వర్షపాతం పెరిగినా భూమిలో నీరేది!
ఈ ఏడాది రాష్ట్రంలో వర్షపాతం పెరిగినా భూమిలో నీరు మాత్రం అప్పుడే అడుగంటింది. చెన్నైలో రుతుపవనాల వర్షాల తర్వాత జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో భూగర్భ జలాలు 8 అడుగుల మేర తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
మార్చి నెలలో అడుగంటిన భూగర్భ జలాలు
పలు కారణాలతో మట్టిలో ఇంకని నీరు
న్యూస్టుడే, విల్లివాక్కం: ఈ ఏడాది రాష్ట్రంలో వర్షపాతం పెరిగినా భూమిలో నీరు మాత్రం అప్పుడే అడుగంటింది. చెన్నైలో రుతుపవనాల వర్షాల తర్వాత జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో భూగర్భ జలాలు 8 అడుగుల మేర తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2022, 2023లో మార్చి నెలతో పోలిస్తే 2024 మార్చిలో భూగర్భ నీటిమట్టం చాలా వరకు తగ్గింది. అయినా చెరువులలో అవసరం మేరకు నీరు నిల్వ ఉన్నందున చెన్నై తాగునీటి అవసరాలు పూర్తి చేయనున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు.
పెరిగిన వినియోగం
రకరకాల కారణాలు, అవసరాలకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి చెన్నైకి వచ్చి నివసించే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుండటంతో తాగునీటి అవసరం కూడా పెరిగింది. రోజుకు 85 లక్షలకు పైగా కుటుంబాలకు 100 కోట్ల లీటర్ల తాగునీరు సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం వేసవి కావడంతో 106-107 కోట్ల లీటర్ల వరకు పంపిణీ చేస్తున్నారు. ఇందులో 104 కోట్ల లీటర్లు 5,500 కిలోమీటర్ల దూరం పైపుల ద్వారా, 3 కోట్ల లీటర్లు ట్యాంకరు లారీల ద్వారా సరఫరా చేస్తున్నారు. ఈ నీటిని 5 చెరువులు, నిర్లవణీకరణ కేంద్రాల నుంచి పొందుతున్నారు. చెరువుల నుంచి 81.80 కోట్ల లీటర్లు, బావుల ద్వారా 2 కోట్ల లీటర్లు, మీంజూర్, నెమ్మేలి నిర్లవణీకరణ ప్లాంట్ల ద్వారా 23.3 కోట్ల లీటర్లు సేకరించి ఉపయోగిస్తున్నారు. మహానగరం విస్తరించిన ప్రాంతాల్లో తాగునీటి పథకం పూర్తి స్థాయిలో లేని కారణంగా ఎక్కువగా భూగర్భ జలాలను తోడేస్తున్నారు.
సరిగాలేని నీటి నిల్వ వ్యవస్థ
జలవనరుల ఆక్రమణ, వర్షపునీటి సేకరణలో దూరదృష్టి లేమి, నీటినిల్వ వ్యవస్థను సక్రమంగా పరిరక్షించకపోవడం తదితర కారణాల వలన వర్షపునీరు భూమిలో ఎక్కువగా ఇంకడం లేదు. చెన్నై కార్పొరేషన్ పరిధిలో ఇసుక, బంకమట్టి, రాళ్లతో కూడిన మూడంచెలతో కూడిన స్థల విస్తీర్ణం, భూగర్భ జలాలను లెక్కగట్టడానికి 200 వార్డులలో కొలమానాలు ఏర్పాటు చేశారు. ప్రతి నెలా భూగర్భ జలమట్టాన్ని కొలుస్తున్నారు. 2021 కన్నా 2022లో 25 శాతం వర్షపాతం తగ్గింది. గతేడాది జూన్లో బాగానే వర్షం కురిసింది. 2022లో నైరుతి రుతుపవనాల వర్షం 44 సెం.మీ, 2023లో 78 సెం.మీ వర్షం పడింది. అదేవిధంగా ఈశాన్య రుతువపనాల వర్షం 2022లో 92 సెం.మీ, 2023లో 18 సెం.మీ వర్షం అదనంగా కురిసింది. గతేడాది జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలను పోలిస్తే ఈ ఏడాది ఈ మూడు నెలలు భూగర్భ జలమట్టం తగ్గింది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలకన్నా మార్చిలో మాధవరం జోన్లో నీటిమట్టం 8 అడుగుల వరకు తగ్గింది. ఇతర జోన్లలో 1-2 అడుగుల వరకు తగ్గింది. కాగా, గతేడాది మార్చి నెలకన్నా ఈ ఏడాది మార్చిలో 2-4 అడుగుల వరకు తగ్గుముఖం పట్టింది. 2022 కన్నా గతేడాది వర్షపాతం అధికంగా నమోదైనా భూమిలో నీరు ఆశించిన మేరకు నిలవలేదు. అందువల్ల వచ్చే నెలలో నీటి అవసం పెరుగుతందని జలమండలి అధికారులు తెలిపారు. అదే సమయంలో వర్షపునీరు భూమి లోపలికి ఇంకే విధంగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి పరచాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చిత్తడి నేలలపై అంతులేని నిర్లక్ష్యం
[ 03-05-2024]
భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమవుతున్న నగరాలు, ప్రాంతాలు రాష్ట్రంలో ఎక్కువే. వాటినుంచి కాపాడే సత్తా ఉన్న చిత్తడినేలలు మాత్రం నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. ఫలితంగా కొన్ని అన్యాక్రాంతమవడంతో పాటు ఆక్రమణలకు గురవుతున్నాయి. -
ఆలయ ఉత్సవాల్లో ఘర్షణ
[ 03-05-2024]
ఆలయ ఉత్సవాల్లో ఒక వర్గం వారు ప్రార్థన చేయడానికి నిరాకరించడంతో ఏర్పడిన ఘర్షణ భారీ విధ్వంసానికి దారి తీసింది. పోలీసుల కథనం మేరకు.. జిల్లాలోని ఓమలూరు సమీపం తీవట్టిపట్టి వద్ద హిందూ దేవాదాయ శాఖ -
డ్రైవరు రహిత రైళ్లలో అధునాతన వసతులు
[ 03-05-2024]
మెట్రో రెండో దశ మార్గంలో రానున్న డ్రైవరు రహిత రైళ్లలో అధునాతన వసతులు సమకూరనున్నాయి. బోగీల్లో ఆనుకుని కూర్చునేందుకు వీలుగా సీట్లు, డ్రైవర్ల వీక్షణ (డ్రైవర్స్ వ్యూ), సెల్ఫోన్లకు ఛార్జింగు వంటి పలు సదుపాయాలతో బోగీ నిర్మాణం జరగనుంది. -
నేపథ్య గాయని ఉమా రమణన్ కన్నుమూత
[ 03-05-2024]
నేపథ్య గాయని ఉమా రమణన్(71) ఆరోగ్య సమస్యలతో కన్నుమూశారు. కొద్ది నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చెన్నై అడయారులోని నివాసంలో బుధవారం రాత్రి 7.45 గంటలకు తుదిశ్వాస విడిచినట్టు ఆమె భర్త రమణన్ వెల్లడించారు. -
కర్ణాటక కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోరాటం
[ 03-05-2024]
కావేరి జలాల వ్యవహారంలో కర్ణాటక కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధమని టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుంతగై తెలిపారు. తేనాంపేటలోని కామరాజర్ ఆడిటోరియంలో గురువారం విలేకర్లతో మాట్లాడారు. -
దుర్గాస్టాలిన్ బోటు షికారు
[ 03-05-2024]
ముఖ్యమంత్రి స్టాలిన్ కుటుంబంతో పాటు కొడైకెనాల్లో విశ్రాంతి తీసుకునేందుకు వెళ్లారు. బుధవారం సాయంత్రం కొడైకెనాల్ చెరువులో స్టాలిన్ సతీమణి దుర్గాస్టాలిన్ పడవ సవారీ చేశారు. -
సర్పాలతో జాగ్రత్త!
[ 03-05-2024]
వేసవి ఎండలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో సర్పాలు ఖాళీ స్థలాలు, గృహాలలోకి చొరబడే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అటవీశాఖ సూచిస్తోంది. -
దాహార్తి తీరుస్తున్న నెమ్మెలి నిర్లవణీకరణ పథకం
[ 03-05-2024]
రాష్ట్ర రాజధాని తాగునీటి అవసరాలు తీర్చేందుకు పూండి, పుళల్, చెంబరంబాక్కం, చోళవరం, వీరాణం చెరువు నుంచి దక్షిణ చెన్నై ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. -
స్వీయ కాన్పుతో బిడ్డను చంపుకొన్న నర్సుపై హత్యయత్నం కేసు
[ 03-05-2024]
సన్నిహితుడి ద్వారా గర్భవతి అయిన ఓ నర్సు స్వీయ కాన్పునకు యత్నించి బిడ్డను చంపిన ఘటనలో నగర పోలీసులు ఆమెపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. -
అజిత్ రాజకీయాల్లోకి వస్తే స్వాగతిస్తాం : జయకుమార్
[ 03-05-2024]
నటుడు అజిత్కుమార్ రాజకీయాల్లో వస్తే స్వాగతిస్తామని అన్నాడీఎంకే మాజీ మంత్రి జయకుమార్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు
-
ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్.. ప్రభుత్వ అప్లికేషన్లకు ఇకపై లేబుల్స్
-
ఉగ్రదాడులకు కుట్ర.. ఉక్రెయిన్ ‘ఏజెంట్’ను చంపిన రష్యా
-
శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
-
ఓటీటీలోకి వచ్చేసిన త్రిగుణ్ ‘లైన్ మ్యాన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఎన్నికల నేపథ్యంలో.. కేజ్రీవాల్కు బెయిల్ అంశాన్ని పరిశీలిస్తాం - సుప్రీంకోర్టు