మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ ముఖ్యం
మానసిక ఆరోగ్యంపై విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యక్రమం ఐఐటీఎంలో బుధవారం జరిగింది. ‘నేషనల్ హెల్త్ మిషన్’ (ఎన్హెచ్ఎం), రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటైంది.
వడపళని, న్యూస్టుడే: మానసిక ఆరోగ్యంపై విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యక్రమం ఐఐటీఎంలో బుధవారం జరిగింది. ‘నేషనల్ హెల్త్ మిషన్’ (ఎన్హెచ్ఎం), రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటైంది. ఒత్తిడి ఎక్కువైనప్పుడు ఎలా తగ్గించుకోవాలనే దానిపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టరు శిల్పా ప్రభాకర్ సతీష్ మాట్లాడుతూ మానసిక ఆరోగ్యంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వ సేవలను కొనియాడారు. పాఠశాల, కళాశాల విద్యార్థులకు కూడా అవగాహన కల్పిస్తున్నారని పేర్కొన్నారు. గత ఏడాది అక్టోబరులో ప్రారంభమైన ‘నట్పుడన్ ఉంగలోడు-మననల సేవ’, ‘టెలె మానస్’ సేవల గురించి వివరించారు. ప్రభుత్వం ప్రారంభించిన ‘మన నల నల్లాత్తరవు మండ్రం’ (మనమ్) కార్యక్రమం విద్యార్థులలో మార్పునకు ప్రయత్నాలు చేస్తోందన్నారు. నీట్ రాసేవారికి ఒత్తిడి తగ్గిస్తోందని చెప్పారు. ఐఐటీ కూడా ‘ఎంఐటీఆర్’ పేరుతో విద్యార్థులకు మంచి ధైర్యాన్ని కల్పించింది. ఐఐటీ విద్యార్థులకు టెలె మనస్ (14416) టోల్ ఫ్రీ నెంబరు ద్వారా 24 గంటలూ కౌన్సెలింగ్ ఇస్తోంది. ‘ఫెలోషిప్ కోర్సు’ ద్వారా కూడా ఈ వసతి కల్పిస్తోంది. ఐఐటీ డైరెక్టర్ వి.కామకోటి మాట్లాడుతూ విద్యార్థులలో ఒత్తిడి తగ్గించి, మానసికంగా ధైర్యంగా ఉండేందుకు తమ విద్యా సంస్థ పలు రకాలైన చర్యలు చేపడుతోందన్నారు. ఈ సందర్భంగా behappy.iitm.ac.in వెబ్సైట్ను ఆయన ప్రారంభించారు. మద్రాస్ మెడికల్ కళాశాల డాక్టర్ ఎం.మలైయప్పన్ ‘యాన్ ఇంట్రోడక్షన్ టు పాజిటివ్ మెంటల్ హెల్త్’, ‘ఎర్లీ ఐడెంటిఫికేషన్్ ఆఫ్ డిప్రెషన్’పై మద్రాస్ మెడికల్ కళాశాల డాక్టర్ ఎంఎస్ జగదీశన్ ప్రసంగించారు. డాక్టర్ ఆర్.కార్తీక్ దైవనారాయణన్, డాక్టర్ వి.దివ్య మానసిక ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చిత్తడి నేలలపై అంతులేని నిర్లక్ష్యం
[ 03-05-2024]
భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమవుతున్న నగరాలు, ప్రాంతాలు రాష్ట్రంలో ఎక్కువే. వాటినుంచి కాపాడే సత్తా ఉన్న చిత్తడినేలలు మాత్రం నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. ఫలితంగా కొన్ని అన్యాక్రాంతమవడంతో పాటు ఆక్రమణలకు గురవుతున్నాయి. -
ఆలయ ఉత్సవాల్లో ఘర్షణ
[ 03-05-2024]
ఆలయ ఉత్సవాల్లో ఒక వర్గం వారు ప్రార్థన చేయడానికి నిరాకరించడంతో ఏర్పడిన ఘర్షణ భారీ విధ్వంసానికి దారి తీసింది. పోలీసుల కథనం మేరకు.. జిల్లాలోని ఓమలూరు సమీపం తీవట్టిపట్టి వద్ద హిందూ దేవాదాయ శాఖ -
డ్రైవరు రహిత రైళ్లలో అధునాతన వసతులు
[ 03-05-2024]
మెట్రో రెండో దశ మార్గంలో రానున్న డ్రైవరు రహిత రైళ్లలో అధునాతన వసతులు సమకూరనున్నాయి. బోగీల్లో ఆనుకుని కూర్చునేందుకు వీలుగా సీట్లు, డ్రైవర్ల వీక్షణ (డ్రైవర్స్ వ్యూ), సెల్ఫోన్లకు ఛార్జింగు వంటి పలు సదుపాయాలతో బోగీ నిర్మాణం జరగనుంది. -
నేపథ్య గాయని ఉమా రమణన్ కన్నుమూత
[ 03-05-2024]
నేపథ్య గాయని ఉమా రమణన్(71) ఆరోగ్య సమస్యలతో కన్నుమూశారు. కొద్ది నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చెన్నై అడయారులోని నివాసంలో బుధవారం రాత్రి 7.45 గంటలకు తుదిశ్వాస విడిచినట్టు ఆమె భర్త రమణన్ వెల్లడించారు. -
కర్ణాటక కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోరాటం
[ 03-05-2024]
కావేరి జలాల వ్యవహారంలో కర్ణాటక కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధమని టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుంతగై తెలిపారు. తేనాంపేటలోని కామరాజర్ ఆడిటోరియంలో గురువారం విలేకర్లతో మాట్లాడారు. -
దుర్గాస్టాలిన్ బోటు షికారు
[ 03-05-2024]
ముఖ్యమంత్రి స్టాలిన్ కుటుంబంతో పాటు కొడైకెనాల్లో విశ్రాంతి తీసుకునేందుకు వెళ్లారు. బుధవారం సాయంత్రం కొడైకెనాల్ చెరువులో స్టాలిన్ సతీమణి దుర్గాస్టాలిన్ పడవ సవారీ చేశారు. -
సర్పాలతో జాగ్రత్త!
[ 03-05-2024]
వేసవి ఎండలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో సర్పాలు ఖాళీ స్థలాలు, గృహాలలోకి చొరబడే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అటవీశాఖ సూచిస్తోంది. -
దాహార్తి తీరుస్తున్న నెమ్మెలి నిర్లవణీకరణ పథకం
[ 03-05-2024]
రాష్ట్ర రాజధాని తాగునీటి అవసరాలు తీర్చేందుకు పూండి, పుళల్, చెంబరంబాక్కం, చోళవరం, వీరాణం చెరువు నుంచి దక్షిణ చెన్నై ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. -
స్వీయ కాన్పుతో బిడ్డను చంపుకొన్న నర్సుపై హత్యయత్నం కేసు
[ 03-05-2024]
సన్నిహితుడి ద్వారా గర్భవతి అయిన ఓ నర్సు స్వీయ కాన్పునకు యత్నించి బిడ్డను చంపిన ఘటనలో నగర పోలీసులు ఆమెపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. -
అజిత్ రాజకీయాల్లోకి వస్తే స్వాగతిస్తాం : జయకుమార్
[ 03-05-2024]
నటుడు అజిత్కుమార్ రాజకీయాల్లో వస్తే స్వాగతిస్తామని అన్నాడీఎంకే మాజీ మంత్రి జయకుమార్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రభాకర్రావు కోసం పోలీసుల వేట .. అరెస్టు వారెంట్ ఇవ్వాలని కోర్టులో పిటిషన్
-
50 కోట్ల ప్రయాణికుల మైలు రాయిని దాటిన హైదరాబాద్ మెట్రో
-
వివాహిత ఇంటికి బాంబు పార్సిల్ పంపిన ప్రియుడు.. భర్త, కుమార్తె మృతి
-
పక్క వారిపై ఆ భావన ఉంటే ఈగోలు అడ్డురావు: శోభితా ధూళిపాళ్ల
-
ఆ ఒక్కడే.. ఐపీఎల్లో నన్ను భయపెట్టిన బ్యాటర్: గౌతమ్ గంభీర్
-
సునీత, వైఎస్ షర్మిల పిటిషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు