logo

వైకాపా పాలనలో దోచుకోవడానికే ప్రాధాన్యం: ఎంపీ

అయిదేళ్ల పాటు రాష్ట్రాన్ని దోపిడీ చేసి స్వార్థం కోసం పాలన సాగించిన ముఖ్యమంత్రి జగన్‌ అని ఎంపీ కె.రామ్మోహన్‌నాయుడు ఆరోపించారు. తెదేపా ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మడపాం గ్రామం నుంచి మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తితో కలిసి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.

Updated : 22 Mar 2024 05:58 IST

మాట్లాడుతున్న ఎంపీ రామ్మోహన్‌నాయుడు, నరసన్నపేట తెదేపా అభ్యర్థి బగ్గు రమణమూర్తి

నరసన్నపేట, న్యూస్‌టుడే: అయిదేళ్ల పాటు రాష్ట్రాన్ని దోపిడీ చేసి స్వార్థం కోసం పాలన సాగించిన ముఖ్యమంత్రి జగన్‌ అని ఎంపీ కె.రామ్మోహన్‌నాయుడు ఆరోపించారు. తెదేపా ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మడపాం గ్రామం నుంచి మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తితో కలిసి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మడపాం వద్ద జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ వైకాపా అయిదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని దోచుకోవడానికే ప్రాధాన్యమిచ్చారని, ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన జగన్‌ను ఈ ఎన్నికల్లో సాగనంపాలని అన్నారు. తనపై ఉన్న కేసుల మాఫీ కోసమే అధికారాన్ని వినియోగించుకున్నట్లు విమర్శించారు. అయిదేళ్ల పదవీ కాలంలో ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా సాఫీగా అమలు చేయలేదన్నారు. తమ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమ పథకాలన్నీ అందజేస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో సమస్యలను వైకాపా ఎమ్మెల్యే పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు. మడపాం ఎత్తిపోతల పథకాన్ని తమ ప్రభుత్వం మంజూరు చేసిందని, దాన్ని అడ్డుకున్న ఘనత వైకాపా నాయకులదేనని ఆరోపించారు. కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ కన్వీనర్‌ బలగ ప్రవీణ్‌, తదితరులు పాల్గొన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని