సర్వం.. ప్రలోభాల పర్వం
‘డబ్బు పంపిణీ చేయాలంటే కూపన్లు.. మద్యం సరఫరా చేయడానికి టోకెన్లు.. చివరికి ప్రచారంలో వెంట తిప్పుకోవడానికి పెట్రోలు కూపన్లు’ ఇలా ఓటర్లకు ఎర వేసేందుకు వైకాపా నేతలు పలువురు కూపన్ల రాజకీయానికి తెర తీశారు.
మద్యం.. నగదు... చీరలు.. కుట్టు మిషన్ల పంపిణీ
ఎన్నికల వేళ వైకాపా నేతల కుయుక్తులు
‘డబ్బు పంపిణీ చేయాలంటే కూపన్లు.. మద్యం సరఫరా చేయడానికి టోకెన్లు.. చివరికి ప్రచారంలో వెంట తిప్పుకోవడానికి పెట్రోలు కూపన్లు’ ఇలా ఓటర్లకు ఎర వేసేందుకు వైకాపా నేతలు పలువురు కూపన్ల రాజకీయానికి తెర తీశారు.
ఈనాడు, విశాఖపట్నం: కూపన్ల సంస్కృతి తొలుత తూర్పు నియోజకవర్గంలో మొదలైంది. వైకాపా అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ ఫొటోతో కూపన్లు వార్డుల వారీగా పంపిణీ చేశారు. ఇంకేముంది.. ఆయన ప్రసంగం వినడం, భోజనం చేయడం ఆ తర్వాత కూపన్లు చేతికిస్తే రూ.వెయ్యి నగదు ఇవ్వడం పరిపాటిగా మారిందనే విమర్శలు వెల్లువెత్తాయి. ఇదే నియోజకవర్గంలో మందుబాబులకు టోకెన్లు సైతం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ కూపన్ చూపిస్తే ఆ నియోజకవర్గ పరిధిలోని ఏ బార్లోనైనా సరే క్వార్టర్ సీసా చేతిలో పెడతారన్నమాట. ఇదే పంథాలో నామినేషన్ ర్యాలీ సమయంలో పాల్గొన్న యువతకు పెట్రోలు కూపన్లు ఇచ్చినట్లు పశ్చిమ నియోజకవర్గంలో అధికారులు గుర్తించారు.
స్వీట్లతో మొదలై చీరలతో కదిలి: వైకాపా అభ్యర్థులు ఎన్నికల కోడ్ కూయగానే తాయిలాల గాలాలు మొదలు పెట్టారు. తొలుత స్వీటు బాక్సులపై జగన్, అభ్యర్థి ఫొటోలు ముద్రించి ఇంటింటికీ పంపిణీ చేశారు. ఆ వెంటనే సిద్ధం కవర్లలో చీరలు పెట్టి మహిళా ఓటర్లకు పంపిణీ చేశారు. ఉత్తర నియోజకవర్గంలో ఆటో డ్రైవర్లు, క్రీడాకారులు, రజకులు, పద్మశాలీలు ఇలా సామాజిక వర్గాల వారీగా ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఒక జత దుస్తులు, చీరతో కూడిన కవరు అందించారు. పశ్చిమం, తూర్పులో పలుచోట్ల రైస్ కుక్కర్లు పంపిణీ చేశారు. దక్షిణంలో ఏకంగా కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. సదరు వైకాపా నేత తన కళాశాల వేదికగా మద్యం సీసాలు అందించడం తీవ్ర విమర్శలు దారి తీసింది.
ఇంతేనా: ప్రచారానికి సైతం ఒక్కొక్కరికి రూ.300 ఇచ్చి అద్దె జనాలను తెచ్చుకుంటున్నారు. తూర్పు వైకాపా అభ్యర్థిగా ఎంవీవీ సత్యనారాయణను ప్రకటించిన తొలినాళ్లలో ఒక్కొక్కరికి రూ.వెయ్యి ఇచ్చుకుంటూ వచ్చారని సమాచారం. ఆయన నామినేషన్ సమయంలో రూ.300 ఇవ్వగా, ‘ఇప్పటి వరకు రూ.వెయ్యి ఇచ్చి.. ఇప్పుడు తక్కువ ఇస్తున్నారేంటి’ అంటూ అద్దె కార్యకర్తలు ఎదురుతిరిగిన పరిస్థితి కొన్ని చోట్ల కనిపించింది.
కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఈ నెల 27వ తేదీ జిల్లా వ్యాప్తంగా రూ.13.22 కోట్ల విలువైన మద్యం, డబ్బు, కానుకలు ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు కలెక్టర్ మల్లికార్జున తెలిపారు.
నోట్ల కట్టలు మాట్లాడుతున్నాయ్: ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగియడంతో విందు, మందు రాజకీయాలు పక్కన పెట్టారు. ప్రస్తుతం నోట్ల కట్టలు రాజ్యమేలుతున్నాయి. ఇప్పటికే యూసీడీ ఆర్పీలు, వాలంటీర్లకు వైకాపా అభ్యర్థులు నోట్ల కట్టలు పంపిణీ చేశారు. డ్వాక్రా మహిళలకు, ఇంటింటికీ డబ్బులు పంపిణీ చేసే బాధ్యత వారికే అప్పగించినట్లు సమాచారం. తాజాగా దక్షిణ నియోజకవర్గం వైకాపా అభ్యర్థి వాసుపల్లి గణేష్కుమార్కు చెందిన మర్రిపాలెంలోని రామబాణం కళాశాలలో రూ.67లక్షల నగదు పట్టుబడింది. ఈ కళాశాల నుంచి ఓటర్లకు డబ్బు వెదజల్లుతూ ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు ఫిర్యాదు అందడంతో అధికారులు కదిలారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కీలకం.. మహిళా ఓటర్ల తీర్పు
[ 15-05-2024]
విశాఖ లోక్సభ స్థానానికి 33 మంది, అసెంబ్లీ స్థానాలకు 101 మంది పోటీ చేశారు.పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచినా పోటీ మాత్రం తెదేపా కూటమి, వైకాపా మధ్యే కేంద్రీకృతం అయింది. -
ఈవీఎంలలో అభ్యర్థుల భవిత
[ 15-05-2024]
లోక్సభ, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసిన అభ్యర్థుల భవిత ఈవీఎంలలో నిక్షిప్తమైంది. పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాలు, కంట్రోలు యూనిట్లను ఏయూ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లలో భద్రపర్చారు. -
సహనానికి పరీక్ష
[ 15-05-2024]
పోలింగ్ రోజున నగరంలోని ఏ కేంద్రం వద్ద చూసినా బారులు తీరిన ఓటర్లు కనిపించారు. గంటల పాటు వరుసల్లో పడిగాపులు కాశారు. తీవ్ర ఉక్కపోతనూ భరించారు. వర్షానికీ వెనుదిరగలేదు. -
ఎన్నికల ఫలితాలపై పందేలు
[ 15-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఘట్టం ముగిసింది. ఫలితాలకు జూన్ 4వ తేదీ వరకు వేచి ఉండాలి. పోలింగ్కు, ఫలితాలకు మధ్య మూడు వారాల వ్యవధి ఉండటంతో అటు అభ్యర్థులు, -
భీమిలిలో రికార్డు విజయం సాధిస్తాం: గంటా
[ 15-05-2024]
భీమిలి నుంచి రికార్డు స్థాయిలో భారీ మెజారిటీతో విజయం సాధిస్తామని తెదేపా ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. -
యువత ఆధ్యాత్మిక భావం అలవర్చుకోవాలి
[ 15-05-2024]
సమాజంలో ప్రతి ఒక్కరూ ముఖ్యంగా యువత ఆధ్యాత్మిక భావం అలవర్చుకోవాలని కాంక్షిస్తూ ఇస్కాన్ మందిరం (సాగర్నగర్) ఆధ్వర్యంలో నగరంలోని ఆర్కేబీచ్, రుషికొండ తదితర ప్రాంతాల్లో మంగళవారం పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టారు. -
22న సింహగిరిపై వైభవంగా నృసింహ జయంతి
[ 15-05-2024]
వైశాఖ శుద్ధ చతుర్దశిని పురస్కరించుకుని ఈ నెల 22వ తేదీన అప్పన్న ఆలయంలో నృసింహ జయంతి ఉత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహించనున్నట్లు ఈవో సింగల శ్రీనివాసమూర్తి తెలిపారు. -
అంధకారం.. అవాంతరాలను అధిగమించారిలా..
[ 15-05-2024]
ఈదురుగాలులతో కురిసిన వర్షం.. విద్యుత్తు సరఫరా నిలిచి పోలింగ్కు అంతరాయాలు ఓటర్ల చైతన్యం ముందు తలవంచాయి. రోలుగుంట మండలంలోని పలు పోలింగు కేంద్రాల్లో సోమవారం రాత్రి అంధకారం అలుముకుంది. -
సైకోతో ప్రజలే యుద్ధం చేశారు
[ 15-05-2024]
ఐదేళ్లు నరకం చూపించిన సైకో సీఎం జగన్తో ప్రజలే యుద్ధం చేశారని ఎలమంచిలి కూటమి అభ్యర్థి సుందరపు విజయ్కుమార్ తెలిపారు. -
ఆధిక్యంపైనే పేట నేతల లెక్కలు
[ 15-05-2024]
పాయకరావుపేట కూటమి అభ్యర్థి వంగలపూడి అనితతో నాలుగు మండలాలకు చెందిన తెదేపా నాయకులు మంగళవారం నక్కపల్లిలోని ఆమె నివాసంలో భేటీ అయ్యారు. -
ప్రభుత్వంపై అన్ని వర్గాల్లో వ్యతిరేకత
[ 15-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కోరుకున్నారని అనకాపల్లి ఎంపీ భాజపా అభ్యర్థి సీఎం రమేశ్ అన్నారు. -
నర్సీపట్నం చరిత్రలో రికార్డు స్థాయిలో..
[ 15-05-2024]
ప్రజల్లో ఓటు చైతన్యం వెల్లివిరిసింది. రికార్డు స్థాయిలో ఓటింగ్లో పాల్గొని ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటారు. నర్సీపట్నంలో తొలుత పోలింగ్ మందకొడిగా ప్రారంభమైనా చివరిలో పుంజుకుంది. -
సర్కారును సాగనంపాలనే కసితో ఓటేశారు
[ 15-05-2024]
ప్రభుత్వాన్ని గద్దె దించాలనే కసితో ఓటు వేసిన ప్రజలకు అనకాపల్లి అసెంబ్లీ జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ ధన్యవాదాలు తెలిపారు. -
క్షతగాత్రులకు కేజీహెచ్లో చికిత్స
[ 15-05-2024]
ఓటు వేసేందుకు వెళుతున్న గిరిజనుల వాహనం బోల్తా పడిన ఘటనలో గాయపడ్డ నలుగురు కేజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. -
కూటమిని ప్రజలు నమ్మలేదు: బొత్స
[ 15-05-2024]
కూటమి మాయమాటలు, ప్రలోభాలను ప్రజలు నమ్మలేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. -
ఉద్యోగుల పేరిట కుటుంబ సభ్యులకు వేతనాలు
[ 15-05-2024]
యశోదా ఆసుపత్రి గ్రూపులో కీలక విభాగంలో పనిచేసిన ఉద్యోగి రూ. 3.26 కోట్ల మొత్తాన్ని పక్కదారి పట్టించాడు. ఉద్యోగులకు చెల్లించే వేతనాల జాబితాలో తన కుటుంబ సభ్యుల పేర్లు చేర్చి, 2021 మే నుంచి 2023 సెప్టెంబరు మధ్య ఈ మొత్తం స్వాహా చేశాడు. -
వేతనాలకు ఉక్కు ఉద్యోగుల ఎదురుచూపులు
[ 15-05-2024]
మే నెల 15వ తేదీ వచ్చినా... ఉక్కు ఉద్యోగులకు వేతనాలు అందకపోవడంతో తీవ్ర నిరాశ, నిస్పృహలో ఉన్నారు. ఇంటి అద్దెలు, నెల వారీ బ్యాంకుల చెల్లింపులు, ఇతర ఖర్చులకు డబ్బుల్లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
అతివలే ముందుండి నడిపారు!
[ 15-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు పోటెత్తారు. గత ఎన్నికలతో పోల్చితే అనకాపల్లి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఓటింగ్ శాతం పెరిగింది. -
పెరిగిన ఓటింగ్.. కూటమిలో జోష్
[ 15-05-2024]
అభ్యర్థుల భవితవ్యం వెల్లడి కాదు. అయినా ఓటర్లు ఎటు మొగ్గారో అంచనా వేయడానికి పార్టీల నాయకులు, కార్యకర్తలు విశ్వప్రయత్నం చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
చాబహార్ పోర్టు డీల్ను సంకుచిత దృష్టితో చూడకూడదు: అమెరికా ఆంక్షలపై భారత్
-
అందుకే ‘జనతా గ్యారెజ్’లో ఐటెం సాంగ్ చేశాను: కాజల్ అగర్వాల్
-
ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పు.. వైకాపా నేతల దుశ్చర్య
-
యశోదాలో ఉద్యోగుల వేతనాల పేరిట రూ.3.26 కోట్లు స్వాహా
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,250 ఎగువన నిఫ్టీ
-
నార్కోటిక్ అంటాడు.. నమ్మితే ముంచేస్తాడు