పదేళ్లగా భద్రం.. ఇప్పుడేంటీ ‘చిత్రం’!
బ్రాండిక్స్ అపెరల్ సిటీ పరిశ్రమలు ఉత్పత్తులు ప్రారంభించిన పుష్కరకాలంలో ఎన్నడూ జరగని ప్రమాదాలు రెండు నెలల వ్యవధిలో జరగడంపై కంపెనీ ప్రతినిధులతోపాటు కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలిలో బ్రాండిక్స్ అపెరల్ సిటీ పరిధిలో 11 దుస్తుల అనుబంధ పరిశ్రమలను
సీడ్స్ పరిశ్రమ
బ్రాండిక్స్ అపెరల్ సిటీ పరిశ్రమలు ఉత్పత్తులు ప్రారంభించిన పుష్కరకాలంలో ఎన్నడూ జరగని ప్రమాదాలు రెండు నెలల వ్యవధిలో జరగడంపై కంపెనీ ప్రతినిధులతోపాటు కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలిలో బ్రాండిక్స్ అపెరల్ సిటీ పరిధిలో 11 దుస్తుల అనుబంధ పరిశ్రమలను 2008 తరువాత ప్రారంభించారు. పరిశ్రమల పేర్లు వేరైనా ఇక్కడ తయారైన దుస్తులు అమెరికా, యూరోప్లోని దేశాలకు ఎగుమతి చేస్తారు. ఎగుమతి చేసే దుస్తుల్లో హానికరమైన రసాయన అవశేషాలు ఉన్నా, నాణ్యత లేకపోయినా ఆ దుస్తులను వెనక్కి పంపిస్తారు. గ్రీన్ జోన్ పరిశ్రమగా పేరున్న సీడ్స్లో విషవాయువులు విడుదల అవ్వడంపై సెజ్లోని మిగిలిన పరిశ్రమల ప్రతినిధులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బ్రాండిక్స్ పార్క్లోని 11 పరిశ్రమల్లో వినియోగించే చెదల నివారణ మందే సీడ్స్లోనూ వినియోగిస్తున్నారు. బ్రాండిక్స్ పరిశ్రమల్లో ఎక్కడ చెదల నివారణ మందు వినియోగించాలన్నా ముందుగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేసే కస్టమ్స్ అధికారులు ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. వినియోగించే చెదల మందు కూడా బి-షిఫ్ట్ విధులు ముగించుకొని ఉద్యోగులు ఇళ్లకు వెళ్లే సమయంలో రాత్రి 10.30గంటలకు పిచికారి చేస్తారు. సీడ్స్ దుర్ఘటనకు చెదల నివారణ మందే కారణమని జూన్ 3న జరిగిన ప్రమాదంపై అధ్యయనం చేసిన ఐఐసీటీ, జేసీ కల్పనాకుమారి ఆధ్వర్యంలో నియమించిన కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందించింది. ఇదే నిజమైతే ఇదే మందును వినియోగిస్తున్న మిగిలిన యూనిట్లోని ఒక్క మహిళా ఉద్యోగికి ఎటువంటి ఇబ్బంది ఎదురుకాలేదు. ఈనెల 2న జరిగిన ప్రమాదంలోనూ చెదల మందు వల్లే జరిగి ఉంటుందని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అధికారులు అనుకున్నట్లే చెదల నివారణ మందే కారణం అనుకుంటే ఉదయం ఎ-షిఫ్ట్ విధులకు వచ్చిన ఉద్యోగులు రాత్రి 7 గంటలవరకు ఏవిధంగా విధులు నిర్వహించారని మరో ప్రశ్న ఎదురవుతోంది.
క్వాంటం విలీనం తరవాతే...
బ్రాండిక్స్ అపెరల్ పార్క్లోని క్వాంటం కంపెనీకి ఉండే ఆర్డర్లు తగ్గిపోవడంతో ఆ పరిశ్రమను తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చింది. దీనిలో పనిచేసే 2 వేల మంది వరకు మహిళా కార్మికులను తొలగించడానికి కంపెనీ యాజమాన్యం చర్యలు ప్రారంభించింది. మహిళల ఉపాధిని దృష్టిలో ఉంచుకుని బ్రాండిక్స్ భారతీయ భాగస్వామి దొరస్వామి వీరికి సీడ్స్ పరిశ్రమలో ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించారు. సీడ్స్లో విలీనం కావడానికి ఏమాత్రం ఇష్టంలేని క్వాంటం కార్మికులు ఆందోళన చేశారు. పరిస్థితిని వివరించి సీడ్స్లో పనిచేయడానికి కష్టంగా ఒప్పించారు. అప్పటి నుంచి తమ పరిశ్రమలో ప్రమాదాలు జరగడం ప్రారంభమైందని సీడ్స్ యాజమాన్యం అంటోంది. అందుకే విషవాయువు విడుదల వెనుక కుట్ర కోణం దాగి ఉండొచ్చని, దీనిపై విచారణ చేయాలని కంపెనీ యాజమాన్యమే పోలీసులను కోరుతోంది. సీడ్స్ కంపెనీ ఆవరణలో ప్రమాదకరమైన వాయువులను గుర్తించే ఆధునిక సాంకేతిక పరికరాలను సైతం ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థను క్షుణ్నంగా పరిశీలించిన పీసీబీ సభ్య కార్యదర్శి విజయ్కుమార్ సైతం ప్రమాదానికి కారణాలు అంతుచిక్కడం లేదని మాట్లాడారు.
ఐసీఎంఆర్ బృందం పరామర్శ
అనకాపల్లి పట్టణం, న్యూస్టుడే: విషవాయువుతో అస్వస్థతకు గురై ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళా కార్మికులను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) బృందం శుక్రవారం పరామర్శించింది. చెన్నై నుంచి వచ్చిన డాక్టర్ లోకేష్ నేతృత్వంలో సభ్యులు బాధితులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీశారు. ఇద్దరు మినహా అందరూ డిశ్ఛార్జ్ అయినట్లు డీఎంహెచ్వో హేమంత్ తెలిపారు. కర్మాగారంలో విషవాయువు లీకయిన ప్రాంతాన్ని బృందం పరిశీలించింది.
కంపెనీ మనుగడకే ప్రమాదం
సకాలంలో దుస్తులను విదేశాలకు ఎగుమతి చేయకపోతే ఆర్డర్లు రద్దయ్యే ప్రమాదం ఉందని సీడ్స్ యాజమాన్యం ఆందోళనలో ఉంది. బ్రాండిక్స్ అపెరల్ సిటీ పరిధిలోని పరిశ్రమలకు రెండేళ్ల ముందే ఇతర దేశాల నుంచి ఆర్డర్లు వస్తుంటాయి. నెలనెలా లక్ష్యాలను నిర్దేశించి ఎగుమతి చేస్తుంటారు. కొవిడ్ కారణంగా రెండేళ్లపాటు పూర్తిగా చితికిపోయిన దుస్తుల తయారీ పరిశ్రమలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. ఈ తరుణంలో సకాలంలో ఎగుమతి చేయకపోతే చైనా, బంగ్లాదేశ్లకు ఆర్డర్లు వెళ్లిపోయే ప్రమాదం ఉందని కంపెనీ ప్రతినిధులు భయపడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా పాలనలో రోజూ.. ‘భూ’కంపమే!!
[ 11-05-2024]
వైకాపా అధికారంలోకి వచ్చాక విశాఖ నగరం ఉలిక్కిపడేలా ‘జె’ గ్యాంగ్ రెచ్చిపోయింది. వివాదాల్లో ఉన్న విలువైన భూముల్ని లాక్కొంది. ప్రభుత్వ స్థలాల్లో పాగా వేసింది. భారీ ప్రాజెక్టులు చేతులు మారిపోయాయి. -
చంద్రబాబుకు ముస్లిం మతపెద్దల మద్దతు
[ 11-05-2024]
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ముస్లిం మతపెద్దలు పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం తెదేపా కార్యాలయంలో వారు చంద్రబాబును కలిసి మద్దతు ప్రకటించారు. -
ఫలితాన్ని శాసించే ‘పోస్టల్ బ్యాలెట్’..!
[ 11-05-2024]
ఈ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలట్లు ఫలితాన్ని శాసిస్తాయా అంటే.. ఉద్యోగ వర్గాల నుంచి ఔననే సమాధానం వస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పోస్టల్ బ్యాలట్ ఓట్లు నమోదయ్యాయి. -
సూపర్-6 పథకాలతో మేలు: శ్రీభరత్
[ 11-05-2024]
వైకాపా ప్రభుత్వ హయాంలో వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారని, తెదేపా కూటమి ప్రభుత్వంలో వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తామని విశాఖ తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ అన్నారు. -
పింఛను రూ.4 వేలు ఇస్తాం: తెదేపా
[ 11-05-2024]
తెదేపా కూటమి ప్రభుత్వంలో రూ.4 వేల పింఛను అందిస్తామని పశ్చిమం తెదేపా అభ్యర్థి గణబాబు, విశాఖ తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ అన్నారు. -
త్వరితగతిన ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లిస్తాం..
[ 11-05-2024]
విశాఖను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నామని, ఆరోగ్యశ్రీ బకాయిలను ఎప్పటికప్పుడు చెల్లించేలా చూస్తామని తెదేపా, జనసేన, భాజపా కూటమి అభ్యర్థులు హామీ ఇచ్చారు. -
జగన్.. ఇదేం మెలిక..!
[ 11-05-2024]
గాజువాక హౌస్కమిటీ భూ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొన్నామంటూ ప్రగల్భాలు పలికిన వైకాపా ప్రభుత్వం... చివరకు ఆంక్షల పేరుతో బాధితులకు చుక్కలు చూపించింది. హక్కు పత్రాలు (కన్వెన్షన్ డీడ్) చేతికి ఇవ్వడానికి ముప్పుతిప్పలు పెట్టింది. -
అపురూపం.. నిజరూప దర్శనం
[ 11-05-2024]
సింహాచలం అప్పన్న స్వామి నిజరూపాన్ని భక్తులు ప్రశాంతంగా దర్శించుకున్నారు. అధికారులు ఒక ప్రణాళిక ప్రకారం చేసిన ఏర్పాట్లు మంచి ఫలితాన్ని ఇచ్చాయి. గతానుభవాలను దృష్టిలో ఉంచుకొని చేసిన పకడ్బందీ సన్నాహాలతో ఎక్కడా ఇబ్బంది కలగలేదు. -
మోదీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది
[ 11-05-2024]
కేంద్రంలో మోదీ ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఎంపీ శశిథరూర్ ఆరోపించారు. విశాఖ పర్యటనకు వచ్చిన ఆయన మాట్లాడుతూ.. మోదీ అధికారంలోకి వచ్చిన వెంటనే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చి నెరవేర్చలేదన్నారు. -
కేజీహెచ్ గ్రేడ్-1 నర్సింగ్ సూపరింటెండెంట్ సరెండర్
[ 11-05-2024]
కేజీహెచ్ గ్రేడ్1 నర్సింగ్ సూపరింటెండెంట్ జె.విజయలక్ష్మిని ప్రభుత్వానికి సరెండర్ చేశారు. -
ఓటు అనే ఆయుధాన్ని ప్రజలంతా ఉపయోగించుకోవాలి
[ 11-05-2024]
మీ ఓటు అనే ఆయుధం ద్వారా జగన్ను తరిమికొట్టాలని కూటమి (భాజపా) శాసనసభ అభ్యర్థి విష్ణుకుమార్రాజు పేర్కొన్నారు. -
జిల్లాకు జాతీయ స్థాయి గుర్తింపు తీసుకొస్తా!
[ 11-05-2024]
తనను ఎంపీగా గెలిపిస్తే అనకాపల్లి జిల్లాకు పరిశ్రమలు తీసుకువచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పిస్తానని లోక్సభ భాజపా అభ్యర్థి సీఎం రమేశ్ హామీ ఇచ్చారు. -
ఆటగాళ్లకు మోసగాడు
[ 11-05-2024]
వైకాపా పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన రంగాల్లో క్రీడారంగం ఒకటి. ఐదేళ్లలో క్రీడాభివృద్ధికి రూపాయి ఖర్చు పెట్టలేదు. క్రీడా పరికరాలు సమకూర్చలేదు. మైదానాలు బాగు చేయలేదు. -
వినిపించలేదా.. జగన్ అన్నదాతల ఆత్మఘోష?
[ 11-05-2024]
ప్రస్తుతం ఆయా బాధిత కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నాయి. ఇలాంటివారిని రైతు స్వరాజ్య వేదిక గుర్తించి జీవనోపాధికి ఉన్నంతలో సాయం చేసినా జగన్ సర్కారుకు మాత్రం పరిహారం ఇవ్వడానికి చేతులు రాలేదు. -
పోలింగ్ ముగిసే వరకు అప్రమత్తత: చంద్రబాబు
[ 11-05-2024]
పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ఏమైనా ఇబ్బందులుంటే తన దృష్టికి తేవాలని తెదేపా అధినేత చంద్రబాబు కూటమి అభ్యర్థులు, పార్టీ నేతలకు సూచించారు. -
యువకులపై యమపాశం
[ 11-05-2024]
జిల్లాలో శుక్రవారం జరిగిన రెండు ప్రమాదాల్లో నలుగురు యువకుల దుర్మరణం పాలై ఆయా కుటుంబాల్లో తీరని విషాదం నింపారు. అందరితో కలివిడిగా ఉండే వారు అనుకోని ప్రమాదంలో మరణించడంతో కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు బోరున విలపించారు. -
అయిదేళ్ల నరకానికి రెండు రోజుల్లో మోక్షం
[ 11-05-2024]
వైకాపా అయిదేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలు అనుభవించిన నరకానికి రెండు రోజుల్లో మోక్షం కలగనుందని కూటమి ‘పేట’ అభ్యర్థి వంగలపూడి అనిత అన్నారు. -
జలాశయాన్ని కప్పేస్తున్నారు..
[ 11-05-2024]
వందల ఎకరాలకు సాగునీరందించే జలాశయాన్ని కొందరు అక్రమార్కులు తమ స్వార్థానికి ఇష్టారాజ్యంగా పూడ్చేస్తున్నారు. ఇదంతా నిరాటంకంగా సాగుతున్నా అధికారులు మాత్రం చూసీచూడనట్లు వదిలేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రయాణం మానుకొని ప్రతిఫలం పొందండి.. సొంతూళ్లకు వెళ్లే వారికి తాయిలాలు
-
11 గుర్తింపు కార్డుల్లో ఏదైనా చూపి ఓటేయవచ్చు
-
జగన్ మాటలు వినని జనం.. చెప్పిందే చెప్పి విసిగించిన సీఎం
-
జగన్ సభకు ప్రైవేట్ వాహనాల స్వాధీనం!
-
కేపీహెచ్బీలో గొలుసు దొంగ.. సాఫ్ట్వేర్ ఉద్యోగి
-
అమరావతి వద్దన్న నాని కావాలా..రాజధాని నిర్మించే తెదేపా కావాలా?