ఈవీఎంలను సక్రమంగా పర్యవేక్షించాలి
ఎన్నికల కమిషన్ లోక్సభ ఎన్నికల్లో ఓట్లు పోలైన ఈవీఎంలను సక్రమంగా పర్యవేక్షించాలని కేంద్ర సహాయ మంత్రి ఎల్.మురుగన్ తెలిపారు.
ఎల్.మురుగన్
విలేకర్లతో మాట్లాడుతున్న ఎల్.మురుగన్
కోయంబత్తూరు, న్యూస్టుడే: ఎన్నికల కమిషన్ లోక్సభ ఎన్నికల్లో ఓట్లు పోలైన ఈవీఎంలను సక్రమంగా పర్యవేక్షించాలని కేంద్ర సహాయ మంత్రి ఎల్.మురుగన్ తెలిపారు. కోయంబత్తూరు విమానాశ్రయంలో ఆయన ఆదివారం విలేకర్లతో మాట్లాడుతూ... నీలగిరి జిల్లాలో ఈవీఎంలు పెట్టిన స్ట్రాంగ్ రూం సీసీ కెమెరాల మానిటర్లు 20 నిమిషాలు పని చేయలేదన్నారు. సాంకేతిక కారణాలతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు అధికారులు చెప్తున్నారని, ఎన్నికల కమిషన్ తప్పకుండా దీన్ని గమనించాలని పేర్కొన్నారు. ఏ కారణమూ చెప్పకుండా 24 గంటలూ సక్రమంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పర్యవేక్షించాలని తెలిపారు. ఓటరు జాబితాలో పలువురి పేర్లు గల్లంతయ్యాయని, ముఖ్యంగా భాజపా ఓటర్ల పేర్లు లేకుండా పోయాయని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరిస్థితి కనిపించిందన్నారు. ఈవీఎంల గురించి ఎన్నికల కమిషన్ పలుమార్లు వివరించినా కాంగ్రెస్ మళ్లీ మళ్లీ ఆరోపణలు చేయడం ఓటమి భయంతోనేనని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ అయోధ్యకు వెళ్లి పూజలు చేయనని చెప్తున్నారని, ఆయన హిందూ మతాన్ని ద్వేషిస్తున్నారా? లేక దేవుడిని ద్వేషిస్తున్నారా? అన్నది తెలియజేయాలన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పూర్వ విద్యార్థులే ఐఐటీ బలం!
[ 14-05-2024]
దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఐఐటీ మద్రాస్ విద్యార్థుల శ్రేయస్సు, దేశం కోసం ఎన్నో ప్రాజెక్టులు తెస్తోంది. భారీగా నిధులు ఖర్చుపెడుతోంది. ఈ విద్యాసంస్థ ఈ తరహాలో దూసుకుపోయేందుకు ఇక్కడ చదివిన పూర్వ విద్యార్థులే కారణమని అంటున్నారు -
పాఠకుల సంఖ్య పెంచుతా: రచయిత శివశంకర్
[ 14-05-2024]
నేటితరం యువత సెల్ఫోన్లకే పరిమితమవుతున్న తరుణంలో వారి దృష్టిని పుస్తకాల వైపు మళ్లించడానికి శాయశక్తులా కృషి చేస్తున్నట్లు ‘బుక్స్ అండ్ రీడర్స్-ఫిలిమ్స్ అండ్ ఫ్యాన్స్ అసోసియేషన్’ అద్యక్షుడు శివశంకర్ పేర్కొన్నారు. -
నాగపట్నం ఎంపీ సెల్వరాజ్ కన్నుమూత
[ 14-05-2024]
నాగపట్నం ఎంపీ సెల్వరాజ్ (67) సోమవారం అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. తిరువారూర్ జిల్లా నీడామంగళం కప్పలుడైయాన్ గ్రామానికి చెందిన సెల్వరాజ్కు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. -
జైలులో ప్రాణానికి ముప్పు: సవుక్కు శంకర్
[ 14-05-2024]
జైల్లో తన ప్రాణానికి ముప్పు ఉందని సవుక్కు శంకర్ ఆందోళన వ్యక్తం చేశాడు. మహిళా పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ప్రముఖ యూట్యూబర్ సవుక్కు శంకర్ను పోలీసులు -
కన్నియాకుమరిలో జోరుగా వర్షాలు
[ 14-05-2024]
కన్నియాకుమరి జిల్లాలో గత కొన్నిరోజులుగా సాధారణం కంటే అధికంగా ఎండలు మండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
ఇంజినీరింగ్లో ఏఆర్ అండ్ వీఆర్ కోర్సు
[ 14-05-2024]
అన్నా విశ్వవిద్యాలయం (ఏయూ) ప్రాంగణంలోని కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ (సీఈజీ) 2024-25 విద్యా సంవత్సరం నుంచి ‘ఆగ్మెంటెడ్ రియాల్టి అండ్ వర్చువల్ రియాల్టి’ (ఏఆర్ అండ్ వీఆర్) మూడేళ్ల డిగ్రీ కోర్సును ప్రారంభించేందుకు ఆలోచిస్తోంది. -
మనస్తాపంతో వివాహిత బలవన్మరణం
[ 14-05-2024]
విళుపురం జిల్లా మరక్కాణం సమీపం కానిమేడు గ్రామానికి చెందిన చక్రవర్తి, వనిత దంపతులకు 16 ఏళ్ల కుమార్తె ఉంది. ఈమె అదే ప్రాంతంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 11వ తరగతి చదువుతోంది. -
పట్టాలపై పడుకున్న ముగ్గురు యువకులు
[ 14-05-2024]
పట్టాలపై నిద్రించిన ముగ్గురు యువకుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు.. నాగపట్టిణం జిల్లా వేదారణ్యంకు చెందిన కుమారసారథి(18), తులసి నారాయణన్(18), ప్రభాకరన్(18) అనే ముగ్గురు యువకులు -
నడిగర్ సంఘానికి ధనుష్ విరాళం
[ 14-05-2024]
ఆర్థిక సంక్షోభం కారణంగా అర్ధాంతరంగా నిలిచిపోయిన నడిగర్ సంఘం భవన నిర్మాణ పనుల కోసం పలువురు నటులు స్వచ్ఛందంగా తమవంతు విరాళాలు అందిస్తున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు (Latest News)
-
వారణాసితో నా బంధం విడదీయలేనిది: ఎమోషనల్ వీడియో షేర్ చేసిన ప్రధాని మోదీ
-
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ‘మహా’తలపోటు
-
ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే.. ఇటు ఫన్.. అటు థ్రిల్
-
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 21,125
-
100 రోజులు.. 200 విమానాలు.. ఏ వ్యాపారవేత్తో అనుకుంటే పొరపాటే!
-
ప్రయాణికులతో కిక్కిరిసిన హైదరాబాద్ మెట్రో