logo

కూటమి అభ్యర్థులను గెలిపించండి

వ్యక్తిగత ప్రయోజనాలు కాకుండా.. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని కూటమి బలపర్చిన అభ్యర్థులను ఎన్నికల్లో గెలిపించాలని విశాఖ తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్‌ కోరారు.

Published : 19 Apr 2024 04:41 IST

తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్‌

సమావేశంలో మాట్లాడుతున్న విశాఖ తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్‌

శివాజీపాలెం, (మద్దిలపాలెం), న్యూస్‌టుడే : వ్యక్తిగత ప్రయోజనాలు కాకుండా.. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని కూటమి బలపర్చిన అభ్యర్థులను ఎన్నికల్లో గెలిపించాలని విశాఖ తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్‌ కోరారు. గురువారం శివాజీపాలెం సవేరా ఫంక్షన్‌హాల్‌లో తూర్పు తెదేపా అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబు, తెదేపా, జనసేన, భాజపా ముఖ్యనేతలు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీభరత్‌ మాట్లాడుతూ.. కూటమి ఏర్పాటుకు పవన్‌కల్యాణ్‌ చూపిన చొరవ అభినందనీయమన్నారు. గత ఐదేళ్లుగా కనీసం ప్రజలకు అందుబాటులో లేకుండా.. ఏ అభివృద్ధి కార్యక్రమం చేయకుండా తూర్పు నియోజకవర్గ వైకాపా అభ్యర్థి ప్రజల ముందుకు వస్తున్నారన్నారు. వెలగపూడి రామకృష్ణబాబు మాట్లాడుతూ.. ‘మీసాల బాబు, మోసాల బాబు’ మధ్య ఎన్నికల పోరు జరుగుతుందని ఎవరు కావాలో ప్రజలు, నాయకులు నిర్ణయించుకోవాలన్నారు. కార్యక్రమంలో నాయకులు సి.హెచ్‌.వి.పట్టాభిరామ్‌, బొట్టా వెంకటరమణ, ఒమ్మి సన్యాసిరావు, బుడుమూరి గోవింద్‌, ఒమ్మి అప్పారావు, తెదేపా కార్పొరేటర్లు, జనసేన నాయకులు, భాజపా నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని