logo

వైకాపాకు ఓట్లేయాలని చర్చిలో ప్రసంగం

ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలనే లక్ష్యంతో వైకాపా నాయకులు ఎన్ని అడ్డదారులైనా తొక్కడానికి వెనుకాడడం లేదు. కొండపి మండలంలో ఆదివారం రాత్రి జరిగిన సంఘటనే ఇందుకు నిదర్శనం.

Published : 29 Apr 2024 02:52 IST

కొండపిలోని చర్చిలో మాట్లాడుతున్న  వైకాపా నాయకుడు వెంకటేశ్వర్లు

ఈనాడు, ఒంగోలు: ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలనే లక్ష్యంతో వైకాపా నాయకులు ఎన్ని అడ్డదారులైనా తొక్కడానికి వెనుకాడడం లేదు. కొండపి మండలంలో ఆదివారం రాత్రి జరిగిన సంఘటనే ఇందుకు నిదర్శనం. మండలంలోని గోగినేనివారిపాలేనికి చెందిన చింతల ఎక్స్‌పోర్ట్స్‌ అధినేత, వైకాపా నాయకుడు చింతల వెంకటేశ్వర్లు తమ పార్టీని గెలిపించాలంటూ చర్చిలోనే ఏకంగా ఎన్నికల ప్రసంగం చేశారు. కొండపి బీసీ కాలనీతోపాటు మండలంలోని గోగినేనివారిపాలెం, కోయవారిపాలెంలలోని చర్చిల్లో ప్రార్థనలు ఏర్పాటు చేశారు. చీరలు పంపిణీ చేస్తామని చెప్పడంతో పలువురు మహిళలు హాజరయ్యారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. భాజపాకు, దానికి మద్దతిస్తున్న తెదేపా, జనసేన పార్టీలను ఎన్నికల్లో ఓడించాలన్నారు. వైకాపా అభ్యర్థి ఆదిమూలపు సురేష్‌ను గెలిపించాలని కోరారు. అక్కడితో ఆగకుండా క్రైస్తవులతో వైకాపాకు ఓట్లు వేయిస్తే పాస్టర్లకు భారీ తాయిలాలు అందజేస్తామని కూడా చెప్పడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని