ఇది జగనన్న చీకటి రాజ్యం..!!
వైకాపా ప్రభుత్వ పాలనలో ప్రజలకు అంధకారమే మిగిలింది. ఎక్కడ చూసినా వీధి దీపాల నిర్వహణ అధ్వానంగా ఉంది.
రాజాం పట్టణాల్లో పరిస్థితి
బొబ్బిలి పట్టణం బాలాజీ నగర్ ప్రాంతంలో పరిస్థితి
వైకాపా ప్రభుత్వ పాలనలో ప్రజలకు అంధకారమే మిగిలింది. ఎక్కడ చూసినా వీధి దీపాల నిర్వహణ అధ్వానంగా ఉంది. బొబ్బిలి పట్టణంలోని ప్రధాన రహదారులు మినహా పూర్తి స్థాయిలో ఎక్కడా దీపాలు వెలగడం లేదు. రాజాం శివారు ప్రాంతాలు చీకటి పడితే అంధకారంలో మగ్గుతున్నాయి. ఓ పక్క దొంగలు, మరోపక్క విష సర్పాల భయంతో పట్టణవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిర్వహణకు నిధులు లేక ఇబ్బందులు ఏర్పడ్డాయి.
న్యూస్టుడే, బొబ్బిలి, రాజాం బొబ్బిలి,
పనులకు నిధుల్లేవ్
రాజాం పట్టణ పరిధిలోని పాలకొండ, బొబ్బిలి, శ్రీకాకుళం, ప్రధాన, రహదారుల్లో అన్నీ దీపాలు వెలగడం లేదు. విజయనగరం రహదారిలో గాయత్రీ కాలనీ వరకూ అంధకారం నెలకొంటోంది. ఇక్కడ వీధి దీపాలు ఏర్పాటు చేయాలని ఎంతగా మొత్తుకుంటున్నా అధికారులు పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారి విస్తరణ పనులు నిలిచిపోవడం, దీనికి అంధకారం తోడవడంతో రాత్రివేళల్లో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. కొత్త ప్రాంతాలు, శివారు కాలనీల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. దీపం మరమ్మతులకు గురైతే బాగు చేయడానికి నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. వీధి దీపాల ఏర్పాటు, నిర్వహణను ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్)కు గతంలో అప్పగించారు. ఒప్పందం ముగిసిన తరువాత మున్సిపాల్టీలే సొంతంగా ఏర్పాటు చేసుకుని నిర్వహించుకోవాల్సి వస్తోంది. నిర్వహణకు నిధుల్లేక పోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 300 వీధి దీపాలు వచ్చాయని చెబుతున్నా.. క్లాంపులు, వైర్లు, నట్లు, బోల్టులు వంటివి రాకపోవడంతో కొత్తవి ఏర్పాటు చేయలేదనిఅంటున్నారు. పట్టణంలో 180 సెంటర్ లైటింగ్ (120 వాట్స్), 16 ఐమాక్స్ లైట్లు, 3 వేల వరకూ వీధి దీపాలు ఉన్నాయి. సమస్యను తమ దృష్టికి తెస్తే పరిష్కరిస్తామని కమిషనర్ జాగరపు రామ అప్పలనాయుడు తెలిపారు.
ఇందిరమ్మ కాలనీ ప్రధాన రోడ్డులో ఇలా..
పాలకుల నిర్లక్ష్యం శాపమై..
బొబ్బిలి పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో 3,000 గృహాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో రెండు నెలలుగా సగానికిపైగా దీపాలు వెలగడం లేదు. రావువారివీధి, చినచెరువు గట్టు, ఎస్సీ కాలనీ శివారు, బాలాజీనగర్ ప్రాంతాల్లో దీపాలు ఉన్నా వెలుతురు లేదు. ఇటీవల గాలులతో కొన్ని మరమ్మతులకు గురయ్యాయని, కొత్తవి అమర్చుతున్నామని పురపాలక ఏఈ రవి చెప్పారు. ఇందిరమ్మ కాలనీలో తీగలు కొత్తవి వేయాలని, రూ.20 లక్షలు కేటాయించామన్నారు. వీధి దీపాల నిర్వహణకు పురపాలక నిధులు సకాలంలో కేటాయించక పోవడంతో సమస్య ఏర్పడుతోంది. ఏడాదికి సుమారు రూ.5 లక్షలు నిర్వహణకు ఖర్చుచేస్తున్నట్లు చెబుతున్నారు. గుత్తేదారులకు సకాలంలో చెల్లింపులు లేక ముందుకు రావడం లేదు.
మూడు నెలలుగా ఇంతే..
మూడు నెలలుగా ఇందిరమ్మకాలనీ ప్రధాన వీధుల్లో దీపాలు వెలగడం లేదు. బల్బులు అమర్చినా ఉపయోగం లేకుండా పోయింది. ఏవో విద్యుత్తు తీగలు పాడయ్యాయని చెబుతున్నారు. నెలలు గడిచినా వాటిని బాగుచేయడం లేదు. రాత్రిపూట చాలా ఇబ్బందులు పడుతున్నాం. వీధుల్లో టార్చు వేసుకుని తిరగాల్సి వస్తోంది.
రవణమ్మ, ఇందిరమ్మ కాలనీ, బొబ్బిలి
దొంగల భయం
నిత్యం అంధకారంలో మగ్గుతున్నాం. మా వీధిలో దీపాలు వెలగడం లేదు. అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. మా ఇంటి చుట్టూ ఖాళీ ప్రదేశాలు ఉన్నాయి. తుప్పలు, డొక్కలు ఉండడంతో పాములు చేరుతున్నాయి. దొంగల భయం వెంటాడుతోంది. ఏం చేయాలో తెలియడం లేదు. బిక్కు బిక్కుమని జీవనం సాగిస్తున్నాం.
రాములమ్మ, బొబ్బిలి, ఐటీఐ కాలనీ
అడుగు వేయలేకపోతున్నాం
చీకటి పడితే ఇంటి నుంచి బయటికి అడుగుపెట్టలేకపోతున్నాం. విద్యుత్తు స్తంభాలు దిష్టి బొమ్మల్లా ఉన్నాయి. ఏవీ పనిచేయకపోయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. రాత్రిపూట కుక్కల బెడద ఎక్కువగా ఉంది. శివారు ప్రాంతం కావడం వల్ల పాములు కూడా ఎక్కువగా తిరుగుతున్నాయి. చాలా భయమేస్తోంది.
లక్ష్మి, బొబ్బిలి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి
[ 11-05-2024]
తెదేపా అభ్యర్థి బోనెల విజయచంద్రను అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలంటూ మండలంలోని వెంగళరాయపురం, జనార్ధన వలస గ్రామాల్లో శనివారం తెదేపా కార్యకర్తలు ప్రచారం నిర్వహించారు. -
అన్నదాతకు రక్తకన్నీరు!!
[ 11-05-2024]
కాలువలకు సంబంధించి జరిగిన పనులకు గుత్తేదారుకు బిల్లులు బకాయిలు ఉన్నాయి. రూ.17 కోట్ల మేర చెల్లింపులు జరగాల్సి ఉంది. ఈ కారణంగా రబీలో తిరిగి పనులు ప్రారంభించలేదు. వచ్చే నెలతో పనులకు గడువు ముగియనుంది. -
యువ జపం
[ 11-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోరు చివరి దశకు చేరింది. వ్యూహాలు, ప్రతివ్యూహాలతో అధికార వైకాపా, కూటమి పార్టీల అభ్యర్థులు హోరాహోరీగా దూసుకెళ్తున్నారు. -
నోట్లకట్టలు తెగుతున్నాయ్
[ 11-05-2024]
పోలింగ్కు నాలుగు రోజుల ముందు నుంచి వైకాపా ఓటర్లను ప్రలోభ పెడుతోంది. గురువారం రాత్రి నుంచే పంపకాలు మొదలెట్టింది. ముందస్తుగా నిల్వ చేసిన మద్యం సీసాలున్న పెట్టెలు విప్పుతున్నారు. -
ప్చ్.. గప్చుప్
[ 11-05-2024]
ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. గత నెల 29న నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ప్రచారం ఊపందుకుంది. ఉమ్మడి జిల్లాలో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో 129 మంది పోటీలో ఉన్నారు. -
ప్రజా వైద్యానికి జగన్ వైరస్
[ 11-05-2024]
రాష్ట్రంలో అయిదేళ్ల వైకాపా పాలనలో ప్రజావైద్యానికి వైరస్ సోకింది.. సామాన్యుడికి సుస్తీ చేస్తే ప్రభుత్వ దవాఖానాల్లో సరైన వైద్యం అందని పరిస్థితి నెలకొంది. ‘వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తాం.. -
జగనన్న అప్పులు.. జీతాలకు తిప్పలు
[ 11-05-2024]
ఉపాధి హామీ పథకం సాంకేతిక సహాయకులకు జీతాల చెల్లింపు బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకొంది. స్థానికంగా అందుబాటులో ఉన్న నిధుల నుంచే చెల్లించాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఇంజినీరింగ్ విభాగం స్పష్టం చేసింది. -
సంచిలో నగదు.. యువకుడి నిజాయతీ
[ 11-05-2024]
రహదారి పక్కన సంచిలో కనిపించిన నగదును పోలీసులకు అప్పగించి తద్వారా సంబంధిత వ్యక్తికి అప్పగించి సూరజ్ అనే యువకుడు నిజాయతీని చాటుకున్నాడు. -
ఐసీయూలో సర్కార్ వైద్యం
[ 11-05-2024]
ముఖ్యమంత్రి జగన్ అబద్దపు హామీలతో ప్రజలను మభ్యపెట్టి మోసం చేశారు. పేదలకు మెరుగైన వైద్యం అందిస్తామని మాటిచ్చిన ఆయన ఆసుపత్రులు, రోగుల సమస్యలను పట్టించుకోలేదు. -
బోద కనపడదా.. బాధ వినపడదా?
[ 11-05-2024]
జిల్లాలో ఫైలేరియా వ్యాధితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామాల్లో బలిజిపేట మండలం పెదపెంకి ఒకటి. వ్యాధి బారిన పడి ఎందరో ఇళ్లకే పరిమితమయ్యారు. కొందరు మృత్యువాత పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
ఓటర్ల కోసం ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు: ఎండీ ద్వారకా తిరుమలరావు
-
కడుపు కోతలో తల్లిదండ్రులు.. చిన్నారి మృతదేహాన్ని వదిలేసిన విమాన సిబ్బంది
-
లింక్డ్ఇన్లో పోస్ట్ డిలీట్.. మైక్రోసాఫ్ట్తో ఓలా కటీఫ్
-
గవర్నర్ వీడియోల పెన్డ్రైవ్ ఉంది.. మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు
-
ఓడినా.. గెలిచినా పట్టించుకోరు.. ధోనీ ఎంటర్టైన్ చేస్తున్నాడంతే: సెహ్వాగ్
-
ఛత్తీస్గడ్లో మావోయిస్టుల కోటకు బీటలు.. దండకారణ్యంలో భద్రతా దళాల దూకుడు