జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
జాతీయ రహదారిపై వెదుళ్లపాలెం సమీపాన శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి వ్యతిరేక మార్గంలో వెళ్తున్న లారీని ఢీకొట్టడంతో ముగ్గురు దుర్మరణం చెందగా,
ముగ్గురు దుర్మరణం, మరొకరికి తీవ్రగాయాలు
ప్రమాదంలో నుజ్జయిన కారు
నక్కపల్లి, న్యూస్టుడే: జాతీయ రహదారిపై వెదుళ్లపాలెం సమీపాన శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి వ్యతిరేక మార్గంలో వెళ్తున్న లారీని ఢీకొట్టడంతో ముగ్గురు దుర్మరణం చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. నక్కపల్లి సీఐ ఎ.విజయకుమార్, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
విశాఖ గోపాలపట్నం దరి బుచ్చిరాజుపాలేనికి చెందిన శరగడం వికాస్, అతని తల్లి వెంకటలక్ష్మి (45), అగనంపూడికి చెందిన వికాస్ మేనమామ కొడుకు దాడి గగన్ (14), స్నేహితుడు సుంకర మధుకర్ (23)లతో కలిసి కారులో పాయకరావుపేటలో ఉంటున్న అమ్మమ్మ ఇంటికి, అక్కడి నుంచి కాకినాడ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. విశాఖలో బయలుదేరిన వీరి కారు మధ్యాహ్నం వెదుళ్లపాలెం వద్దకు రాగానే అదుపుతప్పి డివైడర్ ఢీకొట్టి, దీన్ని దాటుకుని అవతల మార్గంలోకి వెళ్లింది. ఇదే సమయంలో అటుగా వెళ్తున్న కంటైనర్ లారీని బలంగా ఢీకొట్టింది. వికాస్ తీవ్రంగా గాయపడగా, మిగిలిన ముగ్గురు మృత్యువాత పడ్డారు. ప్రమాదంలో కారు లారీ ఇంజిన్ కింద భాగం నుంచి అవతలకు దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన తర్వాత కొద్ది నిమిషాల పాటు కొన ఊపిరితో అల్లాడారని, కారులో చిక్కుకుపోవడంతో బయటకు తీసే వీల్లేక అందులోనే మరణించినట్లు స్థానికులు వెల్లడించారు. 108కు పలుమార్లు ఫోన్ చేసినా అందుబాటులో లేవని, తుదకు హైవే అంబులెన్స్ వచ్చి తీవ్రంగా గాయపడిన వికాస్ను నక్కపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ప్రాథమిక చికిత్స అనంతరం వికాస్ను అనకాపల్లి ఆసుపత్రికి పంపించారు. కారులో చిక్కుకున్న మృతదేహాలను సీఐ ఎ.విజయకుమార్, సిబ్బంది, స్థానికుల సాయంతో బయటకు తీసి శవ పరీక్ష నిమిత్తం నక్కపల్లి ఆసుపత్రికి తరలించారు.
వెంకటలక్ష్మి, గగన్, మధుకర్ (పాత చిత్రాలు)
ప్రమాదంపై అనిత ఆరా.. ఇదే సమయంలో తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత పాయకరావుపేట వెళుతూ సంఘటనా స్థలం వద్దకు వచ్చి ప్రమాదం జరిగిన తీరుని సీఐ విజయకుమార్తో మాట్లాడి తెలుసుకున్నారు. మృతులు వెంకటలక్ష్మి, గగన్ వైకాపా జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్కు బంధువులు కావడంతో ఆయన నక్కపల్లి ప్రభుత్వాసుపత్రికిచేరుకుని మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడి ఓదార్చారు. వికాస్, మధుకర్ స్నేహితులు, బీటెక్ పూర్తి చేశారు. త్వరలోనే పై చదువుల నిమిత్తం అమెరికా, జర్మనీ వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా ప్రమాదంలో మూడు కుటుంబాలకు చెందిన ముగ్గురు దుర్మరణం చెందడంతో వారి బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రమాదానికి గురైన కారుకు ఎయిర్ బ్యాగులు లేకపోవడం ప్రాణనష్టం తీవ్రత పెరిగినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా పాలనలో రోజూ.. ‘భూ’కంపమే!!
[ 11-05-2024]
వైకాపా అధికారంలోకి వచ్చాక విశాఖ నగరం ఉలిక్కిపడేలా ‘జె’ గ్యాంగ్ రెచ్చిపోయింది. వివాదాల్లో ఉన్న విలువైన భూముల్ని లాక్కొంది. ప్రభుత్వ స్థలాల్లో పాగా వేసింది. భారీ ప్రాజెక్టులు చేతులు మారిపోయాయి. -
చంద్రబాబుకు ముస్లిం మతపెద్దల మద్దతు
[ 11-05-2024]
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ముస్లిం మతపెద్దలు పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం తెదేపా కార్యాలయంలో వారు చంద్రబాబును కలిసి మద్దతు ప్రకటించారు. -
ఫలితాన్ని శాసించే ‘పోస్టల్ బ్యాలెట్’..!
[ 11-05-2024]
ఈ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలట్లు ఫలితాన్ని శాసిస్తాయా అంటే.. ఉద్యోగ వర్గాల నుంచి ఔననే సమాధానం వస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పోస్టల్ బ్యాలట్ ఓట్లు నమోదయ్యాయి. -
సూపర్-6 పథకాలతో మేలు: శ్రీభరత్
[ 11-05-2024]
వైకాపా ప్రభుత్వ హయాంలో వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారని, తెదేపా కూటమి ప్రభుత్వంలో వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తామని విశాఖ తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ అన్నారు. -
పింఛను రూ.4 వేలు ఇస్తాం: తెదేపా
[ 11-05-2024]
తెదేపా కూటమి ప్రభుత్వంలో రూ.4 వేల పింఛను అందిస్తామని పశ్చిమం తెదేపా అభ్యర్థి గణబాబు, విశాఖ తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ అన్నారు. -
త్వరితగతిన ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లిస్తాం..
[ 11-05-2024]
విశాఖను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నామని, ఆరోగ్యశ్రీ బకాయిలను ఎప్పటికప్పుడు చెల్లించేలా చూస్తామని తెదేపా, జనసేన, భాజపా కూటమి అభ్యర్థులు హామీ ఇచ్చారు. -
జగన్.. ఇదేం మెలిక..!
[ 11-05-2024]
గాజువాక హౌస్కమిటీ భూ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొన్నామంటూ ప్రగల్భాలు పలికిన వైకాపా ప్రభుత్వం... చివరకు ఆంక్షల పేరుతో బాధితులకు చుక్కలు చూపించింది. హక్కు పత్రాలు (కన్వెన్షన్ డీడ్) చేతికి ఇవ్వడానికి ముప్పుతిప్పలు పెట్టింది. -
అపురూపం.. నిజరూప దర్శనం
[ 11-05-2024]
సింహాచలం అప్పన్న స్వామి నిజరూపాన్ని భక్తులు ప్రశాంతంగా దర్శించుకున్నారు. అధికారులు ఒక ప్రణాళిక ప్రకారం చేసిన ఏర్పాట్లు మంచి ఫలితాన్ని ఇచ్చాయి. గతానుభవాలను దృష్టిలో ఉంచుకొని చేసిన పకడ్బందీ సన్నాహాలతో ఎక్కడా ఇబ్బంది కలగలేదు. -
మోదీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది
[ 11-05-2024]
కేంద్రంలో మోదీ ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఎంపీ శశిథరూర్ ఆరోపించారు. విశాఖ పర్యటనకు వచ్చిన ఆయన మాట్లాడుతూ.. మోదీ అధికారంలోకి వచ్చిన వెంటనే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చి నెరవేర్చలేదన్నారు. -
కేజీహెచ్ గ్రేడ్-1 నర్సింగ్ సూపరింటెండెంట్ సరెండర్
[ 11-05-2024]
కేజీహెచ్ గ్రేడ్1 నర్సింగ్ సూపరింటెండెంట్ జె.విజయలక్ష్మిని ప్రభుత్వానికి సరెండర్ చేశారు. -
ఓటు అనే ఆయుధాన్ని ప్రజలంతా ఉపయోగించుకోవాలి
[ 11-05-2024]
మీ ఓటు అనే ఆయుధం ద్వారా జగన్ను తరిమికొట్టాలని కూటమి (భాజపా) శాసనసభ అభ్యర్థి విష్ణుకుమార్రాజు పేర్కొన్నారు. -
జిల్లాకు జాతీయ స్థాయి గుర్తింపు తీసుకొస్తా!
[ 11-05-2024]
తనను ఎంపీగా గెలిపిస్తే అనకాపల్లి జిల్లాకు పరిశ్రమలు తీసుకువచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పిస్తానని లోక్సభ భాజపా అభ్యర్థి సీఎం రమేశ్ హామీ ఇచ్చారు. -
ఆటగాళ్లకు మోసగాడు
[ 11-05-2024]
వైకాపా పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన రంగాల్లో క్రీడారంగం ఒకటి. ఐదేళ్లలో క్రీడాభివృద్ధికి రూపాయి ఖర్చు పెట్టలేదు. క్రీడా పరికరాలు సమకూర్చలేదు. మైదానాలు బాగు చేయలేదు. -
వినిపించలేదా.. జగన్ అన్నదాతల ఆత్మఘోష?
[ 11-05-2024]
ప్రస్తుతం ఆయా బాధిత కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నాయి. ఇలాంటివారిని రైతు స్వరాజ్య వేదిక గుర్తించి జీవనోపాధికి ఉన్నంతలో సాయం చేసినా జగన్ సర్కారుకు మాత్రం పరిహారం ఇవ్వడానికి చేతులు రాలేదు. -
పోలింగ్ ముగిసే వరకు అప్రమత్తత: చంద్రబాబు
[ 11-05-2024]
పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ఏమైనా ఇబ్బందులుంటే తన దృష్టికి తేవాలని తెదేపా అధినేత చంద్రబాబు కూటమి అభ్యర్థులు, పార్టీ నేతలకు సూచించారు. -
యువకులపై యమపాశం
[ 11-05-2024]
జిల్లాలో శుక్రవారం జరిగిన రెండు ప్రమాదాల్లో నలుగురు యువకుల దుర్మరణం పాలై ఆయా కుటుంబాల్లో తీరని విషాదం నింపారు. అందరితో కలివిడిగా ఉండే వారు అనుకోని ప్రమాదంలో మరణించడంతో కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు బోరున విలపించారు. -
అయిదేళ్ల నరకానికి రెండు రోజుల్లో మోక్షం
[ 11-05-2024]
వైకాపా అయిదేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలు అనుభవించిన నరకానికి రెండు రోజుల్లో మోక్షం కలగనుందని కూటమి ‘పేట’ అభ్యర్థి వంగలపూడి అనిత అన్నారు. -
జలాశయాన్ని కప్పేస్తున్నారు..
[ 11-05-2024]
వందల ఎకరాలకు సాగునీరందించే జలాశయాన్ని కొందరు అక్రమార్కులు తమ స్వార్థానికి ఇష్టారాజ్యంగా పూడ్చేస్తున్నారు. ఇదంతా నిరాటంకంగా సాగుతున్నా అధికారులు మాత్రం చూసీచూడనట్లు వదిలేశారు.
తాజా వార్తలు (Latest News)
-
పోలీసుల అణచివేతపై నిరసనలు.. అట్టుడికిన పీవోకే!
-
కోల్కతా, ముంబయి మ్యాచ్కు వరుణుడి ఆటంకం
-
రా.. కదలిరా!.. సొంతూరెళ్దాం ఓటేసొద్దాం..
-
ఖుషీ-జాన్వీకపూర్ల ఉత్సాహం.. చీరకట్టులో దివి హొయలు
-
టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లాండ్ స్టార్ పేసర్
-
యమునోత్రికి పోటెత్తిన భక్తులు.. బారులు తీరిన దృశ్యాలు వైరల్