వైకాపాకు ఓట్లేయాలని చర్చిలో ప్రసంగం
ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలనే లక్ష్యంతో వైకాపా నాయకులు ఎన్ని అడ్డదారులైనా తొక్కడానికి వెనుకాడడం లేదు. కొండపి మండలంలో ఆదివారం రాత్రి జరిగిన సంఘటనే ఇందుకు నిదర్శనం.
కొండపిలోని చర్చిలో మాట్లాడుతున్న వైకాపా నాయకుడు వెంకటేశ్వర్లు
ఈనాడు, ఒంగోలు: ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలనే లక్ష్యంతో వైకాపా నాయకులు ఎన్ని అడ్డదారులైనా తొక్కడానికి వెనుకాడడం లేదు. కొండపి మండలంలో ఆదివారం రాత్రి జరిగిన సంఘటనే ఇందుకు నిదర్శనం. మండలంలోని గోగినేనివారిపాలేనికి చెందిన చింతల ఎక్స్పోర్ట్స్ అధినేత, వైకాపా నాయకుడు చింతల వెంకటేశ్వర్లు తమ పార్టీని గెలిపించాలంటూ చర్చిలోనే ఏకంగా ఎన్నికల ప్రసంగం చేశారు. కొండపి బీసీ కాలనీతోపాటు మండలంలోని గోగినేనివారిపాలెం, కోయవారిపాలెంలలోని చర్చిల్లో ప్రార్థనలు ఏర్పాటు చేశారు. చీరలు పంపిణీ చేస్తామని చెప్పడంతో పలువురు మహిళలు హాజరయ్యారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. భాజపాకు, దానికి మద్దతిస్తున్న తెదేపా, జనసేన పార్టీలను ఎన్నికల్లో ఓడించాలన్నారు. వైకాపా అభ్యర్థి ఆదిమూలపు సురేష్ను గెలిపించాలని కోరారు. అక్కడితో ఆగకుండా క్రైస్తవులతో వైకాపాకు ఓట్లు వేయిస్తే పాస్టర్లకు భారీ తాయిలాలు అందజేస్తామని కూడా చెప్పడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అష్ట దిక్కులా ప్రభం‘జనం’
[ 15-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో జిల్లా ఓటర్లు చైతన్యం చాటారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితో సోమవారం ఉదయాన్నే కేంద్రాలకు చేరుకుని తమ హక్కు వినియోగిచుకున్నారు. గంటలపాటు వరుసలో నిల్చుని మరీ తమవంతు వచ్చే వరకు ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
దూషణలు.. బెదిరింపులు.. దాడులు
[ 15-05-2024]
సార్వత్రిక ఎన్నికల పర్వం మొదలైనప్పటి నుంచి అధికార పార్టీ నాయకులు బరితెగిస్తూనే ఉన్నారు. ప్రకటన వెలువడినప్పటి నుంచే ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు తాయిలాలు ఎర వేశారు. ఊరూరా పంపకాలు సాగించారు. పోలింగ్ ముందు రోజు రాత్రి వరకు ఈ పరంపర కొనసాగించారు. -
ప్రలోభ పెట్టినా.. చెవిలో పువ్వే!
[ 15-05-2024]
ఎన్నికల ప్రకటన వెలువడినప్పటి నుంచి పోలింగ్కు ముందు రోజు వరకు ఆ అభ్యర్థి ఓటర్లను ప్రలోభాలకు గురిచేశారు. విశ్రాంత పోలీసు అధికారులు, పొరుగు జిల్లాల నుంచి రప్పించుకున్న వ్యక్తులతో సొంత సైన్యాన్ని సిద్ధం చేసుకున్నారు. ప్రతి సచివాలయం పరిధిలోనూ ఒకరిని నియమించుకుని వారితో మంత్రాంగం నడిపారు. -
17,95,744 మంది తీర్పు నిక్షిప్తం
[ 15-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అనంతరం ఈవీఎంలను ఒంగోలు సమీపంలోని రైజ్ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. జిల్లా వ్యాప్తంగా 2,183 పోలింగ్ కేంద్రాల్లో సోమవారం ఎన్నికలు పూర్తయ్యాయి. -
వలస ఓటర్లపై రెండింతల బాదుడు
[ 15-05-2024]
ఓట్ల పండగకు వచ్చిన పేదలకు తిరుగు ప్రయాణంలో కష్టాలు వెంటాడుతున్నాయి. ఎంతో ఉత్సాహంగా ఓటేసి తమ తమ గమ్య స్థానాలకు బయలుదేరిన వారిపై ప్రైవేటు యాజమాన్యాలు భారీ ఛార్జీలు వసూలు చేసి ప్రతాపం చూపాయి. -
విద్యుత్తు కార్యాలయ ముట్టడి
[ 15-05-2024]
విద్యుత్తు సమస్య పరిష్కరించమని కోరితే కులం పేరుతో దూషించిన ఏఈ కుంచాల కోటయ్యపై చర్యలు చేపట్టాలని కొండపి ఎస్సీ కాలనీవాసులు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు మంగళవారం వారు స్థానిక విద్యుత్తు కార్యాలయాన్ని ముట్టడించారు. -
చారిత్రక వాగునూ మింగేశారు!
[ 15-05-2024]
వైకాపా నేతల కన్ను పడితే వాగులు, వంకలు క్షణాల్లో మటుమాయమవుతున్నాయి. వందలాదిమంది రైతన్నలకు ఉపయోగపడే వాటిని ఆక్రమించి ప్లాట్లుగా వేస్తున్నా యంత్రాంగంలో స్పందన కొరవడుతోంది. ప్రస్తుతం కనిగిరి చుట్టుపక్కల జాతీయ రహదారులు, రైల్వేలైన్లు, ఇతర పరిశ్రమల నిర్మాణం ఊపందుకోవడంతో అక్కడి భూముల రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. -
మధ్యవర్తిత్వంతో వివాదాల పరిష్కారం
[ 15-05-2024]
వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వం మంచి విధానమని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె. శ్యాంబాబు అన్నారు. మంగళవారం ఒంగోలు బార్ అసోసియేషన్ కార్యాలయంలో మధ్యవర్తిత్వ అంశంపై అవగాహనా సదస్సు నిర్వహించారు. -
తెదేపా నాయకులపై కేసులు
[ 15-05-2024]
దాడులకు పాల్పడిన వైకాపా శ్రేణులను వదిలేసి, బాధితులపై, వారి పక్షాన నిలిచిన తెదేపా నేతలపైనే పోలీసులు కేసులు నమోదు చేశారు. వివరాల్లోకెళితే.. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా సోమవారం దర్శి మండలంలో దాడులు, ఇతర చర్యలకు సంబంధించి పోలీసులు మంగళవారం మూడు కేసులు నమోదు చేశారు. -
ఈవీఎంల తరలింపు
[ 15-05-2024]
మార్కాపురం నియోజకవర్గంలో ఈనెల 13వ తేదిన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఓటర్లు వేసిన ఓట్ల ఈవీఎంలు, వీవీ ప్యాడ్లను అధికారులు మార్కాపురం, పొదిలి అర్బన్ ప్రాంతాలు, మార్కాపురం, పొదిలి, కొనకనమిట్ల, తర్లుపాడు మండలాల నుంచి మంగళవారం తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో స్థానిక ఏస్వీకేపీ డిగ్రీ కళాశాల వద్దకు తరలించారు. -
ఓటు వేశాం.. ఇక బయలుదేరుతాం..
[ 15-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు వివిధ పట్టణాల నుంచి వచ్చిన ఓటర్లు తిరుగు ప్రయాణమయ్యారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎన్నికల్లో వలస ఓటర్లు భారీ స్థాయిలో ఓటు వేశారు. -
రేషన్ బండి.. ఇంటింటికీ రాదండి
[ 15-05-2024]
గడప వద్దకే రేషన్ అందిస్తామన్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి హామీ ఈ అయిదేళ్లలో మాటల్లో తప్పితే క్షేత్రస్థాయిలో ఎక్కడా కనిపించడం లేదు. వాహనం ఏ రోజు ఏ సమయానికి వస్తుందో తెలియక లభ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
‘ఓడిపోతున్నామన్న అక్కసుతోనే వైకాపా దాడులు’
[ 15-05-2024]
తమ పార్టీ పరాజయం పాలవుతోందన్న అక్కసుతోనే వైకాపా నాయకులు దాడులు చేస్తున్నారని తెదేపా అభ్యర్థి గూడూరి ఎరిక్షన్బాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం వాదంపల్లెలో జరిగిన రాళ్ల దాడిలో గాయపడి స్థానిక వైద్యశాలలో చికిత్స పొందుతున్న తెదేపా కార్యకర్తలను ఆయన పరామర్శించారు. -
సెక్టార్ అధికారులకు అందని నగదు
[ 15-05-2024]
గిద్దలూరు నియోజకవర్గంలో ఎన్నికల విధుల్లో గతేడాది డిసెంబరు నెల నుంచి 43 మంది సెక్టారు అధికారులను నియమించుకున్నారు. నేటికీ వారికి ఎన్నికల విధులకు సంబంధించిన నగదు ఒక్క పైసా కూడా అందించలేదు.
తాజా వార్తలు (Latest News)
-
నిశిరాత్రిలో ఘోరం.. అయిదుగురి సజీవదహనం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (15/05/24)
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
-
అమెరికాలో చైనా ‘సైన్యం’.. ట్రంప్ ప్రచారంపై రచ్చ!
-
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
-
బికినీలో అనన్య పాండే.. కాబోయే భర్తతో వరలక్ష్మి ఫొటో