logo

మధుబాబు సేవలు చిరస్మరణీయం: గవర్నర్‌

స్వతంత్ర ఒడిశా ఏర్పాటు ఉద్యమానికి ఊపిరిలూదిన ఉత్కళగౌరవ్‌ మధుసూదన్‌ దాస్‌ రాష్ట్రానికి చేసిన సేవలు చిరస్మరణీయమని, ఉత్కళీయులకు మార్గదర్శిగా నిలిచారని గవర్నరు రఘుబర్‌దాస్‌ అభివర్ణించారు.

Published : 29 Apr 2024 04:27 IST

మధుబాబు విగ్రహం వద్ద ఉత్కళ సమ్మేళని ప్రతినిధులతో గవర్నరు రఘుబర్‌ దాస్‌

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: స్వతంత్ర ఒడిశా ఏర్పాటు ఉద్యమానికి ఊపిరిలూదిన ఉత్కళగౌరవ్‌ మధుసూదన్‌ దాస్‌ రాష్ట్రానికి చేసిన సేవలు చిరస్మరణీయమని, ఉత్కళీయులకు మార్గదర్శిగా నిలిచారని గవర్నరు రఘుబర్‌దాస్‌ అభివర్ణించారు. మధుబాబు జయంతిని పురస్కరించుకుని ఆదివారం రాజ్‌భవన్‌ ఆవరణలో ఉత్కళ సమ్మేళని ప్రతినిధుల సమక్షంలో జరిగిన కార్యక్రమంలో రఘుబర్‌ ఆయన విగ్రహం వద్ద పుష్ఫగుచ్చాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించి మాట్లాడారు. రాష్ట్ర ప్రగతి కోసం తుదిశ్వాస వరకు ఉద్యమించిన మధుబాబు ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడానికి అన్నివర్గాల ప్రజలు ముందుకు రావాలన్నారు. మధుబాబు జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి నవీన్‌ నివాస్‌లో దివంగత నేతకు శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన విగ్రహం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని