logo

కుప్పకూలిన రైల్వే కారిడార్‌ పైకప్పు

పూరీ రైల్వే స్టేషన్‌ ఆవరణలో నిర్మాణంలో ఉన్న కారిడార్‌ పైకప్పు ఆదివారం మధ్యాహ్నం కుప్పకూలింది.

Published : 28 Apr 2024 13:04 IST

గోపాల్‌పూర్‌: పూరీ రైల్వే స్టేషన్‌ ఆవరణలో నిర్మాణంలో ఉన్న కారిడార్‌ పైకప్పు ఆదివారం మధ్యాహ్నం కుప్పకూలింది. ఇక్కడ పనులు చేస్తున్న వారిలో నలుగురు కార్మికులు గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది క్షతగాత్రుల్ని రైల్వే పోలీసులు పూరీ మెడికల్‌ ఆసుపత్రికి చికిత్సకు తరలించారు. పూరీ రైల్వే స్టేషన్‌కు ప్రపంచస్థాయి కల్పించడానికి ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే యంత్రాంగం పనులు ముమ్మం చేసింది. ఈ క్రమంలో 3000 అడుగుల కారిడార్‌ మార్గం పైకప్పు నిర్మాణం జరుగుతుండగా కుప్పకూలింది. ఘటన స్థలానికి చేరుకున్న ఉన్నతాధికారులు పరిస్థితి సమీక్షించారు. నిర్మాణం పనుల్లో లోపమెక్కడ అన్నదానిపై ఉన్నతస్థాయి దర్యాప్తును ఆదేశించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని