నీట్ కారణంగా 21 మంది ఆత్మహత్య
నీట్ రద్దు కానందున రాష్ట్రంలో 21 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారని రాష్ట్ర యువజన సంక్షేమం, క్రీడల అభివృద్ధి శాఖ మంత్రి ఉదయనిధి పేర్కొన్నారు.
అసెంబ్లీ తీర్మానాలపై గవర్నర్ సంతకం చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి
నీట్ రద్దు డిమాండ్ చేస్తూ ఆదివారం రాష్ట్రవ్యాప్త నిరసనలు
ప్రకటించిన మంత్రి ఉదయనిధి
విద్యార్థులకు బహుమతులు అందజేస్తున్న మంత్రి ఉదయనిది
కాంచీపురం, న్యూస్టుడే: నీట్ రద్దు కానందున రాష్ట్రంలో 21 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారని రాష్ట్ర యువజన సంక్షేమం, క్రీడల అభివృద్ధి శాఖ మంత్రి ఉదయనిధి పేర్కొన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి శత జయంత్యుత్సవాల సందర్భంగా శనివారం కాంచీపురంలోని ఓ కల్యాణ మండపంలో ఉత్తిరమేరూర్ ఎమ్మెల్యే కె.సుందర్ అధ్యక్షతన కాంచీపురం ఎమ్మెల్యే సీవీఎంపి ఎళిళరసన్ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. డీఎంకే తరఫున 538 మంది ఆటో డ్రైవర్లకు దుస్తులతో పాటు సంక్షేమ పథకాలు, కాంచీపురం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో 10 వ తరగతి, 12వ తరగతి పరీక్షల్లో అధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహక నగదు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఉదయనిధి మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని గుర్తుచేశారు. ఇంట్లో పెద్ద మహిళలకు త్వరలో రూ.1000లు అందజేసే పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని తెలిపారు. రాష్ట్రంలో నీట్ను రద్దు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చాం... కానీ నీట్ రద్దు కానందున రాష్ట్రంలో 21 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకొన్నారని తెలిపారు. అసెంబ్లీలో రెండుసార్లు నీట్ రద్దుకు తీర్మానాలు ఆమోదించి గవర్నర్కు పంపామని, కానీ గవర్నర్ సంతకం చేయడం లేదని గుర్తుచేశారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా నీట్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ డీఎంకే తరఫున ఆదివారం నిరసన కార్యక్రమాలను చేపట్టనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో అందరూ పాల్గొనాలని విజ్ఞప్తిచేశారు. కార్యక్రమంలో కాంచీపురం మేయర్ మహాలక్ష్మి యువరాజ్, జిల్లా పంచాయతీ ఛైర్మన్ పడపై మనోహరన్, వైస్ ఛైర్పర్సన్ నిత్యా సుకుమార్, పలువురు పార్టీ నిర్వాహకులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రేమికుడిపై పెట్రోలు పోసి తానూ నిప్పంటించుకున్న ప్రేయసి
[ 11-05-2024]
తన ప్రియుడు వేరొకరికి దక్కకూడదని ప్రియురాలు ఘాతుకానికి పాల్పడింది. పెట్రోల్పోసి నిప్పంటించింది. ఆమె కూడా నిప్పంటించుకోవడంతో ఇద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. -
పుష్పాలతో పరవశం
[ 11-05-2024]
నీలగిరి జిల్లా ఊటీలో 126వ పుష్ప ప్రదర్శన శుక్రవారం ప్రారంభమైంది. పుష్పాలతో అలంకరించిన ఏనుగు, ఊటీ మౌంటెయిన్ రైలు, డిస్నీ వరల్డ్, సింహంతో పాటు పలు జంతువుల కళారూపాలు సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. -
10వ తరగతిలో 91.55 శాతం ఉత్తీర్ణత
[ 11-05-2024]
రాష్ట్రంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. పరీక్షలు మార్చి 26 నుంచి ఏప్రిల్ 8వరకు జరిగాయి. మొత్తం 8,94,264 మంది రాశారు. ఫలితాలను శుక్రవారం ఉదయం ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సేతువర్మ విడుదల చేశారు. -
ఎన్నికల్లో మోదీపై పోటీకి బయల్దేరిన రైతులు
[ 11-05-2024]
రైల్వే టిక్కెట్ల రిజర్వేషన్ ఖరారైనా నిరీక్షణ జాబితాలో పెట్టారంటూ అన్నదాతలు ఆందోళనకు దిగారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా తమిళనాడుకు చెందిన దక్షిణ నదుల భద్రతా రైతుల సంఘం అధ్యక్షుడు అయ్యాకన్ను వారణాసి నియోజకవర్గంలో పోటీ చేయనున్నారు. -
నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు
[ 11-05-2024]
రాష్ట్రంలో నాలుగు రోజుల వరకు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది. శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో.. 24 గంటల్లో సాధారణం కన్నా 5 డిగ్రీల సెల్సియస్ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపింది. -
విద్యార్థులూ.. వినండి
[ 11-05-2024]
ప్లస్ టూ, 10వ తరగతిలో మార్కులు ఘనంగా వచ్చాయని సంబరపడిపోయేవారు ఒకవైపు.. సరిగా రాక కుమిలిపోయే విద్యార్థులు మరోవైపు. రాష్ట్రంలో పరిస్థితి ఇది. ఆశించిన మార్కులు రాకపోవడమో, ఫెయిల్ అయిపోవడమోలాంటి కారణాలతో క్షణికావేశ నిర్ణయాలు తీసుకుంటున్నారు. -
విమానాశ్రయంలో వాకలేటర్ సేవలు
[ 11-05-2024]
డొమెస్టిక్, ఇంటర్నేషనల్ టెర్మినళ్లను అనుసంధానం చేసేందుకు కొత్తగా వాకలేటర్తో పాటు మల్టీ లెవల్ కారు పార్కింగు సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తెచ్చేందుకు నగర విమానాశ్రయ యంత్రాంగం సిద్ధమవుతోంది. -
34 ఏళ్ల తర్వాత చేతికొచ్చిన సొంతిల్లు
[ 11-05-2024]
చెన్నై స్టాన్లీ ఆస్పత్రిలో పని చేసి పదవీవిరమణ చేసిన డీన్ విక్టర్కు షెనాయ్నగర్ ప్రాంతంలో సొంతిల్లు ఉంది. 2 గ్రౌండ్ల స్థలంలోని ఇంటిని వేరొకరిని చూసుకోమని చెప్పి 34 ఏళ్ల కిందట ఆయన అమెరికా వెళ్లి పోయాడు. -
అలవోకగా శాస్త్రీయనామాలు చెప్తున్న బాలుడు
[ 11-05-2024]
కూరగాయలు, పండ్ల శాస్త్రీయ నామాలు సెకన్లలో చెప్తూ ఓ బాలుడు అబ్బురపరుస్తున్నాడు. దిండుక్కల్ జిల్లా పళని నెయిక్కారపట్టికి చెందిన మహ్మద్ హిసామ్ ఓ ప్రైవేట్ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. -
పదో తరగతి ఫెయిల్ కావడంతో విద్యార్థిని ఆత్మహత్య
[ 11-05-2024]
పదో తరగతిలో ఫెయిలైన విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పళ్లిపట్టు తాలూకా మేల్పొదటూర్ ప్రాంతానికి చెందిన మురళి, నదియ భార్యభర్తలు. కుమారి(15) అనే కుమార్తె ఉంది.