Telangana News: నీళ్లనుకొని యాసిడ్ తాగారు
వస్త్ర దుకాణంలో షాపింగ్ కోసం వచ్చిన వ్యక్తికి.. సంబంధిత సిబ్బంది నీళ్లనుకొని యాసిడ్ బాటిల్(సీసా) ఇచ్చారు. ఆ విషయాన్ని గమనించని అతను యాసిడ్ తాగి ఆసుపత్రి పాలైన ఘటన నిజామాబాద్లో శనివారం చోటుచేసుకొంది. బాధితుడి కథనం ప్రకారం.
ఇద్దరికి తీవ్ర అస్వస్థత
నిజామాబాద్లోని ఓ వస్త్ర దుకాణంలో ఘటన
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు విజయ్
నిజామాబాద్ నేరవార్తలు, న్యూస్టుడే: వస్త్ర దుకాణంలో షాపింగ్ కోసం వచ్చిన వ్యక్తికి.. సంబంధిత సిబ్బంది నీళ్లనుకొని యాసిడ్ బాటిల్(సీసా) ఇచ్చారు. ఆ విషయాన్ని గమనించని అతను యాసిడ్ తాగి ఆసుపత్రి పాలైన ఘటన నిజామాబాద్లో శనివారం చోటుచేసుకొంది. బాధితుడి కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మహ్మద్నగర్కు చెందిన విజయ్కుమార్ కుటుంబ సభ్యులు పెళ్లి దుస్తులు కొనుగోలు చేయడానికి నిజామాబాద్ ఒకటో ఠాణా పరిధిలోని ఓ వస్త్ర దుకాణానికి వచ్చారు. కొద్ది సేపటి తర్వాత విజయ్కు దాహం వేయగా నీళ్లు కావాలని సిబ్బందిని అడిగాడు. ఓ వ్యక్తి నీళ్ల సీసా తెచ్చి ఇచ్చాడు. తెలుపు రంగులోనే ఉండటంతో బాధితుడు తాగేశాడు. ఆ తర్వాత అక్కడే ఉన్న మరొక సిబ్బంది కూడా తాగారు. ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు, యాజమాన్య ప్రతినిధులు ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. విజయ్ పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్కు తరలించినట్లు సమాచారం. ఈ ఘటనపై ఒకటో ఠాణా పోలీసులు విచారణ చేస్తున్నారు. బాధితుల ఫిర్యాదు అనంతరం కేసు నమోదు చేస్తామని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీతోనే దేశ అభివృద్ధి సాధ్యం
[ 03-05-2024]
ప్రధాని మోదీతోనే దేశానికి రక్షణ కలుగుతుందని భాజపా మండల అధ్యక్షుడు సత్యబోయిన శ్రీకాంత్ అన్నారు. -
జహీరాబాద్లో భాజపా విజయం ఖాయం: కేవీఆర్
[ 03-05-2024]
కామారెడ్డి మండలం, రాజంపేట మండలాల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం జిల్లా కేంద్రంలోని రాజారెడ్డి గార్డెన్లో నిర్వహించారు. -
తల్లి డబ్బులివ్వడంలేదని తనయుడు ఆత్మహత్య
[ 03-05-2024]
పొలం అమ్మి డబ్బులివ్వాలని తల్లిని ఒత్తిడి చేయడంతో ఆమె ఇవ్వకపోవడంతో జీవితంపై విరక్తి చెందిన కుమారుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన దామరంచలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. -
సురేష్ షెట్కార్ను గెలిపించాలి
[ 03-05-2024]
జహీరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్ను గెలిపించాలి ఏఐసీసీ మాజీ సభ్యుడు, పీసీసీ మాజీ కార్యదర్శి అబ్దుల్ హైమద్ అన్నారు. -
రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో చేతి సంచుల పంపిణీ
[ 03-05-2024]
పర్యావరణ పరిరక్షణలో భాగంగా కామారెడ్డి సీఎస్ఐ గ్రౌండ్లో రోటరీక్లబ్ ఆధ్వర్యంలో బట్టతో తయారు చేసిన 200 చేతి సంచులను ఉచితంగా పంపిణీ చేశారు. -
నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే జాబ్ మేళా లక్ష్యం
[ 03-05-2024]
