logo

బాధితుడికి చెక్కు అందజేత

ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల గ్రామానికి చెందిన నర్సింలు ఇటీవల అనారోగ్యం పాలవ్వడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Updated : 28 Apr 2024 17:09 IST

ఎల్లారెడ్డి పట్టణం: ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల గ్రామానికి చెందిన నర్సింలు ఇటీవల అనారోగ్యం పాలవ్వడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే బాధితుడికి  రూ.1.60 లక్షల విలువ చేసే ఎల్వోసి చెక్కును మంజూరు చేశారు. ఆ చెక్కును గ్రామ కాంగ్రెస్ నాయకులు బాధితుడికి ఆదివారం అందజేశారు.

కాంగ్రెస్‌లో చేరికలు

ఎల్లారెడ్డి పట్టణం: ఎల్లారెడ్డి మండలం భిక్కనూర్ గ్రామానికి చెందిన పలువురు నాయకులు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆధ్వర్యంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సాయిబాబా, భిక్కనూరు గ్రామ పార్టీ అధ్యక్షుడు ఏర్పుల మహేందర్, నాయకులు శ్రీలత మహేందర్ ,గోనె అంజయ్య రమేష్, చిరంజీవి, నరేష్, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు