కళాశాలల తనిఖీలకు వేళాయె
తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో 2024-25 నూతన విద్యా సంవత్సరానికి ‘యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు’ కోసం ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల తనిఖీలు గురువారం నుంచి చేపట్టనున్నారు.
తెలంగాణ విశ్వవిద్యాలయ పరిపాలన భవనం
న్యూస్టుడే, తెవివి క్యాంపస్: తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో 2024-25 నూతన విద్యా సంవత్సరానికి ‘యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు’ కోసం ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల తనిఖీలు గురువారం నుంచి చేపట్టనున్నారు. చాలా ప్రైవేటు కళాశాలలు నిబంధనలకు విరుద్ధంగా కనీస ప్రమాణాలు పాటించడం లేదనే ఆరోపణలు ఉన్నప్పటికీ.. ఏటా వర్సిటీ నుంచి అనుబంధ గుర్తింపు ఇస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో నూతన విద్యా సంవత్సరం కోసం ఈ నెల 25 నుంచి మే 13 వరకు ఈ తనిఖీలు చేపట్టనున్నట్లు వర్సిటీ అధికారులు ప్రకటించారు.
ప్రమాణాలు పాటిస్తున్నట్లు చూపిస్తూ..
వర్సిటీ పరిధిలో 3 ప్రభుత్వ, 12 ప్రైవేటు పీజీ కళాశాలలు, 16 ప్రభుత్వ(గురుకులాలు కలిపి), 54 ప్రైవేటు డిగ్రీ కళాశాలలున్నాయి. 3 ఎంబీఏ, 1 ఎంసీఏ కళాశాలలున్నాయి. యూజీసీ, ఉన్నత విద్యామండలి, యూనివర్సిటీ నిర్దేశించిన నిబంధనలు కళాశాలలు పాటించాల్సి ఉంటుంది. సొంత భవనాలు, ల్యాబ్లు, అర్హత కలిగిన అధ్యాపకులు, క్రీడా మైదానం సౌకర్యాలు లేని కళాశాలలు ఉన్నాయి. అయితే ముందస్తు సమాచారంతో యూనివర్సిటీ అధికారులు తనిఖీలకు వెళ్తుండటంతో పలు ప్రైవేటు యాజమాన్యాలు అన్ని ప్రమాణాలు పాటిస్తున్నట్లు చూపిస్తున్నాయనే విమర్శలు నెలకొన్నాయి. పలు కళాశాలలు యూనివర్సిటీ నిర్దేశించిన పరీక్ష ఫీజు కంటే అధిక వసూళ్లకు పాల్పడుతున్నాయని, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ డబ్బులను కట్టించుకుంటున్నట్లు వివరాలతో వర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడంలో వెనుకంజ వేస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.
నెల రోజుల గడువు
యూజీసీ, ఉన్నత విద్యా మండలి, యూనివర్సిటీ నిర్దేశించిన నియమ, నిబంధనలకు లోబడి తనిఖీలు ఉంటాయి. ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలలు కచ్చితంగా ప్రమాణాలు పాటించాలి. కనీస సౌకర్యాలు లేని కళాశాలలకు వాటి కల్పనకు నెల రోజుల గడువు ఇస్తాం.
ఆచార్య చంద్రశేఖర్, తెవివి అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో చేతి సంచుల పంపిణీ
[ 03-05-2024]
పర్యావరణ పరిరక్షణలో భాగంగా కామారెడ్డి సీఎస్ఐ గ్రౌండ్లో రోటరీక్లబ్ ఆధ్వర్యంలో బట్టతో తయారు చేసిన 200 చేతి సంచులను ఉచితంగా పంపిణీ చేశారు. -
నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే జాబ్ మేళా లక్ష్యం
[ 03-05-2024]
కామారెడ్డి జిల్లా కేంద్రంలో శ్రావణి ఐటీఐ కళాశాల ఆధ్వర్యంలో జాబ్ మేళాకు విశేష స్పందన వచ్చిందని కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. -
గడప గడపకు కాంగ్రెస్
[ 03-05-2024]
నాగిరెడ్డిపేట్ మండలంలోని ఆత్మకూర్ గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్ రావు ఆదేశాల మేరకు నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
భారాస అభ్యర్థిని గెలిపించాలి
[ 03-05-2024]
పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్కు ఓటువేసి భారీ మెజారీటీతో గెలిపించాలని జడ్పీటీసీ మనోహర్ రెడ్డి కోరారు. -
ప్రజాస్వామ్యంలో ఓటు కీలకం
[ 03-05-2024]
ఓటు ప్రాముఖ్యత, అదనంగా ఒక గంట పోలింగ్ సమయం పెంపుపై ప్రజలలో అవగాహన నిమిత్తం గ్రామాలలో ఆడియో ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ శుక్రవారం తెలిపారు. -
తాగునీటి నాణ్యత పరీక్షలు
[ 03-05-2024]
గ్రామాల్లో ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు నీటి నాణ్యత పరీక్షలు నిర్వహిస్తున్నామని జిల్లా అసిస్టెంట్ హైడ్రోజిలాజిస్ట్ ప్రేమలత తెలిపారు. -
లోక్సభ పోరు.. మరింత హోరు
[ 03-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తుండడంతో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. జహీరాబాద్ లోక్సభ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలుండగా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్న నాలుగింటిపై భారాస, కాంగ్రెస్, -
సమయం ఉంది మిత్రమా
[ 03-05-2024]
ఎండల తీవ్రత నేపథ్యంలో ఎన్నికల సంఘం పోలింగ్ సమయాన్ని గంట పాటు పెంచింది. ఈ మేరకు రాష్ట్రంలోని 106 శాసనసభ నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. -
విమానం ఎగరాలి.. ఇందూరు మురవాలి!
[ 03-05-2024]
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా.. ఇతర ప్రాంతాలతో పోల్చిచూస్తే ప్రజల జీవన ప్రమాణాల్లో ముందుంది. ఇక్కడి వారు వ్యవసాయం, విద్య, ఉద్యోగపరంగా అభివృద్ధి చెందారు. పాశ్చాత్య దేశాలతో సంబంధాలున్న వారు లక్షల్లో ఉన్నారు. -
ఉదయం ప్రచారాలు.. సాయంత్రం సమావేశాలు
[ 03-05-2024]
సూర్యప్రతాపం రోజురోజుకూ పెరుగుతోంది.. మరోవైపు ప్రచార గడువు దగ్గర పడుతోంది. ఈ ప్రచండ వేడిమిలో రాజకీయపార్టీల ప్రచార సరళి మారిపోయింది.. అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్నంతగా ప్రచార జోరు కనిపించడం లేదు. -
పుస్తక రూపం.. ఓటరు చైతన్యం
[ 03-05-2024]
పార్లమెంటు ఎన్నికలకు అధికారులు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ ప్రక్రియలో తప్పులు జరగకుండా పక్కాగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం తలమునకలైంది. -
పోస్టల్ బ్యాలెట్కు వేళాయె
[ 03-05-2024]
లోక్సభ ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ద్వారా ఓటింగ్ జరిపేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. -
పోలీసు వాహనాన్ని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు
[ 03-05-2024]
పోలీసుల ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టిన ఘటన మండలంలోని తిమ్మాపూర్ గేట్ సమీపంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు, ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. -
‘దేశం, ధర్మ రక్షణే భాజపా లక్ష్యం’
[ 03-05-2024]
దేశాన్ని, ధర్మాన్ని రక్షించడమే భాజపా లక్ష్యమని భాజపా ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ అన్నారు. గురువారం జుక్కల్ మండలంలోని కౌలాస్, మహ్మదాబాద్, ఖండేబల్లూర్, వజ్రఖండి, జుక్కల్ గ్రామాల్లో ఆయన భాజపా జిల్లా అధ్యక్షురాలు అరుణతార, -
పదేళ్లు అవకాశం ఇస్తే చేసిందేమీ లేదు
[ 03-05-2024]
పదేళ్లు ఎంపీగా అవకాశం ఇస్తే ఎంపీ బీబీ పాటిల్ నియోజకవర్గానికి చేసిందేమీ లేదని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు విమర్శించారు. గురువారం పిట్లం అంబేడ్కర్ కూడలిలో జనజాతర నిర్వహించారు. -
‘ప్రజా సంక్షేమమే కేసీఆర్ ధ్యేయం’
[ 03-05-2024]
ప్రజల సంక్షేమానికి నిరంతరం పోరాడే వ్యక్తి కేసీఆర్ ఒక్కరేనని, ఆయన వెన్నంటే ఉంటూ ప్రజల కోసం ప్రభుత్వంతో పోరాటం చేస్తామని మాజీ సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. -
నిప్పుల కుంపటి
[ 03-05-2024]
జిల్లాలో ఎండల జోరు ఏమాత్రం తగ్గడం లేదు. నిప్పుల కుంపటిలా మారింది. వేసవి తాపానికి తట్టుకోలేని జనం వేడిమికి సతమతమవుతున్నారు. ఉదయం 9 గంటలకే సూర్యుడు సుర్రుమంటున్నాడు. -
నోటీసు బోర్డుపై అభ్యర్థుల సమాచారం
[ 03-05-2024]
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వివరాలు తెలుసుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. పోటీచేసే అభ్యర్థుల ఆస్తులు, అప్పులు, నేరచరిత్ర, వయసు, విద్యార్హత, వ్యాపారం, భూముల వివరాలు కచ్చితంగా ప్రజలకు తెలియజేయాల్సిందే. -
నగరంలో గొలుసు చోరీకి విఫలయత్నం
[ 03-05-2024]
జిల్లా కేంద్రం మూడో ఠాణా పరిధిలో మహిళ మెడలోంచి బంగారు గొలుసు ఎత్తుకెళ్తూ దుండగుడు దొరికిపోయాడు. పోలీసుల కథనం ప్రకారం.. -
19 మంది అభ్యర్థులు.. ఒకే మహిళ
[ 03-05-2024]
జహీరాబాద్ లోక్సభ బరిలో మొత్తంగా 19 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఇందులో గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర స్థాయి పార్టీల అభ్యర్థులు ముగ్గురు పోటీ పడుతున్నారు. భారాస నుంచి గాలి అనిల్కుమార్, -
బాల్య వివాహం చేసిన 14 మందిపై కేసు నమోదు
[ 03-05-2024]
లింగంపేట మండలంలోని ఓ మారుమూల గిరిజన తండాలో ఇద్దరు మైనర్లకు బాల్య వివాహం చేసిన 14 మందిపై గురువారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై చైతన్యకుమార్రెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్.. ప్రభుత్వ అప్లికేషన్లకు ఇకపై లేబుల్స్
-
ఉగ్రదాడులకు కుట్ర.. ఉక్రెయిన్ ‘ఏజెంట్’ను చంపిన రష్యా
-
శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
-
ఓటీటీలోకి వచ్చేసిన త్రిగుణ్ ‘లైన్ మ్యాన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఎన్నికల నేపథ్యంలో.. కేజ్రీవాల్కు బెయిల్ అంశాన్ని పరిశీలిస్తాం - సుప్రీంకోర్టు
-
‘ఆమె కన్నీళ్లకు నా హృదయం ముక్కలైంది’: గవర్నర్పై ఆరోపణల వేళ దీదీ వ్యాఖ్య