కామారెడ్డి జిల్లా కేంద్రంలో శ్రావణి ఐటీఐ కళాశాల ఆధ్వర్యంలో జాబ్ మేళాకు విశేష స్పందన వచ్చిందని కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. -
గడప గడపకు కాంగ్రెస్
[ 03-05-2024]
నాగిరెడ్డిపేట్ మండలంలోని ఆత్మకూర్ గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్ రావు ఆదేశాల మేరకు నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
భారాస అభ్యర్థిని గెలిపించాలి
[ 03-05-2024]
పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్కు ఓటువేసి భారీ మెజారీటీతో గెలిపించాలని జడ్పీటీసీ మనోహర్ రెడ్డి కోరారు. -
ప్రజాస్వామ్యంలో ఓటు కీలకం
[ 03-05-2024]
ఓటు ప్రాముఖ్యత, అదనంగా ఒక గంట పోలింగ్ సమయం పెంపుపై ప్రజలలో అవగాహన నిమిత్తం గ్రామాలలో ఆడియో ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ శుక్రవారం తెలిపారు. -
తాగునీటి నాణ్యత పరీక్షలు
[ 03-05-2024]
గ్రామాల్లో ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు నీటి నాణ్యత పరీక్షలు నిర్వహిస్తున్నామని జిల్లా అసిస్టెంట్ హైడ్రోజిలాజిస్ట్ ప్రేమలత తెలిపారు. -
లోక్సభ పోరు.. మరింత హోరు
[ 03-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తుండడంతో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. జహీరాబాద్ లోక్సభ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలుండగా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్న నాలుగింటిపై భారాస, కాంగ్రెస్, -
సమయం ఉంది మిత్రమా
[ 03-05-2024]
ఎండల తీవ్రత నేపథ్యంలో ఎన్నికల సంఘం పోలింగ్ సమయాన్ని గంట పాటు పెంచింది. ఈ మేరకు రాష్ట్రంలోని 106 శాసనసభ నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. -
విమానం ఎగరాలి.. ఇందూరు మురవాలి!
[ 03-05-2024]
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా.. ఇతర ప్రాంతాలతో పోల్చిచూస్తే ప్రజల జీవన ప్రమాణాల్లో ముందుంది. ఇక్కడి వారు వ్యవసాయం, విద్య, ఉద్యోగపరంగా అభివృద్ధి చెందారు. పాశ్చాత్య దేశాలతో సంబంధాలున్న వారు లక్షల్లో ఉన్నారు. -
ఉదయం ప్రచారాలు.. సాయంత్రం సమావేశాలు
[ 03-05-2024]
సూర్యప్రతాపం రోజురోజుకూ పెరుగుతోంది.. మరోవైపు ప్రచార గడువు దగ్గర పడుతోంది. ఈ ప్రచండ వేడిమిలో రాజకీయపార్టీల ప్రచార సరళి మారిపోయింది.. అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్నంతగా ప్రచార జోరు కనిపించడం లేదు. -
పుస్తక రూపం.. ఓటరు చైతన్యం
[ 03-05-2024]
పార్లమెంటు ఎన్నికలకు అధికారులు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ ప్రక్రియలో తప్పులు జరగకుండా పక్కాగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం తలమునకలైంది. -
పోస్టల్ బ్యాలెట్కు వేళాయె
[ 03-05-2024]
లోక్సభ ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ద్వారా ఓటింగ్ జరిపేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. -
పోలీసు వాహనాన్ని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు
[ 03-05-2024]
పోలీసుల ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టిన ఘటన మండలంలోని తిమ్మాపూర్ గేట్ సమీపంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు, ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. -
‘దేశం, ధర్మ రక్షణే భాజపా లక్ష్యం’
[ 03-05-2024]
దేశాన్ని, ధర్మాన్ని రక్షించడమే భాజపా లక్ష్యమని భాజపా ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ అన్నారు. గురువారం జుక్కల్ మండలంలోని కౌలాస్, మహ్మదాబాద్, ఖండేబల్లూర్, వజ్రఖండి, జుక్కల్ గ్రామాల్లో ఆయన భాజపా జిల్లా అధ్యక్షురాలు అరుణతార, -
పదేళ్లు అవకాశం ఇస్తే చేసిందేమీ లేదు
[ 03-05-2024]
పదేళ్లు ఎంపీగా అవకాశం ఇస్తే ఎంపీ బీబీ పాటిల్ నియోజకవర్గానికి చేసిందేమీ లేదని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు విమర్శించారు. గురువారం పిట్లం అంబేడ్కర్ కూడలిలో జనజాతర నిర్వహించారు. -
‘ప్రజా సంక్షేమమే కేసీఆర్ ధ్యేయం’
[ 03-05-2024]
ప్రజల సంక్షేమానికి నిరంతరం పోరాడే వ్యక్తి కేసీఆర్ ఒక్కరేనని, ఆయన వెన్నంటే ఉంటూ ప్రజల కోసం ప్రభుత్వంతో పోరాటం చేస్తామని మాజీ సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. -
నిప్పుల కుంపటి
[ 03-05-2024]
జిల్లాలో ఎండల జోరు ఏమాత్రం తగ్గడం లేదు. నిప్పుల కుంపటిలా మారింది. వేసవి తాపానికి తట్టుకోలేని జనం వేడిమికి సతమతమవుతున్నారు. ఉదయం 9 గంటలకే సూర్యుడు సుర్రుమంటున్నాడు. -
నోటీసు బోర్డుపై అభ్యర్థుల సమాచారం
[ 03-05-2024]
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వివరాలు తెలుసుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. పోటీచేసే అభ్యర్థుల ఆస్తులు, అప్పులు, నేరచరిత్ర, వయసు, విద్యార్హత, వ్యాపారం, భూముల వివరాలు కచ్చితంగా ప్రజలకు తెలియజేయాల్సిందే. -
నగరంలో గొలుసు చోరీకి విఫలయత్నం
[ 03-05-2024]
జిల్లా కేంద్రం మూడో ఠాణా పరిధిలో మహిళ మెడలోంచి బంగారు గొలుసు ఎత్తుకెళ్తూ దుండగుడు దొరికిపోయాడు. పోలీసుల కథనం ప్రకారం.. -
19 మంది అభ్యర్థులు.. ఒకే మహిళ
[ 03-05-2024]
జహీరాబాద్ లోక్సభ బరిలో మొత్తంగా 19 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఇందులో గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర స్థాయి పార్టీల అభ్యర్థులు ముగ్గురు పోటీ పడుతున్నారు. భారాస నుంచి గాలి అనిల్కుమార్, -
బాల్య వివాహం చేసిన 14 మందిపై కేసు నమోదు
[ 03-05-2024]
లింగంపేట మండలంలోని ఓ మారుమూల గిరిజన తండాలో ఇద్దరు మైనర్లకు బాల్య వివాహం చేసిన 14 మందిపై గురువారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై చైతన్యకుమార్రెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు
-
ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్.. ప్రభుత్వ అప్లికేషన్లకు ఇకపై లేబుల్స్
-
ఉగ్రదాడులకు కుట్ర.. ఉక్రెయిన్ ‘ఏజెంట్’ను చంపిన రష్యా
-
శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
-
ఓటీటీలోకి వచ్చేసిన త్రిగుణ్ ‘లైన్ మ్యాన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఎన్నికల నేపథ్యంలో.. కేజ్రీవాల్కు బెయిల్ అంశాన్ని పరిశీలిస్తాం - సుప్రీంకోర్టు