logo

నాలుగు స్థానాలకు కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రకటన

కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మూడు అసెంబ్లీ, విజయనగరం పార్లమెంట్‌ స్థానాలకు అభ్యర్థులను ఆ పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. నెల్లిమర్ల నియోజకవర్గం అభ్యర్థిగా సరగడ రమేష్‌కుమార్‌ (పార్టీ జిల్లా అధ్యక్షుడు), గజపతినగరం అసెంబ్లీ అభ్యర్థిగా విజయనగరానికి చెందిన డోల శ్రీనివాసరావు (రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) ఉన్నారు.

Published : 23 Apr 2024 03:33 IST

విజయనగరం మయూరి కూడలి, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మూడు అసెంబ్లీ, విజయనగరం పార్లమెంట్‌ స్థానాలకు అభ్యర్థులను ఆ పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. నెల్లిమర్ల నియోజకవర్గం అభ్యర్థిగా సరగడ రమేష్‌కుమార్‌ (పార్టీ జిల్లా అధ్యక్షుడు), గజపతినగరం అసెంబ్లీ అభ్యర్థిగా విజయనగరానికి చెందిన డోల శ్రీనివాసరావు (రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) ఉన్నారు. ఇప్పటికే గజపతినగరం అభ్యర్థిగా గదపు కూర్మినాయుడు పేరు ప్రకటించినప్పటికీ మార్పుచేశారు. బొబ్బిలి అసెంబ్లీ అభ్యర్థిగా మారిపి విద్యాసాగర్‌, విజయనగరం పార్లమెంట్‌ అభ్యర్థిగా బొబ్బిలి శ్రీనివాసరావు పేరు ప్రకటించారు. ఈయన భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఆదివారం ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. వెంటనే అభ్యర్థిగా ప్రకటించింది. 2019లో గజపతినగరం అసెంబ్లీ అభ్యర్థిగా కాంగ్రెస్‌ నుంచి పోటీ చేశారు. తర్వాత భాజపాకు వెళ్లి మళ్లీ సొంతగూటికి వచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని