logo

డబుల్‌ ఇంజిన్‌ నినాదం ఇక్కడ ఫలితమివ్వదు

రాష్ట్రంలో భాజపా డబుల్‌ ఇంజిన్‌ పాలన నినాదం పనిచేయదని, నవీన్‌ ఇంజిన్‌ మాత్రమే పరుగులు తీస్తుందని బిజద నేత వి.కార్తికేయ పాండ్యన్‌ అన్నారు.

Published : 29 Apr 2024 04:21 IST

కార్తికేయ పాండ్యన్‌

నువాపడలో ప్రసంగిస్తున్న పాండ్యన్‌

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో భాజపా డబుల్‌ ఇంజిన్‌ పాలన నినాదం పనిచేయదని, నవీన్‌ ఇంజిన్‌ మాత్రమే పరుగులు తీస్తుందని బిజద నేత వి.కార్తికేయ పాండ్యన్‌ అన్నారు. శనివారం సాయంత్రం నువాపడలో ఎన్నికల బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ... అభివృద్ధి కోరుతున్నవారు నవీన్‌ పట్ల విశ్వాసం పెంచుకున్నారని, ఆయననే తమ పెన్నిధిగా చేసుకున్నారన్నారు. కోరకుండానే సీఎం అన్నీ సమకూర్చుతున్నారన్న భరోసా ప్రజల్లో ఉందన్నారు. ఈసారి ఎన్నికల్లోనూ మళ్లీ బిజదకు పట్టం కడతారని, నవీన్‌ ఆరోసారి పాలనా పగ్గాలు చేపడతారని చెప్పారు. సభలో మంత్రి రాజేంద్ర డోల్కియా, ఇతర నాయకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని