logo

ఉపరాష్ట్రపతితో యార్లగడ్డ భేటీ

మాజీ రాజ్యసభ సభ్యుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ ఆదివారం ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌తో భేటీ అయ్యారు.

Published : 20 Mar 2023 03:07 IST

ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌కు పుస్తకాన్ని అందిస్తున్న యార్డగడ్డ లక్ష్మీప్రసాద్‌.చిత్రంలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: మాజీ రాజ్యసభ సభ్యుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ ఆదివారం ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌తో భేటీ అయ్యారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో కలిసి ఆయన ధన్‌ఖడ్‌ను పార్లమెంటు భవనంలో కలిసి తన రచనలను అందజేశారు. ఈ సందర్భంగా వారిద్దరు పలు అంశాలపై చర్చించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం విశేషాలను ఉప రాష్ట్రపతి అడిగి తెలుసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని