోలింగ్ నిర్వహించి.. అంతా సన్నద్ధంగా ఉందని అధికారులు భావించారు. కానీ, ప్రక్రియ ప్రారంభించడానికి ముందే చాలా చోట్ల ఈవీఎంలు పనిచేయలేదు. -
ఘర్షణలు.. లాఠీఛార్జి
[ 14-05-2024]
జిల్లాలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు చెదురుమదరు సంఘటనలు.. స్వల్ప ఘర్షణలు.. అక్కడక్కడా లాఠీఛార్జి మినహా.. ప్రశాంతంగా ముగిశాయి. -
ఇటు ఎండ.. అటు వాన
[ 14-05-2024]
ఉదయగిరిలో సోమవారం ఉరుములు, మెరుపులు. ఈదురుగాలులతో కుండపోత వర్షం కురిసింది. సాయంత్రం అయిదు నుంచి ఏడు గంటల వరకు అది కొనసాగింది. -
రిజర్వు ఉద్యోగుల ఆందోళన
[ 14-05-2024]
పట్టణంలో ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ కేంద్రం ఎదురు రోడ్డుపై ఎన్నికల విధులకు హాజరైన రిజర్వు ఉద్యోగులు ఆదివారం రాత్రి ఆందోళన చేపట్టారు. -
ఓటుకు వరుసకట్టి..
[ 14-05-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అభ్యర్థుల భవిత ఈవీఎంల్లో నిక్షిప్తమైంది. ఎండను లెక్క చేయకుండా ఓటేసేందుకు ప్రజలు ఆసక్తి చూపారు. -
ఓటేయని కందుకూరు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి
[ 14-05-2024]
కందుకూరు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకోలేదు. -
ఎంపీ అభ్యర్థుల ఓటు హక్కు వినియోగం
[ 14-05-2024]
నెల్లూరులో తెదేపా ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి మాగుంట లేఅవుట్లోని ఎస్ఆర్కే స్కూల్లోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. -
కందుకూరు నియోజకవర్గంలో వైకాపా అరాచకం
[ 14-05-2024]
ఉలవపాడు మండలం కృష్ణాపురంలో పోలింగ్ బూత్ 255లో సోమవారం రాత్రి వైకాపా శ్రేణులు అరాచకానికి పాల్పడ్డారు. -
అమ్మవారితోపు కాలనీలో ఉద్రిక్తత
[ 14-05-2024]
బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని రేబాల అమ్మవారితోపు కాలనీలో పోలింగ్ను ఎంపీˆ అభ్యర్థి వేణుంబాక విజయసాయిరెడ్డి సోమవారం పరిశీలించారు. -
విద్యార్థులకు విహార యాత్రలేవీ
[ 14-05-2024]
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కొత్త విషయాలు తెలుసుకోవడంతోపాటు వ్యక్తిత్వ వికాసానికి దోహదపడతాయనే ఉద్దేశంతో గత తెదేపా ప్రభుత్వ హయాంలో ఏటా తొమ్మిది, పది తరగతుల విద్యార్థులను విజ్ఞాన యాత్రలకు తీసుకెళ్లేవారు. -
ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగం: ఎస్పీ
[ 14-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా.. స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకున్నారని ఎస్పీ కె.ఆరిఫ్ హఫీజ్ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
హోర్డింగ్ కుప్పకూలిన ఘటన.. వెలుగులోకి పలు కీలక విషయాలు
-
వెజ్ థాలీ ధర పెరిగింది.. నాన్ వెజ్ తగ్గింది.. ఎందుకిలా?
-
స్వాతి మాలీవాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ నేత
-
జగన్ విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి
-
దిల్లీ మద్యం కేసులో ఆప్ను నిందితుల జాబితాలో చేరుస్తాం: ఈడీ
-
సార్వత్రిక ఎన్నికల వేళ.. సరిహద్దులో ‘పాక్’ డ్రోన్ల కలకలం!