కుప్పకూలిన రైల్వే కారిడార్ పైకప్పు
పూరీ రైల్వే స్టేషన్ ఆవరణలో నిర్మాణంలో ఉన్న కారిడార్ పైకప్పు ఆదివారం మధ్యాహ్నం కుప్పకూలింది.
గోపాల్పూర్: పూరీ రైల్వే స్టేషన్ ఆవరణలో నిర్మాణంలో ఉన్న కారిడార్ పైకప్పు ఆదివారం మధ్యాహ్నం కుప్పకూలింది. ఇక్కడ పనులు చేస్తున్న వారిలో నలుగురు కార్మికులు గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది క్షతగాత్రుల్ని రైల్వే పోలీసులు పూరీ మెడికల్ ఆసుపత్రికి చికిత్సకు తరలించారు. పూరీ రైల్వే స్టేషన్కు ప్రపంచస్థాయి కల్పించడానికి ఈస్ట్కోస్ట్ రైల్వే యంత్రాంగం పనులు ముమ్మం చేసింది. ఈ క్రమంలో 3000 అడుగుల కారిడార్ మార్గం పైకప్పు నిర్మాణం జరుగుతుండగా కుప్పకూలింది. ఘటన స్థలానికి చేరుకున్న ఉన్నతాధికారులు పరిస్థితి సమీక్షించారు. నిర్మాణం పనుల్లో లోపమెక్కడ అన్నదానిపై ఉన్నతస్థాయి దర్యాప్తును ఆదేశించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొనసాగుతున్న పోలింగ్
[ 13-05-2024]
కొరాపుట్ పార్లమెంట్ పరిధి రాయగడ అసెంబ్లీ నియోజకవర్గం కాసిపూర్ సమితి దొంగసిలి పంచాయతీలో పోలింగ్ కోన సాగుతోంది. -
వాహనం బోల్తా.. 15 మందికి గాయాలు
[ 13-05-2024]
ఒడిశా- ఆంధ్ర రాష్ట్రాల వివాదాస్పద కొఠీయా పంచాయతీ నేరేడి వలస సమీపంలో సోమవారం సాయంత్రం వ్యాన్ బోల్తా పడిన సంఘటనలో 15 మంది గాయపడ్డారు. -
రెండు గ్రామాల్లో ఎన్నికల బహిస్కరణ
[ 13-05-2024]
రాయగడ జిల్లా బిసం కటక్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో గల సేసికల్ పంచాయతీ మావిడిగుడా, కొలనరా సమితి కొంద చొంపియ గ్రామస్థులు ఎన్నికలను బహిష్కరించారు. -
10 గ్రామాల్లో పోలింగ్ బహిష్కరణ
[ 13-05-2024]
జిల్లాలోని ఉమ్మార్కెట్ నియోజకవర్గం తావ పరిధిలో ఉన్న రామ్ఘర్ సమితి కుడుకు పంచాయతీలో 10 గ్రామాల ప్రజలు సోమవారం ఎన్నికలు బహిష్కరించారు. -
ఆటో బోల్తా.. 18 మందికి గాయాలు
[ 13-05-2024]
జిల్లాలోని ఉమ్మార్కోట్ నుంచి చందహండి వెళ్తుండగా.. జోరిగావ్- చందహండి ఘాట్ రహదారిపై ఆటో బోల్తా పడి 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. -
26 మద్యం దుకాణాలు సీజ్
[ 13-05-2024]
ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కొరాపుట్ జిల్లా యంత్రాంగం మే 11 నుంచి 13వ తేదీ సాయంత్రం 5 వరకు మద్యం విక్రమాలు నిషేధించాలని ఆదేశించింది. -
ఈవీఎంల మొరాయింపు.. ఓటింగ్కు 5 గంటల అంతరాయం
[ 13-05-2024]
కొరాపుట్ జిల్లా కుంద్ర సమితిలో ఈవీఎంలో మొరాయించటంతో ఉదలగుండ గ్రామంలో 5 గంటలు పోలింగ్ నిలిచిపోయింది. -
రహదారి నిర్మించలేదని ఎన్నికల బహిష్కరణ
[ 13-05-2024]
తమ గ్రామాల్లో మౌలిక సదుపాయాలు లేవని గ్రామస్థులు సోమవారం జరిగిన ఎన్నికలను బహిష్కరించారు. -
ఇద్దరు పోలింగ్ అధికారులు సస్పెండ్
[ 13-05-2024]
విధి నిర్వహణలో విశ్వసనీయతను పక్కనపెట్టి ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా పని చేసిన అధికారులను సస్పెండ్ చేశారు. -
7,303 కేంద్రాల్లో నేడు పోలింగ్
[ 13-05-2024]
రాష్ట్రంలో ఓట్ల పండగకు తెరలేచింది. తొలివిడతగా సోమవారం పోలింగ్ జరగనున్న 4 లోక్సభ, 28 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల సిబ్బంది ఆదివారం చేరుకున్నారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరగనుంది. -
మావోయిస్ట్ ప్రాంతాల్లో గట్టి బందోబస్తు: డీజీపీ
[ 13-05-2024]
తొలివిడత పోలింగ్ జరగనున్న ప్రాంతాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీజీపీ అరుణ్ షడంగి చెప్పారు. ఆదివారం భువనేశ్వర్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ. మావోయిస్టుల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో అదనపు బలగాలను నియమించామని, పెట్రోలింగ్ ముమ్మరంగా జరుగుతోందన్నారు. -
15న బొలంగీర్కు రాహుల్ రాక
[ 13-05-2024]
ఈ నెల 15న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బొలంగీర్ రానున్నారు. ఈమేరకు పార్టీ బొలంగీర్ అసెంబ్లీ అభ్యర్థి సమరేంద్ర మిశ్ర ఆదివారం విలేకరులకు చెప్పారు. -
16 మార్గాల్లో బస్సు సేవలు నిలిపివేత
[ 13-05-2024]
రాష్ట్రంలో మొదట విడత ఎన్నికలు సోమవారం జరగనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ జయపురం నుంచి 16 మార్గాలకు వెళ్లే బస్సు రవాణా సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. -
280 మంది రాజకీయ భవిష్యత్తు తేలేది నేడే
[ 13-05-2024]
రాష్ట్రంలో తొలిదశ పోలింగ్ జరగనున్న నాలుగు లోక్సభ, 28 శాసనసభ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న 280 మంది అభ్యర్థుల రాజకీయ భవిష్యత్తు సోమవారం తేలనుంది. తొలిదశలో 62 లక్షల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. -
ఒడి‘సై’ అంటున్న భాజపా
[ 13-05-2024]
బిజదతో మాకు ఎలాంటి మైత్రీ బంధం, అవగాహన లేదని స్పష్టంగా చెప్పేసిన భాజపా నాయకత్వం ఈసారి రాష్ట్ర పాలనా పగ్గాలు చేజిక్కించుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతోంది. ప్రధాని నరేంద్రమోదీ, ఇతర కేంద్ర మంత్రుల వరుస పర్యటనలు, హైటెక్ ప్రచారం శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నాయి. -
గుణుపురంలో త్రిముఖ పోరు.. విజేత ఎవరు?
[ 13-05-2024]
రాయగడ జిల్లా గుణుపురంలో ప్రచార పర్వం ముగిసింది. విజేత ఎవరో నిర్ణయించే సమయం వచ్చింది. ఈవీఎంలు, వీవీప్యాట్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నాయి. తెల్లవారితే పోలింగ్. గుణుపురం నియోజకవర్గంలో 12 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, త్రిముఖ పోరు కనిపిస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. -
భాజపా నేతలది మొసలి కన్నీరు: నవీన్
[ 13-05-2024]
భాజపా నేతలది మొసలి కన్నీరని, వారిని విశ్వసించొద్దని, చెప్పింది చేయరని, రాష్ట్రానికి వారు చేసిందేమీలేదని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ చెప్పారు. సోమవారం బొలంగీర్ జిల్లాలో ఎన్నికల ప్రచారం చేసిన ఆయన తాను నామినేషన దాఖలు చేసిన కంటాబంజి అసెంబ్లీ సెగ్మెంటులోని బంగముండ, మురిబిహాల్, కొలాముండల ప్రాంతాల్లో జరిగిన బహిరంగ సభల్లో ప్రసంగించారు. -
సీఎం పంజరంలో చిలుక
[ 13-05-2024]
ముఖ్యమంత్రి నవీన్ పంజరంలో చిలుకలా మారారని, తన చుట్టూ ఉన్నవారు ఏం చెబితే దాన్ని ప్రజలకు వినిపిస్తున్నారని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఆదివారం సంబల్పూర్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... -
పార్టీల కంటే అభ్యర్థులే ముఖ్యం
[ 13-05-2024]
బ్రహ్మపుర లోక్సభ పరిధిలోని మోహన నియోజకవర్గం గజపతి జిల్లాలో పెద్దది. మోహన గతంలో దిగపొహండి నియోజకవర్గం పరిధిలో ఉండేది. ఈ స్థానం నుంచి దివంగత మాజీ స్పీకర్, మంత్రి సూర్యనారాయణ పాత్ర్ బిజద తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ ఉండేవారు.
తాజా వార్తలు (Latest News)
-
భాజపా సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ కన్నుమూత
-
గుజరాత్ ఆశలపై నీళ్లు చల్లిన వరుణుడు.. కోల్కతాతో మ్యాచ్ రద్దు
-
రాహుల్తో చర్చకు భాజపా రెడీ.. యువ నాయకుడికి అవకాశం
-
మహిళ కిడ్నాప్ కేసు.. హెచ్డీ రేవణ్ణకు బెయిల్
-
అది టీకప్పులో తుపానులాంటిది.. కేఎల్ రాహుల్-సంజీవ్ గోయెంకా ఎపిసోడ్పై ఎల్ఎస్జీ
-
కుప్పకూలిన భారీ హోర్డింగ్.. ఎనిమిది మంది మృతి