logo

కూటమితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం: గంటా

కూటమితోనే రాష్ట్రానికి పూర్వ వైభవం వస్తుందని భీమిలి కూటమి అభ్యర్థి, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. కుసులవాడ, గిడిజాల, దబ్బంద, తర్లువాడ, పందలపాక, చందక, గొట్టిపల్లి గ్రామాల్లో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Published : 29 Apr 2024 04:10 IST

తర్లువాడలో ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, నేతలు

ఆనందపురం, న్యూస్‌టుడే: కూటమితోనే రాష్ట్రానికి పూర్వ వైభవం వస్తుందని భీమిలి కూటమి అభ్యర్థి, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. కుసులవాడ, గిడిజాల, దబ్బంద, తర్లువాడ, పందలపాక, చందక, గొట్టిపల్లి గ్రామాల్లో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భాజపా జనసేన, తెదేపా కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రానికి కావాల్సిన నిధులు తెచ్చి అభివృద్ధి, సంక్షేమంలో దూసుకెళ్లవచ్చునన్నారు. విశాఖ జిల్లాకు అధికంగా నిధులు రావాలంటే మీ రెండు ఓట్లు సైకిల్‌ గుర్తుపై వేయాలని కోరారు. రాష్ట్రానికి వైకాపా సర్కార్‌ అభివృద్ధి చేయకపోగా కేంద్రం ఇచ్చిన పథకాలను కూడా సరిగా అమలు చేయలేకపోయిందని గంటా అన్నారు.    

 కుసులవాడ గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని, తనపై నమ్మకంతో తెదేపాలోకి వచ్చిన ప్రతి నాయకుడు, కార్యకర్త రుణం తీర్చుకుంటానని అన్నారు. కూటమి నాయకులు కోరాడ రాజబాబు, కె.రామానాయుడు, తమ్మిన అప్పలరాజు,  సర్పంచి మహంతి శివాజీ వెంకటలక్ష్మీ, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. అంతకు ముందు గంటాకు మహిళలు పూలు జల్లి హారతులతో ఘనంగా స్వాగతం పలికారు. స్థానికులు ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని