స్పీడ్ పోస్ట్ ద్వారా 2.5 లక్షల ఎల్ఎల్ఆర్లు
‘లెర్నర్స్ లైసెన్స్’ (ఎల్ఎల్ఆర్), వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను స్పీడ్ పోస్టు ద్వారా పంపడంలో విజయం సాధించినట్టు ‘ట్రాన్స్పోర్ట్ అండ్ రోడ్ సేఫ్టీ’ విభాగం పేర్కొంది.
వడపళని, న్యూస్టుడే: ‘లెర్నర్స్ లైసెన్స్’ (ఎల్ఎల్ఆర్), వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను స్పీడ్ పోస్టు ద్వారా పంపడంలో విజయం సాధించినట్టు ‘ట్రాన్స్పోర్ట్ అండ్ రోడ్ సేఫ్టీ’ విభాగం పేర్కొంది. ప్రాంతీయ రవాణా కార్యాలయం (ఆర్టీఓ)కు లైసెన్సులు, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల కోసం నిత్యం అధిక సంఖ్యలో ప్రజలు వస్తుండటంతో కొత్త విధానంపై రవాణా శాఖ దృష్టి సారించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభించిన స్పీడ్ పోస్టు ద్వారా 2.5 లక్షల ఎల్ఎల్ఆర్లు, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను పంపామని రాష్ట్ర రవాణా, రోడ్డు భద్రతా కమిషనరేట్ సీనియర్ అధికారి ఒకరన్నారు. తపాలా శాఖతో గత ఏడాది ప్రాంతీయ రవాణా కార్యాలయాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. రాష్ట్రంలో 91 ఆర్టీఓ కార్యాలయాలు, 45 మోటారు వెహికల్ ఇన్స్పెక్టరు కార్యాలయాలున్నాయి. ఎల్ఎల్ఆర్లు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను త్వరితగతిన అందజేసేందుకు కమిషనరేట్ వివిధ రకాల చర్యలు చేపడుతోంది. లైసెన్సు కోసం కార్యాలయాలకు రాకుండా వారిళ్లవద్దకే చేర్చాలనేది పథకం లక్ష్యం. మార్చిలో 2,51,501 ఎల్ఎల్ఆర్, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు పంపగా 2,48,986 మందికి వారి చిరునామాకు సక్రమంగా చేరాయి. 2,500 మంది తమకు అందలేదని ఫిర్యాదులు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రేమికుడిపై పెట్రోలు పోసి తానూ నిప్పంటించుకున్న ప్రేయసి
[ 11-05-2024]
తన ప్రియుడు వేరొకరికి దక్కకూడదని ప్రియురాలు ఘాతుకానికి పాల్పడింది. పెట్రోల్పోసి నిప్పంటించింది. ఆమె కూడా నిప్పంటించుకోవడంతో ఇద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. -
పుష్పాలతో పరవశం
[ 11-05-2024]
నీలగిరి జిల్లా ఊటీలో 126వ పుష్ప ప్రదర్శన శుక్రవారం ప్రారంభమైంది. పుష్పాలతో అలంకరించిన ఏనుగు, ఊటీ మౌంటెయిన్ రైలు, డిస్నీ వరల్డ్, సింహంతో పాటు పలు జంతువుల కళారూపాలు సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. -
10వ తరగతిలో 91.55 శాతం ఉత్తీర్ణత
[ 11-05-2024]
రాష్ట్రంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. పరీక్షలు మార్చి 26 నుంచి ఏప్రిల్ 8వరకు జరిగాయి. మొత్తం 8,94,264 మంది రాశారు. ఫలితాలను శుక్రవారం ఉదయం ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సేతువర్మ విడుదల చేశారు. -
ఎన్నికల్లో మోదీపై పోటీకి బయల్దేరిన రైతులు
[ 11-05-2024]
రైల్వే టిక్కెట్ల రిజర్వేషన్ ఖరారైనా నిరీక్షణ జాబితాలో పెట్టారంటూ అన్నదాతలు ఆందోళనకు దిగారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా తమిళనాడుకు చెందిన దక్షిణ నదుల భద్రతా రైతుల సంఘం అధ్యక్షుడు అయ్యాకన్ను వారణాసి నియోజకవర్గంలో పోటీ చేయనున్నారు. -
నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు
[ 11-05-2024]
రాష్ట్రంలో నాలుగు రోజుల వరకు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది. శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో.. 24 గంటల్లో సాధారణం కన్నా 5 డిగ్రీల సెల్సియస్ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపింది. -
విద్యార్థులూ.. వినండి
[ 11-05-2024]
ప్లస్ టూ, 10వ తరగతిలో మార్కులు ఘనంగా వచ్చాయని సంబరపడిపోయేవారు ఒకవైపు.. సరిగా రాక కుమిలిపోయే విద్యార్థులు మరోవైపు. రాష్ట్రంలో పరిస్థితి ఇది. ఆశించిన మార్కులు రాకపోవడమో, ఫెయిల్ అయిపోవడమోలాంటి కారణాలతో క్షణికావేశ నిర్ణయాలు తీసుకుంటున్నారు. -
విమానాశ్రయంలో వాకలేటర్ సేవలు
[ 11-05-2024]
డొమెస్టిక్, ఇంటర్నేషనల్ టెర్మినళ్లను అనుసంధానం చేసేందుకు కొత్తగా వాకలేటర్తో పాటు మల్టీ లెవల్ కారు పార్కింగు సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తెచ్చేందుకు నగర విమానాశ్రయ యంత్రాంగం సిద్ధమవుతోంది. -
34 ఏళ్ల తర్వాత చేతికొచ్చిన సొంతిల్లు
[ 11-05-2024]
చెన్నై స్టాన్లీ ఆస్పత్రిలో పని చేసి పదవీవిరమణ చేసిన డీన్ విక్టర్కు షెనాయ్నగర్ ప్రాంతంలో సొంతిల్లు ఉంది. 2 గ్రౌండ్ల స్థలంలోని ఇంటిని వేరొకరిని చూసుకోమని చెప్పి 34 ఏళ్ల కిందట ఆయన అమెరికా వెళ్లి పోయాడు. -
అలవోకగా శాస్త్రీయనామాలు చెప్తున్న బాలుడు
[ 11-05-2024]
కూరగాయలు, పండ్ల శాస్త్రీయ నామాలు సెకన్లలో చెప్తూ ఓ బాలుడు అబ్బురపరుస్తున్నాడు. దిండుక్కల్ జిల్లా పళని నెయిక్కారపట్టికి చెందిన మహ్మద్ హిసామ్ ఓ ప్రైవేట్ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. -
పదో తరగతి ఫెయిల్ కావడంతో విద్యార్థిని ఆత్మహత్య
[ 11-05-2024]
పదో తరగతిలో ఫెయిలైన విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పళ్లిపట్టు తాలూకా మేల్పొదటూర్ ప్రాంతానికి చెందిన మురళి, నదియ భార్యభర్తలు. కుమారి(15) అనే కుమార్తె ఉంది.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీఎస్ ఆర్టీసీ వెబ్సైట్లో సాంకేతిక సమస్య.. టికెట్లకు ప్రయాణికుల అవస్థలు
-
చెన్నైతో మ్యాచ్.. గిల్ సహా గుజరాత్ టీమ్కు భారీ జరిమానా
-
నిజమైన ఎస్సీ కాదంటూనే కడియం కుమార్తెకు కాంగ్రెస్ టికెట్: మందకృష్ణ మాదిగ
-
జగన్ పాలనలో హిందువుల మనోభావాలతో చెలగాటం: శ్రీనివాసానంద సరస్వతి
-
‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ రిలీజ్.. రాజమౌళి ప్రత్యేక సందేశం
-
‘నాదేముంది.. ఇదే చివరిది’.. ఐపీఎల్కు రోహిత్ శర్మ గుడ్బై చెప్పనున్నాడా?