విస్తృతంగా వాహనాల తనిఖీ
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు.
ఎల్లారెడ్డి పట్టణం: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. శనివారం పట్టణ కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సీఐ రవీందర్ నాయక్ మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ నిబంధనల మేరకు రూ.50 వేల కంటే ఎక్కువగా డబ్బు రవాణా చేస్తే తప్పనిసరిగా ఆ నగదుకు సంబంధించిన రసీదు ఉండాలన్నారు. వాహనదారులందరూ కూడా నంబర్ ప్లేటు, సరైన ధ్రువపత్రాలు కలిగి ఉండాలని సూచించారు. సరైన పత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 30 వాహనాలను జప్తు చేసినట్లు పోలీసులు తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై మహేష్, ఎల్లారెడ్డి సర్కిల్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్సైలు, సిబ్బంది ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సర్వం సిద్ధం
[ 13-05-2024]
లోక్సభ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. సోమవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. -
సజావుగా ఎన్నికల సామగ్రి పంపిణీ
[ 13-05-2024]
డిచ్పల్లిలోని సీఎంసీ కళాశాలలో ఆదివారం చేపట్టిన నిజామాబాద్ గ్రామీణం, అర్బన్ నియోజకవర్గాల ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియ సజావుగా సాగింది. -
ఏకరూప దుస్తులకు నిధుల కేటాయింపు
[ 13-05-2024]
ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థుల్లో సమానత్వభావన పెంచేందుకు సమగ్ర శిక్షా అభియాన్ ఏటా రెండు జతల ఏకరూప దుస్తులు అందజేస్తుంది. -
ఈదురు గాలుల బీభత్సం
[ 13-05-2024]
మంచిప్ప, ముదక్పల్లి ప్రాంతాల్లో ఈదురు గాలుల బీభత్సంతో ఆదివారం సాయంత్రం చెట్లు నేలకొరిగాయి. విద్యుత్తు నియంత్రికలు, స్తంభాలు ధ్వంసమయ్యాయి. -
స్ట్రాంగ్ రూమ్కు పోస్టల్ బ్యాలెట్ బాక్సులు
[ 13-05-2024]
నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ బాక్సులను కట్టుదిట్టమైన భద్రత మధ్య డిచ్పల్లి సీఎంసీ కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్కు ఆదివారం తరలించారు. -
ఓటు చైతన్యం వెల్లివిరియాలి
[ 13-05-2024]
ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. -
అడవుల్లో జలవనరుల సృష్టి
[ 13-05-2024]
ఎండలు మండుతున్నాయి. అటవీ ప్రాంతంలో వన్య ప్రాణులకు నీటి కొరత ఏర్పడకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. -
24 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత
[ 13-05-2024]
రెండో ఠాణా పరిధిలో పీడీఎస్ బియ్యం అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డారు. పోలీసుల కథనం ప్రకారం శనివారం రాత్రి పెద్దబజార్లో తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ వాహనంలో బస్తాలు ఉండటంతో గుర్తించి పరిశీలించగా 24 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు తేలింది. -
మొదట మాక్ పోలింగ్
[ 13-05-2024]
పోలింగ్ వాస్తవానికి ఉదయం ఏడు గంటలకు ప్రారంభమవుతుంది. దాని కంటే రెండు గంటల ముందు ఐదు గంటలకు ఏజెంట్లు, ఎన్నికల సిబ్బంది బరిలో ఉన్న అభ్యర్థులకు ఓట్లు వేస్తారు. ఈ ప్రక్రియనే మాక్ పోలింగ్ అంటారు. -
ప్రియమైన ఓటరా.. బాధ్యత మరవకు
[ 13-05-2024]
18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటుహక్కును వినియోగించుకొనేలా ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది. ఓటరు గుర్తింపు సంఖ్య అనుసంధానం ఉన్న చరవాణి నంబర్లకు చివరి నిమిషం వరకు సంక్షిప్త సందేశం పంపిస్తూ చైతన్యం చేస్తోంది. -
తగ్గుముఖం పట్టిన ఉష్ణోగ్రతలు
[ 13-05-2024]
జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. వారం రోజుల కిందటి వరకు రికార్డు స్థాయిలో 46 డిగ్రీలు దాటిన ఎండలు ఒక్కసారిగా 42 డిగ్రీలకు పడిపోయింది. -
ఓటర్లకు నగదు పంపిణీ
[ 13-05-2024]
జిల్లాకేంద్రం వినాయక్నగర్ పరిధిలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కొందరు నాయకులు ఆదివారం రాత్రి నగదు పంపిణీకి తెరలేపారు.