logo

ఓటర్లకు నగదు పంపిణీ

జిల్లాకేంద్రం వినాయక్‌నగర్‌ పరిధిలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కొందరు నాయకులు ఆదివారం రాత్రి నగదు పంపిణీకి తెరలేపారు.

Published : 13 May 2024 02:48 IST

పోలీసుల అదుపులో ఓ నేత

ఇందూరు సిటీ, న్యూస్‌టుడే: జిల్లాకేంద్రం వినాయక్‌నగర్‌ పరిధిలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కొందరు నాయకులు ఆదివారం రాత్రి నగదు పంపిణీకి తెరలేపారు. ఆయా ఠాణా పరిధిలో నగదు పంపిణీ చేసేందుకు తిరుగుతున్న వారిని గుర్తించి పోలీసులు చెదరగొట్టారు. స్థానికుల సమాచారం మేరకు నాలుగో ఠాణా పరిధిలో ఓ పార్టీకి చెందిన నేత డబ్బులు పంపిణీ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. స్థానికులు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నప్పటికీ పోలీసులు స్పందించడం లేదు. రెండు, మూడు, ఐదో ఠాణాల పరిధిలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారనే సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకొని వారిని వెళ్లగొట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని