మౌనమేలనోయి!
రాయగడ జిల్లా గుణుపురం నియోజకవర్గంలో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఈ నెల 29న నామినేషన్ల ఉపసంహరణ జరగనుంది. మే 13వ తేదీన ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.
గుణుపురంలో ప్రచారానికి దూరంగా కాంగ్రెస్ నేతలు
బిజయకుమార్ గమాంగ్
గుణుపురం, న్యూస్టుడే: రాయగడ జిల్లా గుణుపురం నియోజకవర్గంలో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఈ నెల 29న నామినేషన్ల ఉపసంహరణ జరగనుంది. మే 13వ తేదీన ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. గుణుపురం నియోజకవర్గంలో గుణుపురం, గుడారి, పద్మపురం, రామన్నగుడ, చంద్రపూర్ సమితులతో పాటు గుణుపురం పురసంస్థ, గుడారి ఎన్ఏసీలున్నాయి. 289 పోలింగు కేంద్రాలు, 2,21,495 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. ఒక్కో సమితిలో మూడు రోజలు ప్రచారం చేసినా సమయం సరిపోదు. అయినా కాంగ్రెసు నాయకులు మౌనం వీడటం లేదు. జిల్లా కాంగ్రెసు అధ్యక్షునిగా బిజయ కుమార్ గమాంగ్, ఆయన భార్య మహిళా కాంగ్రెసు నాయకురాలుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలలో గమాంగ్తో పాటు ఆయన కుమారుడు అవినాష్ గమాంగ్ (రాష్ట్ర యువజన కాంగ్రెసు అధికార ప్రతినిధి) కాంగ్రెసు టికెట్టు ఆశించినా, రాకపోవడంతో కొరాపుట్ లోక్సభ, గుణుపురం ఎమ్మెల్యే స్థానాలకు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్లు వేశారు. అవినాష్తోపాటు ఆయన తల్లి కేతకీ గమాంగ్ కూడా కాంగ్రెస్కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన కుమారునికి టికెట్ ఇవ్వలేదని, జిల్లా కాంగ్రెసు అధ్యక్షునిగా ఉన్నా తనకు తగిన గుర్తింపు లేదని బిజయకుమార్ గమాంగ్ అలక వహించినట్లు, అందువల్లే ఇంటి నుంచి బయటకు రాకుండా ప్రచారంలో పాల్గొనడం లేదని విశ్లేషకుల అంచనా.
రఘునాథ్ అసంతృప్తి
గుడారి సమితిలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ఈ ప్రాంతంలో పార్టీలో భీష్మ పితామహునిగా గుర్తింపు పొందిన రఘునాథ్ పాత్ర్ కూడా ప్రచారంలో పాల్గొనడం లేదని సమాచారం. భాస్కర జగరంగాకు టికెట్ ఇప్పించాలని రఘునాథ్ విశ్వ ప్రయత్నాలు చేశారు. ఆయనకు అవకాశం దక్కలేదు. దీంతో భాస్కర కూడా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఆయన మద్దుతుదారునికి టికెట్ లభించకపోవడంతో రఘునాథ్ అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. ఇలాఎవరూ ప్రచారం చేయకుండా మౌనం వహిస్తున్నారు. పార్టీలో అగ్రనాయకులు చొరవ చూపించి కాంగ్రెసులో రేబెల్స్ లేకుండా వారిని ఒప్పించి నామినేషన్లు ఉపసంహరణ అయ్యేలా చూడాలని పార్టీ శ్రేణులు అంటున్నాయి. విభేదాలు లేకుండా అంతా కలిసి ఎన్నికల్లో ముందుకుసాగితే విజయం సాధించవచ్చని అంటున్నాయి. రానున్న రోజుల్లో సమీకరణాలు ఎలా మారనున్నాయో వేచి చూడాల్సిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్నాథుని ఆశిస్సులెవరికి?
