logo

శతాధిక ఓటర్లకు సత్కారం

రాయగడ జిల్లా గుణుపురం పురసంస్థ పరిధిలో వంద సంవత్సరాలు దాటిన ఓటర్లకు యంత్రాంగం సత్కరించింది. కలెక్టరు మనోజ్‌ సత్యవాన్‌ మహాజన్‌ ఆదేశాలు,

Published : 28 Apr 2024 06:43 IST

గౌరచంద్రపాఢిని సత్కరిస్తున్న డిప్యూటీ కలెక్టరు మధుసూధన తదితరులు, గుణమంజరిని సన్మానిస్తూ..

గుణుపురం, న్యూస్‌టుడే: రాయగడ జిల్లా గుణుపురం పురసంస్థ పరిధిలో వంద సంవత్సరాలు దాటిన ఓటర్లకు యంత్రాంగం సత్కరించింది. కలెక్టరు మనోజ్‌ సత్యవాన్‌ మహాజన్‌ ఆదేశాలు, గుణుపురం సబ్‌కలెక్టరు కిరణ్‌దీప్‌ కౌర్‌ సహొతా సూచనల మేరకు వారిని సన్మానించారు. శుక్రవారం సాయంత్రం శాంతినగర్‌లో ఉంటున్న గౌరచంద్ర పాఢి(104), బెవర్తా వీధిలో ఉంటున్న గుణమంజరి బెవర్తా(106)లను గుణుపురం డిప్యూటీ కలెక్టరు మధుసూధన మాఝి, పుర కార్యనిర్వాహక అధికారి మనోజ్‌ కుమార్‌ తాండిలు సత్కరించి సన్మాన పత్రాలను అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని