ప్రచారానికి పొలంబాట
మండే ఎండలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారం కొనసాగిస్తున్నారు. ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్దీ గెలిపే లక్ష్యంగా ప్రచారాన్ని ఉద్ధృతం చేస్తున్నారు. కొన్ని రోజుల కిందటి వరకు కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాలకే పరిమితమైన అభ్యర్థులు, నాయకులు ప్రస్తుతం మరింత జోరు పెంచారు.
మండే ఎండలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారం కొనసాగిస్తున్నారు. ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్దీ గెలిపే లక్ష్యంగా ప్రచారాన్ని ఉద్ధృతం చేస్తున్నారు. కొన్ని రోజుల కిందటి వరకు కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాలకే పరిమితమైన అభ్యర్థులు, నాయకులు ప్రస్తుతం మరింత జోరు పెంచారు. మండల కేంద్రాల్లో అన్ని పార్టీలు రోడ్షోలు నిర్వహించి ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నాయి. ముఖ్యంగా ఎండాకాలం కావడంతో సాయంత్రం నుంచి రాత్రి వరకు మండల కేంద్రాల్లో రోడ్షోలతో ప్రచారం చేస్తున్నారు. గ్రామాల్లో ప్రచారం చేయడానికి మాత్రం నాయకులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది. పొలాలు, ఉపాధిహామీ పనులు జరుగుతుండటంతో నాయకులకు గ్రామాల్లో ఓటర్లను కలిసే అవకాశం రావడం లేదు. దీంతో వారు ‘ప్రజల వద్దకే పాలన’ అన్నట్లు ప్రజలు పనిచేస్తున్న స్థలానికే వెళ్లి తమ పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. తమ నాయకుడిని గెలిపించాలంటూ కోరుతున్నారు.
రాజకీయ పార్టీలనగానే ముందుగా గుర్తొచ్చేది వాటి గుర్తులే. ప్రధానంగా ఎన్నికల సమయంలో పార్టీ అభ్యర్థులతో పాటు గుర్తులకూ ప్రాధాన్యం ఉంటుంది. దేశంలో తొలి ఎన్నికల నుంచే పార్టీ గుర్తులను ప్రవేశపెట్టారు. అప్పట్లో ఓటర్లలో కేవలం 16శాతం మాత్రమే అక్షరాస్యులు ఉండడంతో అభ్యర్థుల పేర్లు చదవడం కష్టమని భావించిన అధికారులు అందరూ గుర్తుపట్టేలా చిహ్నాలు ప్రవేశపెట్టారు. ఈ గుర్తులను గీయడానికి ఎన్నికల సంఘం ఎంఎస్ సేథీ అనే చిత్రకారుడిని నియమించింది. 1951 నుంచి 1992 వరకు ఆయన ఎన్నో వేల చిత్రాలు పెన్సిల్తో గీశారు. కొన్ని సాంకేతిక మార్పులతో ఇప్పటికీ ఇవే గుర్తులను ఎన్నికలకు వాడుతున్నారు.
న్యూస్టుడే, మోర్తాడ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థులు... విజ్ఞాన దీపికలు
[ 15-05-2024]
గిరిరాజ్ కళాశాల విద్యార్థులు పరిశోధనల్లో రాణిస్తున్నారు. ఇందూరు సాహిత్యం, చారిత్రక, పర్యాటక, ప్రజా సంక్షేమం విషయాల సేకరణ, క్షేత్ర పర్యటనలు వంటి అంశాల్లో రాణిస్తూ అబ్బురపరుస్తున్నారు. -
చివరి ఆయకట్టుకు నీరందించండి
[ 15-05-2024]
జిల్లాలోని ముఖ్యమైన ప్రాజెక్టుల్లో రామడుగు ఒకటి. ఈ ప్రాజెక్టు ఆయకట్టు ద్వారా ధర్పల్లి, డిచ్పల్లి, జక్రాన్పల్లి, భీంగల్, వేల్పూర్ మండలాల్లోని గ్రామాలకు రెండు పంటల నీరందిస్తున్నారు. -
ఈ గ్రామాలు ఆదర్శం
[ 15-05-2024]
లోక్సభ ఎన్నికల్లో కొన్ని గ్రామాలు ఆదర్శంగా నిలిచాయి. ఎన్నికల కమిషన్ ఎన్ని స్వీప్ కార్యక్రమాలు నిర్వహించినా కొన్ని గ్రామాల్లో సరాసరిగా 75 శాతం కంటే అధికంగా పోలింగ్ నమోదు కాలేదు -
ఆలోచన అదిరే!
[ 15-05-2024]
ఎండలు మండుతున్న తరుణంలో ద్విచక్రవాహనాలపై ప్రయాణమంటే భయపడాల్సిన పరిస్థితి. దీనికి ప్రత్యామ్నాయం ఆలోచించాడు పెద్దకొడప్గల్ మండలం వడ్లం గ్రామానికి చెందిన యువకుడు బోగేష్. ఈయన హైదరాబాద్లో ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తాడు. -
పైకి గాంభీర్యం.. లోలోన లెక్కలు
[ 15-05-2024]
నిజామాబాద్ లోక్సభ స్థానంలో విజయంపై ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. పోలింగ్ ముగిసి ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉండగా.. గెలుపుపై ఎవరికి వారు తమకు అనుకూలంగా చెప్పుకొంటున్నారు. -
ప్రవేశాల పెంపునకు కసరత్తు
[ 15-05-2024]
గురుకులాలు, కేజీబీవీలు, ఆదర్శ పాఠశాలల్ని కళాశాలలుగా ఆప్గ్రేడ్ చేయడంతో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు విద్యార్థులు మొగ్గు చూపడం లేదని అధ్యాపకులు పేర్కొంటున్నారు. -
నేడు విచారణ
[ 15-05-2024]
కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి లక్ష్మణ్సింగ్ వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. -
ఆలస్యంగా కొనుగోళ్లు
[ 15-05-2024]
తల్లి బిడ్డలను కంటికి రెప్పలాగా ఎలా దాచుకుంటుందో.. అన్నదాతలు సైతం ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని కాపాడుకొని నానా అవస్థలు పడి కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తే లారీలు రాక వర్షానికి తడిసి ఎండిపోతుంటే పట్టించుకునే నాథుడే కరవయ్యారు. -
పెరిగిన ఓటింగ్తో ఉత్కంఠ
[ 15-05-2024]
హోరాహోరీగా సాగిన సార్వత్రిక సమరం ముగిసింది. జహీరాబాద్ లోక్సభ పరిధిలో 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 69.67 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈ సారి 74.63 నమోదైంది. సుమారు ఐదుశాతం మేర పోలింగ్ పెరిగింది -
ఆమె కదిలింది
[ 15-05-2024]
లోక్సభ ఎన్నికల్లోనూ అసెంబ్లీ పోలింగ్ మాదిరిగానే ఓటర్లు పోటెత్తారు. నవంబరులో శాసనసభకు నిర్వహించిన ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఏడు స్థానాల్లో 12,39,568 ఓట్లు పోలయ్యాయి -
‘1.30 లక్షల మెజారిటీతో గెలుస్తాం’
[ 15-05-2024]
నిజామాబాద్ పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ విజయం తథ్యమని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. -
ఉద్యోగిపై ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు
[ 15-05-2024]
విద్యుత్తు శాఖలో పనిచేసే ఉద్యోగి ఒక పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేశారనే విషయం ఆ శాఖలో గుప్పుమంటోంది.
తాజా వార్తలు (Latest News)
-
నార్కోటిక్ అంటాడు.. నమ్మితే ముంచేస్తాడు
-
కోర్టులో ఎన్నికల ఫలితాలు తేల్చుకునేవారు.. మాకు హితబోధలా?: వెస్టర్న్ మీడియాకు జైశంకర్ చురకలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
కృష్ణాలో వైకాపా ఆనవాళ్లు మిగలవు: ఎంపీ బాలశౌరి
-
ఎవరి లెక్కలు వారివే.. భారీ ఆధిక్యంపై కాంగ్రెస్ ధీమా
-
ఆంధ్రప్రదేశ్లో 44 రోజులు... రూ.17 వేల కోట్ల అప్పులు