రూపాయి రుణమివ్వని జగన్
బీసీల్లో వివిధ వర్గాలకు చెందిన వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు గత ప్రభుత్వం కాపు, కుమ్మరి, రజక, నాయీ బ్రాహ్మణ, వాల్మీకి, బోయి తదితర కులాలతో పాటు ఈబీసీ, ఎంబీసీ(సంచార జాతులు), వైశ్య తదితర కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది.
ఐదేళ్లలో కార్పొరేషన్లన్నీ నిస్తేజం
యువతకు స్వయం ఉపాధి దూరం
న్యూస్టుడే, విజయనగరం మయూరి కూడలి
తెదేపా హయాంలో ఏర్పాటైన యూనిట్(పాతచిత్రం)
- ‘నా బీసీలందరికీ ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, వారిని ఆర్థికంగా లక్షాధికారులను చేసి, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్నది మా ప్రభుత్వం ఉద్దేశం. గత ఎన్నికల సమయంలో సీఎం జగన్ చెప్పిన మాటలివి. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. గత ఐదేళ్లలో బీసీ ప్రధాన కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులకు ఒక్క రూపాయి కూడా రుణం దక్కలేదు. దీంతో యువత, నిరుద్యోగులు స్వయం ఉపాధికి దూరమయ్యారు.
- నాపేరు పైడిరాజు. మాది విజయనగరం. రూ.5 లక్షలతో దుకాణం పెట్టుకోవాలని కొన్ని నెలల నుంచి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో యూనిట్ పెట్టుకోలేకపోయా. రోజువారీ కూలి పనులకు
- వెళ్తున్నా.
- నా పేరు రమా. మాది విజయనగరం. గత ప్రభుత్వ హయాంలో నేను బ్యుటీషన్ కోర్సు నేర్చుకున్నా. ఏడాది పాటు ఉచిత శిక్షణ పొందా. అనంతరం ప్రభుత్వం మారింది. సొంతగా దుకాణం పెట్టుకోవాలని బీసీ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లాను. ప్రస్తుతం రుణాలు ఇవ్వడం లేదని అధికారులు తెలిపారు. దీంతో అప్పు చేసి దుకాణం నడుపుతున్నా.
ఇదీ పరిస్థితి..
బీసీల్లో వివిధ వర్గాలకు చెందిన వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు గత ప్రభుత్వం కాపు, కుమ్మరి, రజక, నాయీ బ్రాహ్మణ, వాల్మీకి, బోయి తదితర కులాలతో పాటు ఈబీసీ, ఎంబీసీ(సంచార జాతులు), వైశ్య తదితర కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. అవసరం మేరకు 50 శాతం రాయితీతో రుణాలు అందించేవారు. స్వయం ఉపాధిలో భాగంగా 30 శాతం, ఆదరణ పథకం కింద కొన్ని యూనిట్లకు 90 శాతం వరకు సబ్సిడీ దక్కేది. అంతే కాకుండా ఎన్బీసీఎఫ్డీసీ ద్వారా 40 శాతం రాయితీతో వాహనాలు అందించేవారు. 2014 నుంచి 2019 మార్చి వరకు ఉమ్మడి జిల్లాలో 50,852 మందికి రూ.220.98 కోట్ల రుణం అందించారు. వైకాపా వచ్చాక రూపాయి కూడా దక్కలేదు.
అప్పట్లో ఇచ్చిన యూనిట్లు..
కులవృత్తులు చేసుకునే కుమ్మరి, కంసాలి, పద్మశాలి, శాలి, రజక, నాయీ బ్రాహ్మణ, వాల్మీకి, బోయి, ఇతర వర్గాలకు చెందిన వారు టీ, టిఫిన్ దుకాణం, హోటల్, కూరగాయలు, విద్యుత్తు పరికరాలు, మందులు, దుస్తులు, వ్యవసాయ పరికరాలు, ఇతర సామగ్రి, వాహనాలు తదితర దుకాణాలు పెట్టుకునేందుకు అవకాశం ఉండేది. ఈమేరకు పథకాల కింద రుణాలు దక్కేవి. అలాగే ట్రాక్టర్లు, ఇన్నోవా కార్లు, ఆటోలు ఇచ్చేవారు. జగన్ ప్రభుత్వం వచ్చాక ఒక్క రూపాయి గానీ, ఒక్క వాహనం గానీ అందలేదు.
రాయితీలు ఇలా..
గత ప్రభుత్వ హయాంలో బీసీ విభాగాల్లోని పలు కార్పొరేషన్ల ద్వారా పెద్దఎత్తున రుణాలు దక్కాయి. ఆదరణ పథకం కింద 90 శాతం రాయితీ వచ్చేది. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా ఉండేది. ఎన్బీసీఎఫ్డీసీలకు రెండు ప్రభుత్వాలూ కలిపి 40 శాతం సబ్సిడీ అందించేవి. మిగిలిన 60 శాతాన్ని కార్పొరేషన్ కింద ఇచ్చేవారు. బీసీ, ఈబీసీ, ఎంబీసీ, వైశ్య తదితర కార్పొరేషన్లకు లబ్ధిదారుడి వాటాగా రూపాయి కట్టించుకోకుండా 50 శాతం రుణం అందించేవారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఖాకీలపైనే లాఠీన్యం
[ 12-05-2024]
ఉద్యోగులకు అది చేస్తాం.. ఇది చేస్తాం అని మాటలు చెప్పి.. వారికి తీరని అన్యాయం చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్కే దక్కుతుంది. నెత్తిన టోపీతో శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం శ్రమించే వారికి జగన్ పెద్ద టోపీˆయే పెట్టారు. -
మౌలిక సౌకర్యాల మాటే మరిచారు
[ 12-05-2024]
భామిని మండలంలోని తువ్వ కొండల్లో నం.129 మణిగ పోలింగ్ కేంద్రం ఉంది. యాతంగూడ, మూలగూడ, చీమలగూడ, భూర్జగూడ, పెద్దమూలగూడ గ్రామాల నుంచి గిరిజన ఓటర్లు ఏడు కిలోమీటర్లు దూరం నడిచి ఇక్కడికి చేరుకోవాల్సి ఉంది. -
కొఠియాపై సర్కారు ఖిన్ను
[ 12-05-2024]
రాష్ట్రాల విభజన సమయంలో కొఠియాలోని 21 గ్రామాలపై వివాదం నెలకొంది. 1965లో ఆ గ్రామాలు తమవేనని ఒడిశా తొలిసారి కోర్టుకు వెళ్లగా స్టేటస్కో ఇచ్చింది. -
291 సమస్యాత్మక కేంద్రాల గుర్తింపు
[ 12-05-2024]
సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం సన్నద్ధమైంది. నాలుగు నియోజకవర్గాల్లో 7,83,440 మంది ఓటర్లు ఉన్నారు. -
మైళ్లకొద్ది నడవాలి.. కొండలు, వాగులూ దాటి వెళ్లాలి
[ 12-05-2024]
పాచిపెంట మండలంలో గిరిశిఖర గ్రామాల ప్రజలు ఓటేయాలంటే వాగులు, వంకలు దాటాలి. మైళ్ల దూరం నడిచి పోలింగు కేంద్రాలకు చేరుకోవాలి. కొండల మీదుగా ఉన్న అధ్వానదారులతో నరకయాతన పడాలి. -
‘మందు’ జాగ్రత్త..
[ 12-05-2024]
సాధారణ ఎన్నికల సందర్భంగా శనివారం సాయంత్రం నుంచి మద్యనిషేధం అమల్లోకి వచ్చింది. ఉదయం మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. -
ఎన్నికల ప్రచారానికి తెర
[ 12-05-2024]
సాధారణ ఎన్నికల ప్రచారం శనివారం ముగియడంతో రాజకీయ పార్టీల ప్రచార వాహనాలు పార్టీ కార్యాలయాలకు చేరాయి. -
ఎన్ని‘కల’లో!!
[ 12-05-2024]
కర్ర ఒంపును పొయ్యి తీస్తుందంటారు. అధికారం చేతిలో ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరించి వేధిస్తే జనాలకూ ఓ రోజు వస్తుంది. ఆ రోజు మాత్రం ఓటరే మారాజు.
తాజా వార్తలు (Latest News)
-
విజయవాడలో బస్సుల కొరత.. ఆర్టీసీ తీరుపై ప్రయాణికుల మండిపాటు
-
ఫ్యాన్స్కు ‘సండే’ ఫన్.. నాలుగు టీమ్ల్లో ఎవరిది విన్?
-
ఇజ్రాయెల్కు ఇరాన్ ‘అణు’ బెదిరింపులు..
-
మీకు ఇంకా ఓటర్ స్లిప్ రాలేదా.. ఇలా చేయండి!
-
బెట్టింగ్లో రూ.2 కోట్లు పోగొట్టిన కుమారుడు.. రాడ్డుతో కొట్టి చంపిన తండ్రి
-
ముంబయిపై ‘తొలిసారి’ రికార్డు విజయాలు సాధించిన కోల్కతా