[ 15-05-2024]
హరి (జగన్నాథుడు) నామస్మరణతో నిరంతర మార్మోగే పూరీ తుర్పుతీర దివ్యధామంలో ఇప్పుడు రాజకీయ వేడి పెరిగింది. ఎన్నికల నేపథ్యంలో ప్రచారం ఊపందుకుంది. -
స్ట్రాంగ్రూంలో ఈవీఎంల భద్రత
[ 15-05-2024]
బ్రహ్మపుర లోక్సభ, దాని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సోమవారం ప్రశాంతంగా పోలింగు జరిగింది. -
రాయగడ జిల్లాలో 74.44 శాతం పోలింగ్
[ 15-05-2024]
తొలిదశలో సోమవారం జరిగిన ఎన్నికల్లో రాయగడ జిల్లాలో 74.44 శాతం పోలింగ్ జరిగింది. మూడు నియోజకవర్గాలున్న జిల్లాలో బిసంకటక్ శాసనసభ స్థానంలో అత్యధికంగా 77.93 శాతం పోలింగ్ నమోదైంది. -
కోస్తా, తీర, పశ్చిమ జిల్లాల్లో ప్రచారం ముమ్మరం
[ 15-05-2024]
ఉత్తరకోస్తా, తీర, పశ్చిమ జిల్లాల్లో ఈ నెల 20, 25, జూన్ 1 తేదీల్లో పోలింగ్ జరగనుండగా ఎన్నికల ప్రచారం ఊపందుకుంది -
తెలుగు ఓటర్లవైపు పార్టీల చూపు
[ 15-05-2024]
లోక్సభ ఎన్నికల్లో తెలుగు ఓటర్లను ఆకర్షించడానికి తృణమూల్ కాంగ్రెస్, భాజపా, వామపక్ష పార్టీల కూటమి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి -
నేడు కటక్లో అమిత్షా రోడ్షో
[ 15-05-2024]
కేంద్ర హోంమంత్రి అమిత్షా బుధవారం సాయంత్రం కటక్ వస్తున్నారు. భాజపా నగరశాఖ ఆధ్వర్యంలో 10 కిలోమీటర్ల మేర రోడ్షో నిర్వహించనున్నట్లు పార్టీ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడు గోలక్ మహాపాత్ర్ మంగళవారం భువనేశ్వర్లో విలేకరులకు చెప్పారు. -
ఇలా వస్తానని... అలా మాయమైంది
[ 15-05-2024]
ఇప్పుడే వస్తానని తోటి మహిళను నమ్మించి, ఆమె చేతిలో శిశువును పెట్టి ఓ మాతృమూర్తి పరారైంది. -
చకచకా రథ చక్రాల పనులు
[ 15-05-2024]
తెల్లవారక ముందే స్నానం, తర్వాత పురుషోత్తమ దర్శనం... స్వామి తీర్థ ప్రసాదాల ఆరగింత... అనంతరం శ్రీక్షేత్ర కార్యాలయం ఆవరణలో ఏర్పాటైన చలవ పందిరికి చేరుకుని రథచక్రాల పనులు.. ఇవీ ప్రస్తుతం శ్రీక్షేత్రం ఆవరణలో మహరణా (వడ్రంగి) సేవాయత్ల నిత్యకృత్యాలు. జులై 7న ఇక్కడ విశ్వప్రసిద్ధ రథయాత్ర నిర్వహించనున్నారు. -
బ్రహ్మపుర లోక్సభ భాజపా అభ్యర్థి ప్రదీప్పై దాడి
[ 15-05-2024]
బ్రహ్మపుర లోక్సభ నియోజకవర్గం భాజపా అభ్యర్థి ప్రదీప్ కుమార్ పాణిగ్రహిపై బ్రహ్మపుర అసెంబ్లీ సెగ్మెంట్ స్వతంత్ర అభ్యర్థి శిబశంకర దాస్ (పింటు దాస్) సోమవారం రాత్రి దాడి చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
మధ్యవర్తి వంచన.. వలస జీవులు కాలినడకన
-
నిశిరాత్రిలో ఘోరం.. అయిదుగురి సజీవదహనం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (15/05/24)
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
-
అమెరికాలో చైనా ‘సైన్యం’.. ట్రంప్ ప్రచారంపై రచ్చ!
-
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!