దక్షిణాది నుంచే భాజపాకు పతనం ఆరంభం
భారతీయ జనతా పార్టీ (భాజపా)కు దక్షిణాది నుంచే పతనం ప్రారంభమైందని పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి నారాయణస్వామి ధ్వజమెత్తారు.
పుదువై మాజీ సీఎం నారాయణస్వామి
భారతీయ జనతా పార్టీ (భాజపా)కు దక్షిణాది నుంచే పతనం ప్రారంభమైందని పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి నారాయణస్వామి ధ్వజమెత్తారు. లోక్సభ ఎన్నికల్లో మొదటి విడత పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఎన్నికల క్షేత్రస్థాయి పరిస్థితులు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఆయన ఓ ఇంటర్వ్యూలో చర్చించారు.
న్యూస్టుడే, ఆర్కేనగర్
ప్రశ్న: పుదుచ్చేరి నియోజకవర్గంలో విజయమెవరిది?
జవాబు: పుదుచ్చేరిలో కాంగ్రెస్ అభ్యర్థి వైద్యలింగం విజయం ఖాయమైంది. కారణం ప్రధాని మోదీ పుదుచ్చేరికి ఇచ్చిన వాగ్దానాలేవి నేరవేర్చకపోవడమే. ప్రస్తుతం ఎన్డీయే కూటమి పాలనలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న భాజపా అభ్యర్థి నమశ్శివాయం ఏ పథకమూ పుదుచ్చేరికి తీసుకురాలేదు. కొత్త పరిశ్రమలూ రాలేదు. బార్లు మాత్రమే తెరవడంతో సారాయి నదిలా పారుతోంది. ఇక్కడే ఏమి చేయలేని ఆయన పార్లమెంట్కు వెళ్లి ఏమి చేయగలరన్న ప్రశ్న ప్రజల్లో నెలకొంది. అందువలన కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుంది.
ప్ర: వైద్యలింగం గత ఐదేళ్లలో రాష్ట్రానికేం చేశారు?
జ: రాష్ట్రంలోని పలు సమస్యల గురించి పార్లమెంట్లో ప్రశ్నించి మంచి పరిష్కారం పొందారు. రహదారుల పథకాలు, రైల్వే పనులు, కొత్త రైళ్లు ఇలా చాలా ప్రాజెక్టులు రాష్ట్రానికి తీసుకొచ్చారు. ఇప్పటికే ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిగా, మంత్రిగా పలు పదవుల్లో ప్రజల కోసం పనిచేశారు.
ప్ర: తమిళనాడు ఎన్నికల ఫలితాలు ఎలా ఉండనున్నాయి?
జ: ఇది ఇప్పటికే రాసి ఉంచిన తీర్పు. 39 నియోజకవర్గాలలో ఇండియా కూటమే గెలుస్తుంది. అందుకు కారణం కేంద్రంలోని భాజపా ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తి. వరదల కారణంగా అల్లాడిపోయిన తమిళనాడుకు నిధులు ఇవ్వని మోదీ ప్రభుత్వంపై తమిళనాడు ప్రజలు కోపంతో ఉన్నారు. తమిళనాడు నుంచి పన్ను వసూలు చేస్తూ అందులో నుంచి 29 పైసలు మాత్రమే తిరిగి ఇస్తుంది. సామాజిక న్యాయానికి వ్యతిరేకమైనది భాజపా. తమిళనాడుకు రూ.10 వేల కోట్లు ఇచ్చినట్లు తప్పుడు సమాచారం ఇస్తున్నారు. గవర్నర్గా ఒకరిని నియమించి వారిచే ప్రభుత్వ పనులకు అడ్డంకులు కలిగించేలా చేస్తున్నారు. వీటన్నింటిని ప్రజలు మనసులో పెట్టుకొని డీఎంకే కూటమికి ఓటు వేశారు.
ప్ర: భాజపాకు 400 స్థానాలు వస్తాయంటారా?
జ: 2019లో మోదీ అధిక ప్రజాదరణ కలిగినవారుగా ఉన్నప్పుడే భాజపా 303 స్థానాలను దాటలేకపోయింది. నేడు మోదీకి ఆదరణ తగ్గింది. ధరలు పెరిగాయి. వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనిని సరిచేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దేశాన్ని 2047 నాటికి అభివృద్ధి బాటలో నడిపిస్తానని మోదీ అంటున్నారు. కానీ అవన్ని చూడడానికి దేశ ప్రజలు ఉండనవసరం లేదా?. ఈ 10ఏళ్లలో రూ.155 వేల కోట్లు విదేశాల్లో రుణం తీసుకున్నారు. కాంగ్రెస్ 60ఏళ్ల పాలనలో రూ.55 వేల కోట్లు మాత్రమే అప్పు తీసుకుంది. ఒక అబద్ధాన్ని 10సార్లు తిప్పితిప్పి చెబితే ప్రజలు నమ్ముతారనే 400 స్థానాలను చేజిక్కించుకుంటామని భాజపా చెప్పుకుంటోంది.
ప్ర: ఇండియా కూటమికి ఎన్ని స్థానాలు రావచ్చు?
జ: నేను సంఖ్య రూపంలో చెప్పడం ఇష్టపడటం లేదు. కానీ ఇండియా కూటమే అధికారంలోకి వస్తుంది. గత మూడు నెలల్లో అందుకుగాను అతిపెద్ద మార్పు ప్రజల్లో మొదలైంది.
ప్ర: ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ప్రధాని ఎవరు?
జ: ఆ సమయంలో కూటమి పార్టీల నేతలు చర్చించి నిర్ణయిస్తారు. కానీ అదే సమయంలో ఒక కాంగ్రెస్ నేతగా నాకు రాహుల్గాంధీ ప్రధాని అవ్వాలనే ఆశగా ఉంది. భారత్లోని ప్రతి కాంగ్రెస్ నేతకు ఉన్న కోరిక ఇదే.
ప్ర: గతసారి, ఈ ఎన్నికల్లో ఎందుకు పోటీచేయలేదు?
జ: ఎన్నికల్లో గతసారి నిలబడిన వైద్యలింగానికే ఈసారి కూడా అవకాశం ఇద్దామని అధిష్ఠానం నిర్ణయించింది. అందువలనే నేను పోటీ చేయలేదు. అవకాశం వస్తే ఎన్నికల్లో పోటీ చేస్తా. రాజకీయాల నుంచి, ప్రజలను వదిలేసి ఎప్పుడు వైదొలగబోను.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చిత్తడి నేలలపై అంతులేని నిర్లక్ష్యం
[ 03-05-2024]
భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమవుతున్న నగరాలు, ప్రాంతాలు రాష్ట్రంలో ఎక్కువే. వాటినుంచి కాపాడే సత్తా ఉన్న చిత్తడినేలలు మాత్రం నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. ఫలితంగా కొన్ని అన్యాక్రాంతమవడంతో పాటు ఆక్రమణలకు గురవుతున్నాయి. -
ఆలయ ఉత్సవాల్లో ఘర్షణ
[ 03-05-2024]
ఆలయ ఉత్సవాల్లో ఒక వర్గం వారు ప్రార్థన చేయడానికి నిరాకరించడంతో ఏర్పడిన ఘర్షణ భారీ విధ్వంసానికి దారి తీసింది. పోలీసుల కథనం మేరకు.. జిల్లాలోని ఓమలూరు సమీపం తీవట్టిపట్టి వద్ద హిందూ దేవాదాయ శాఖ -
డ్రైవరు రహిత రైళ్లలో అధునాతన వసతులు
[ 03-05-2024]
మెట్రో రెండో దశ మార్గంలో రానున్న డ్రైవరు రహిత రైళ్లలో అధునాతన వసతులు సమకూరనున్నాయి. బోగీల్లో ఆనుకుని కూర్చునేందుకు వీలుగా సీట్లు, డ్రైవర్ల వీక్షణ (డ్రైవర్స్ వ్యూ), సెల్ఫోన్లకు ఛార్జింగు వంటి పలు సదుపాయాలతో బోగీ నిర్మాణం జరగనుంది. -
నేపథ్య గాయని ఉమా రమణన్ కన్నుమూత
[ 03-05-2024]
నేపథ్య గాయని ఉమా రమణన్(71) ఆరోగ్య సమస్యలతో కన్నుమూశారు. కొద్ది నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చెన్నై అడయారులోని నివాసంలో బుధవారం రాత్రి 7.45 గంటలకు తుదిశ్వాస విడిచినట్టు ఆమె భర్త రమణన్ వెల్లడించారు. -
కర్ణాటక కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోరాటం
[ 03-05-2024]
కావేరి జలాల వ్యవహారంలో కర్ణాటక కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధమని టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుంతగై తెలిపారు. తేనాంపేటలోని కామరాజర్ ఆడిటోరియంలో గురువారం విలేకర్లతో మాట్లాడారు. -
దుర్గాస్టాలిన్ బోటు షికారు
[ 03-05-2024]
ముఖ్యమంత్రి స్టాలిన్ కుటుంబంతో పాటు కొడైకెనాల్లో విశ్రాంతి తీసుకునేందుకు వెళ్లారు. బుధవారం సాయంత్రం కొడైకెనాల్ చెరువులో స్టాలిన్ సతీమణి దుర్గాస్టాలిన్ పడవ సవారీ చేశారు. -
సర్పాలతో జాగ్రత్త!
[ 03-05-2024]
వేసవి ఎండలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో సర్పాలు ఖాళీ స్థలాలు, గృహాలలోకి చొరబడే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అటవీశాఖ సూచిస్తోంది. -
దాహార్తి తీరుస్తున్న నెమ్మెలి నిర్లవణీకరణ పథకం
[ 03-05-2024]
రాష్ట్ర రాజధాని తాగునీటి అవసరాలు తీర్చేందుకు పూండి, పుళల్, చెంబరంబాక్కం, చోళవరం, వీరాణం చెరువు నుంచి దక్షిణ చెన్నై ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. -
స్వీయ కాన్పుతో బిడ్డను చంపుకొన్న నర్సుపై హత్యయత్నం కేసు
[ 03-05-2024]
సన్నిహితుడి ద్వారా గర్భవతి అయిన ఓ నర్సు స్వీయ కాన్పునకు యత్నించి బిడ్డను చంపిన ఘటనలో నగర పోలీసులు ఆమెపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. -
అజిత్ రాజకీయాల్లోకి వస్తే స్వాగతిస్తాం : జయకుమార్
[ 03-05-2024]
నటుడు అజిత్కుమార్ రాజకీయాల్లో వస్తే స్వాగతిస్తామని అన్నాడీఎంకే మాజీ మంత్రి జయకుమార్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు
-
ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్.. ప్రభుత్వ అప్లికేషన్లకు ఇకపై లేబుల్స్
-
ఉగ్రదాడులకు కుట్ర.. ఉక్రెయిన్ ‘ఏజెంట్’ను చంపిన రష్యా
-
శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
-
ఓటీటీలోకి వచ్చేసిన త్రిగుణ్ ‘లైన్ మ్యాన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఎన్నికల నేపథ్యంలో.. కేజ్రీవాల్కు బెయిల్ అంశాన్ని పరిశీలిస్తాం - సుప్రీంకోర్టు