గుకేశ్కు రూ.75 లక్షల ప్రోత్సాహక నగదు
రాష్ట్రానికి చెందిన భారత గ్రాండ్మాస్టర్ గుకేశ్కు రూ.75 లక్షల ప్రోత్సాహక నగదును ముఖ్యమంత్రి అందించారు.
గుకేశ్కు బ్యాంకు చెక్ అందిస్తున్న ముఖ్యమంత్రి
చెన్నై, న్యూస్టుడే: రాష్ట్రానికి చెందిన భారత గ్రాండ్మాస్టర్ గుకేశ్కు రూ.75 లక్షల ప్రోత్సాహక నగదును ముఖ్యమంత్రి అందించారు. కెనడాలో జరిగిన క్యాండిడేట్స్ చెస్ టోర్నీలోని అండర్-17 విభాగంలో గుకేశ్ ఛాలెంజర్గా గెలిచి చరిత్ర సృష్టించాడు. శనివారం నగరానికి చేరుకున్న నేపథ్యంలో ఆదివారం ఆయన్ను తన క్యాంపు కార్యాలయానికి ముఖ్యమంత్రి స్టాలిన్ పిలిపించారు. గుకేశ్ను అభినందించి ప్రభుత్వం తరఫున రూ.75 లక్షల ప్రోత్సాహక నగదుకు సంబంధించిన బ్యాంకు చెక్ను, షీల్డును అందించి శాలువాతో సత్కరించారు. ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ పోటీలోనూ గెలవాలంటూ శుభాకాంక్షలు తెలిపారు. వెంట మంత్రి ఉదయనిధి, యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధిశాఖ అదనపు ప్రధానకార్యదర్శి అతుల్య మిశ్రా, రాష్ట్ర క్రీడాభివృద్ధి ప్రాధికార సంస్థ మెంబర్ సెక్రటరి మేఘనాథ రెడ్డి, జనరల్ మేనేజర్లు (పరిపాలన) మణికంఠన్, మెర్సి రెజినా, ప్రభుత్వ ఉన్నతాధికారులు ఉన్నారు.
సీఎంకు గేయ రచయిత వైరముత్తు ప్రశంసలు
చెన్నై: సీఎం స్టాలిన్ను ప్రముఖ సినీ గేయ రచయిత వైరముత్తు ప్రశంసించారు. ఆయన తన ఎక్స్ పేజీలో... ముఖ్యమంత్రిని కలిసేందుకు ఉదయం 10.15 గంటలకు అపాయింట్మెంట్ తీసుకొని నిమిషం ముందుగా క్యాంపు కార్యాలయానికి చేరుకోగా సరిగ్గా 10.15 గంటలకు ఆయన తనను ఆహ్వానించారని తెలిపారు. సమయ పాలనలో ఆయన అంతర్జాతీయ క్రమశిక్షణను పాటిస్తున్నారని ప్రశంసించారు. 40 ఏళ్లుగా ఆయనతో పరిచయం ఉందని, సంవత్సరాలు పెరిగే కొద్ది ఆయనలో పరిపక్వత కూడా పెరిగిందని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పూర్వ విద్యార్థులే ఐఐటీ బలం!
[ 14-05-2024]
దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఐఐటీ మద్రాస్ విద్యార్థుల శ్రేయస్సు, దేశం కోసం ఎన్నో ప్రాజెక్టులు తెస్తోంది. భారీగా నిధులు ఖర్చుపెడుతోంది. ఈ విద్యాసంస్థ ఈ తరహాలో దూసుకుపోయేందుకు ఇక్కడ చదివిన పూర్వ విద్యార్థులే కారణమని అంటున్నారు -
పాఠకుల సంఖ్య పెంచుతా: రచయిత శివశంకర్
[ 14-05-2024]
నేటితరం యువత సెల్ఫోన్లకే పరిమితమవుతున్న తరుణంలో వారి దృష్టిని పుస్తకాల వైపు మళ్లించడానికి శాయశక్తులా కృషి చేస్తున్నట్లు ‘బుక్స్ అండ్ రీడర్స్-ఫిలిమ్స్ అండ్ ఫ్యాన్స్ అసోసియేషన్’ అద్యక్షుడు శివశంకర్ పేర్కొన్నారు. -
నాగపట్నం ఎంపీ సెల్వరాజ్ కన్నుమూత
[ 14-05-2024]
నాగపట్నం ఎంపీ సెల్వరాజ్ (67) సోమవారం అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. తిరువారూర్ జిల్లా నీడామంగళం కప్పలుడైయాన్ గ్రామానికి చెందిన సెల్వరాజ్కు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. -
జైలులో ప్రాణానికి ముప్పు: సవుక్కు శంకర్
[ 14-05-2024]
జైల్లో తన ప్రాణానికి ముప్పు ఉందని సవుక్కు శంకర్ ఆందోళన వ్యక్తం చేశాడు. మహిళా పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ప్రముఖ యూట్యూబర్ సవుక్కు శంకర్ను పోలీసులు -
కన్నియాకుమరిలో జోరుగా వర్షాలు
[ 14-05-2024]
కన్నియాకుమరి జిల్లాలో గత కొన్నిరోజులుగా సాధారణం కంటే అధికంగా ఎండలు మండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
ఇంజినీరింగ్లో ఏఆర్ అండ్ వీఆర్ కోర్సు
[ 14-05-2024]
అన్నా విశ్వవిద్యాలయం (ఏయూ) ప్రాంగణంలోని కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ (సీఈజీ) 2024-25 విద్యా సంవత్సరం నుంచి ‘ఆగ్మెంటెడ్ రియాల్టి అండ్ వర్చువల్ రియాల్టి’ (ఏఆర్ అండ్ వీఆర్) మూడేళ్ల డిగ్రీ కోర్సును ప్రారంభించేందుకు ఆలోచిస్తోంది. -
మనస్తాపంతో వివాహిత బలవన్మరణం
[ 14-05-2024]
విళుపురం జిల్లా మరక్కాణం సమీపం కానిమేడు గ్రామానికి చెందిన చక్రవర్తి, వనిత దంపతులకు 16 ఏళ్ల కుమార్తె ఉంది. ఈమె అదే ప్రాంతంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 11వ తరగతి చదువుతోంది. -
పట్టాలపై పడుకున్న ముగ్గురు యువకులు
[ 14-05-2024]
పట్టాలపై నిద్రించిన ముగ్గురు యువకుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు.. నాగపట్టిణం జిల్లా వేదారణ్యంకు చెందిన కుమారసారథి(18), తులసి నారాయణన్(18), ప్రభాకరన్(18) అనే ముగ్గురు యువకులు -
నడిగర్ సంఘానికి ధనుష్ విరాళం
[ 14-05-2024]
ఆర్థిక సంక్షోభం కారణంగా అర్ధాంతరంగా నిలిచిపోయిన నడిగర్ సంఘం భవన నిర్మాణ పనుల కోసం పలువురు నటులు స్వచ్ఛందంగా తమవంతు విరాళాలు అందిస్తున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు (Latest News)
-
వైవాహిక బంధానికి వీడ్కోలు పలికిన జీవీ ప్రకాశ్, సైంధవి దంపతులు
-
ప్రపంచంలో అతడొక్కడే.. హిరోషిమా, నాగసాకి అణుదాడులకు గురై జీవించిన వ్యక్తి..!
-
కిమ్ రాజ్యంలో రెడ్ లిప్స్టిక్పై నిషేధం.. ఎందుకంటే?
-
అది టీకప్పులో తుపానులాంటిది.. కేఎల్ రాహుల్-సంజీవ్ గోయెంకా ఎపిసోడ్పై ఎల్ఎస్జీ
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (14/05/24)
-
రాహుల్తో చర్చకు భాజపా రెడీ.. యువ నాయకుడికి అవకాశం