తగ్గుతుందా.. పెరుగుతుందా..?
లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాలు రూపొందించుకుని ప్రచారం చేస్తున్నాయి. జహీరాబాద్ లోక్సభ పరిధిలో మొదటిసారి త్రిముఖ పోటీ నెలకొన్న నేపథ్యంలో పోలింగ్శాతం ప్రభావంపై ఆయా పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి.
పోలింగ్శాతం, గెలుపోటములపై పార్టీల లెక్కలు
ఈనాడు, కామారెడ్డి: లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాలు రూపొందించుకుని ప్రచారం చేస్తున్నాయి. జహీరాబాద్ లోక్సభ పరిధిలో మొదటిసారి త్రిముఖ పోటీ నెలకొన్న నేపథ్యంలో పోలింగ్శాతం ప్రభావంపై ఆయా పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. పెరిగితే ఎవరికి లాభం, నష్టం? తగ్గితే ఏ పార్టీకి ప్రయోజనం అన్న కోణంలో చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం 40 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మే నెలలో ఇవి మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పోలింగ్శాతంపై ఎన్నికల యంత్రాంగం, అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
వేర్వేరు ఎన్నికల సమయంలో..
అసెంబ్లీ, లోక్సభకు ఒకేసారి ఎన్నికలు జరిగిన 2009, 2014లలో పోలింగ్ భారీగానే నమోదైంది. 2018లోనూ జహీరాబాద్ లోక్సభ స్థానం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో 80 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. కాని 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో గణనీయంగా తగ్గింది. ఇప్పటి వరకు జరిగిన పోలింగ్ను విశ్లేషిస్తే పట్టణ ప్రాంతాలకు చెందినవారే ఓటింగ్లో పాల్గొనడం లేదని తెలుస్తోంది. పట్టణాల్లో పోలింగ్శాతం పెంచేందుకు అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు.
ఇతర ప్రాంతాలకు వెళ్లడంతో..
స్థానిక సంస్థలతో పోలిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో కొంత మేర పోలింగ్ తగ్గుతోంది. ఇదే విధంగా శాసనసభ ఎన్నికలతో పోల్చితే లోక్సభ ఎన్నికల్లో గణనీయంగా తగ్గుతున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. జహీరాబాద్ లోక్సభ పరిధిలోని ఎల్లారెడ్డి, జుక్కల్, నారాయణఖేడ్, అందోల్, జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో వర్షాధారంగానే అన్నదాతలు పంటలు పండిస్తుంటారు. వేసవిలో కూలీలకు పల్లెలతో పాటు పట్టణాల్లో ఉపాధి లభించని పరిస్థితి. ఈ నేపథ్యంలో పలువురు నిరుపేదలు జీవనోపాధి నిమిత్తం ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో అడ్డాకూలీలుగా జీవనం కొనసాగిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వారు ఓటింగ్లో పాల్గొనేలా పలు రాజకీయ పార్టీల అభ్యర్థులు ప్రత్యేకంగా వాహనాలు సమకూర్చి గ్రామాలకు తరలించారు. ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేదు. దీనికి తోడు వేసవి సెలవులు రావడంతో పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. దీంతో పట్టణాలు, పల్లెల్లో పోలింగ్ తక్కువగా నమోదయ్యే అవకాశాలున్నాయి.
మారిన ప్రచార సరళి
అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం ప్రచారంలో తేడా కనిపిస్తోంది. పార్టీల అగ్రనేతల హడావుడే తప్ప ద్వితీయ, గ్రామస్థాయి నేతల్లో ప్రచారం చేపట్టాలనే ఉత్సాహం కనపడడం లేదు. ప్రధాన పార్టీల అభ్యర్థులు సైతం మండల, నియోజకవర్గ కేంద్రాల్లో ముఖ్యనేతలు, కార్యకర్తల సమావేశాలతో సరిపెడుతున్నారు. గతంలో మాదిరి పోస్టర్లు, కరపత్రాల ప్రచారానికి స్వస్తి చెప్పారు. సామాజిక మాధ్యమాలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెట్టును ఢీకొని వ్యక్తి మృతి
[ 11-05-2024]
చెట్టును ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన రామక్కపల్లి గేటు సమీపంలో చోటుచేసుకుంది. -
నీటమునిగి యువకుడి మృతి
[ 11-05-2024]
ప్రమాదవశాత్తు చెరువులో పడి నీటమునిగి యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలోని అక్కంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. -
బోరు మోటర్ల రాగి తీగల అపహరణ
[ 11-05-2024]
పంట పొలాల్లోని బోరు మోటర్ల నుంచి రాగి తీగలను గుర్తు తెలియని దొంగలు అపహరించుకుపోయిన ఘటన బీర్కూర్లో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. -
పిడుగుపాటుకు భారీ వృక్షం ధ్వంసం
[ 11-05-2024]
మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. -
కేంద్ర ఎన్నికల పర్యవేక్షకుడి ప్రత్యేక పూజలు
[ 11-05-2024]
బీర్కూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానాన్ని శనివారం కేంద్ర ఎన్నికల పోలీసు పర్యవేక్షకుడు (ఐజీ) రాజేష్ మీనా కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. -
భాజపా నేతల పాదయాత్ర
[ 11-05-2024]
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీబీ పాటిల్కు మద్దతుగా మండల కేంద్రంలో శనివారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. -
ఆర్టీసీ ఎండీ సజ్జనార్పై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు
[ 11-05-2024]
టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్పై రాష్ట్ర, కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారులకు ఫిర్యాదు చేసినట్లు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, భారాస నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి పేర్కొన్నారు. -
సాయంత్రానికి మైకులు బంద్
[ 11-05-2024]
లోక్సభ ఎన్నికల్లో పార్టీలకు కీలక ఘట్టమైన ప్రచార పర్వం శనివారం సాయంత్రం ఆరు గంటలకు ముగియనుంది. మార్చి 16న షెడ్యూల్.. ఏప్రిల్ 18న నోటిఫికేషన్ వెలువడగా.. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి 29 మంది బరిలో దిగారు. -
అర్హులందరికీ రేషన్కార్డులు ఇప్పిస్తా
[ 11-05-2024]
అర్హులందరికీ రేషన్ కార్డులు ఇప్పించేందుకు తన వంతు కృషి చేస్తానని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. భాజపా జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
‘భాజపా సర్కారు రైతుల్ని మోసగించింది’
[ 11-05-2024]
కేంద్రంలోని భాజపా సర్కారు రైతులను మోసగించిందని, ప్రజలకు ఆదాయం పెంచుతామని చెప్పి అన్ని రకాల ధరల్ని రెట్టింపు చేసిందని మాజీమంత్రి మండవ వెంకటేశ్వరరావు విమర్శించారు. డి -
‘ముఖ్యమంత్రి మాటలు నమ్మొద్ద్దు’
[ 11-05-2024]
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాటలు ప్రజలు, కార్యకర్తలు ఎవరూ నమ్మొద్దని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ కల్యాణ మండపంలో శుక్రవారం నిర్వహించిన పార్టీ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. -
నేటితో ప్రచారానికి తెర
[ 11-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రం ముగియనుంది. మిగిలిన సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. -
‘కాంగ్రెస్ హయాంలో కుంభకోణాలు’
[ 11-05-2024]
కాంగ్రెస్కు అధికారం ఇస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు తగ్గించి ఓ వర్గానికి కల్పిస్తుందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. బాన్సువాడలో శుక్రవారం జహీరాబాద్ లోక్సభ భాజపా అభ్యర్థి, ఎంపీ బీబీపాటిల్తో కలిసి రోడ్ షో నిర్వహించారు. -
కార్నర్ సమావేశంగా మార్పు
[ 11-05-2024]
జిల్లాకేంద్రంలో కాంగ్రెస్ కార్నర్ సమావేశ స్థలాన్ని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ శుక్రవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో శనివారం తలపెట్టిన కాంగ్రెస్ జనజాతర సభను కార్నర్ సమావేశంగా మార్చినట్లు పేర్కొన్నారు. -
‘ఆశీర్వదిస్తే నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తా’
[ 11-05-2024]
ఓటర్లు ఆశీర్వదించి గెలిపిస్తే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని భారాస జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్కుమార్ అన్నారు. శుక్రవారం రాత్రి ఝరాసంగంలో పాత బస్టాండు కూడలి వద్ద నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. -
ఏడాదిన్నర తర్వాత హత్య కేసు ఛేదన
[ 11-05-2024]
ఏడాదిన్నర కిందట మూసేసిన కేసును సాంకేతికతను వినియోగించి పోలీసులు ఛేదించారు. కామారెడ్డి జిల్లాకేంద్రంలో డీఎస్పీ నాగేశ్వర్రావుతో కలిసి శిక్షణ ఐపీఎస్ కాజోల్ సింగ్ వివరాలు వెల్లడించారు. -
బిడ్డా.. ఓటు మరవొద్దు!
[ 11-05-2024]
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. రాజ్యాంగం మనకు వజ్రాయుధం వంటి ఓటుహక్కును కల్పించింది. దానిని సద్వినియోగం చేసుకోవడం మన బాధ్యత. ప్రతి ఓటు గెలుపోటములను నిర్దేశిస్తుంది. -
తప్పులకు తావు లేదిక
[ 11-05-2024]
ఉపాధ్యాయుల హాజరుకు మొన్నటి వరకు బయోమెట్రిక్ విధానం అమలులో ఉండేది. ప్రస్తుతం ఈ విద్యా సంవత్సరం నుంచి ముఖ గుర్తింపు విధానం అమలు చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సందేశం.. ఆచరణీయం
[ 11-05-2024]
ఎన్నికల్లో ప్రలోభాలు ఎక్కువగా ఉంటాయనే అపవాదు ఉంది. దానిని తొలగించడానికి వివిధ రూపాల్లో ఎవరో ఒకరు స్పందిస్తుంటారు. తాజాగా లోక్సభ ఎన్నికల్లో అలాంటి అవగాహన పెంచే సందేశాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. -
హోటల్ వ్యాపారం మాటున డ్రగ్స్ దందా
[ 11-05-2024]
ప్రేమలో విఫలమైన ఒక చెఫ్ డ్రగ్స్కు అలవాటుపడి.. దాన్నే వ్యాపారంగా మార్చుకున్నాడు. చివరకు పోలీసులకు చిక్కారు. కేసు వివరాలను హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీ రష్మీ పెరుమాల్ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.