ఎర్రమట్టి దిబ్బలకు గండం
విశాఖ నగరం, సమీప ప్రాంతాల్లోని భూములపై కన్నేసిన అధికార వైకాపా నేతల కన్ను భీమిలికి సమీపంలోని భౌగోళిక వారసత్వ ప్రదేశం (జియోహెరిటేజ్ సైట్)గా గుర్తించిన ఎర్రమట్టిదిబ్బలపై పడింది.
భౌగోళిక వారసత్వ ప్రదేశంపై వైకాపా నేతల కన్ను
అటు వైపు ఎవరూ వెళ్లకుండా కంచె
పట్టించుకోని యంత్రాంగం
సమీప భూముల్లో రోడ్లు, కాలువల నిర్మాణం
ఈనాడు, విశాఖపట్నం
ఎర్రమట్టి దిబ్బలకు సమీపంలో సిమెంటు కాలువల నిర్మాణం
విశాఖ నగరం, సమీప ప్రాంతాల్లోని భూములపై కన్నేసిన అధికార వైకాపా నేతల కన్ను భీమిలికి సమీపంలోని భౌగోళిక వారసత్వ ప్రదేశం (జియోహెరిటేజ్ సైట్)గా గుర్తించిన ఎర్రమట్టి దిబ్బలపై పడింది. ఎక్కడెక్కడి నుంచో తిలకించేందుకు ఇక్కడికి పర్యాటకులు వస్తుంటారు. అయితే... అసలు అటువైపే ఎవరూ వెళ్లకుండా చుట్టూ కంచె నిర్మించడం కలకలం రేపుతోంది. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం విస్తుగొలుపుతుంది. పర్యాటకులు జేవీ అగ్రహారం గ్రామం నుంచి మట్టి దారిలో వెళ్లి అక్కడున్న ‘వీక్షణ స్తంభం’ పైనుంచి ఎర్రమట్టి దిబ్బలను తిలకించేవారు. ప్రస్తుతం అక్కడి వరకు వెళ్లడానికి వీలు లేకుండా మధ్యలోనే కొందరు కంచె ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఆ దిబ్బలకు సమీపంలోనే పలు చోట్ల స్థలాలను స్వాధీనం చేసుకున్నట్లు హద్దులు ఏర్పాటు చేశారు. ఈ దిబ్బల్లోకి వెళ్లాలంటే ఈ మార్గం తప్ప మరొకటి లేదు. వీటికి ఆనుకొని భీమునిపట్నం ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీకు స్థలాలున్నాయి. ఇక్కడ నిర్మాణాలు చేపట్టడం వివాదాస్పదమవడం, కోర్టు కేసుల వల్ల ఇప్పటి వరకు ఎటువంటి పనులు చేపట్టలేదు. కానీ, వైకాపా ప్రభుత్వం వచ్చాకే కదలిక వచ్చింది. కొందరు అధికార పార్టీ పెద్దలు అందులో స్థలాలు దక్కించుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆ ప్రాంతాన్ని జనావాసాలకు వీలుగా, విలువైన ప్రాంతంగా మార్చే వ్యూహానికి తెరతీశారన్న విమర్శలొస్తున్నాయి.
ఉనికికే ప్రమాదం: ‘ఎర్రమట్టి దిబ్బలు’ భౌగోళిక చరిత్ర ఆనవాళ్లకు నిదర్శనం. దక్షిణాసియాలో ఇటువంటి ప్రాంతాలు మూడుంటే...అందులో ఇదొకటి. అందుకే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 2014లో భౌగోళిక వారసత్వ ప్రదేశం (జియోహెరిటేజ్ సైట్)గా దీన్ని గుర్తించగా.. 2016లో అప్పటి తెదేపా ప్రభుత్వం సంరక్షణ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తరువాత వచ్చిన వైకాపా ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయటమేకాకుండా...ఉనికే ప్రమాదంలో పడేలా చేసింది. దీంతో ఎక్కడికక్కడ ఆక్రమణలకు గురైంది. ఈ దిబ్బలను తవ్వి మట్టి తరలించేశారు. భీమిలి-భోగాపురం ఆరు వరుసల రహదారి ప్రతిపాదనతో ఇక్కడి స్థలాలకు విలువ పెరిగింది. వైకాపా నేతలు రంగంలోకి దిగి ఈ ప్రాంత భూములను తమ గుప్పిట్లోకి తీసుకుంటున్నారు.
ఎర్రమట్టి దిబ్బలను చూసేందుకు వెళ్లే మార్గంలో వేసిన కంచె
అంతా వ్యూహాత్మకం: ఎర్రమట్టి దిబ్బల్లో వారసత్వ ప్రదేశంగా గుర్తించిన 262 ఎకరాల సంరక్షణను విస్మరించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రదేశాన్ని ప్రమాదంలోకి నెట్టే పరిస్థితులు ఏర్పడినా కళ్లప్పగించి చూస్తోంది. కొందరు వైకాపా నేతలకు అక్కడ స్థలాలు ఉన్నాయి. వాటి విలువ పెరిగేందుకు వ్యూహాత్మకంగా సమీపంలో విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీఏ)తో ఆధ్వర్యంలో భారీ లేఅవుట్ ఏర్పాటు చేయించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దిబ్బలకు అతి సమీపంలో 60 ఎకరాల్లో రోడ్లు, మురుగు నీటి కాలువలు, కల్వర్టులు ఏర్పాటు చేశారు. అక్కడున్న వృక్షాలను తొలగించారు. చెట్లు, పొదలను యంత్రాలతో తీసేయడంతో మున్ముందు వరదలొస్తే ఆ ఉద్ధృతికి ఎర్రమట్టి దిబ్బలు కరిగిపోయే ప్రమాదం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా రౌడీల దౌర్జన్యం.. తెదేపాకు ఓటు వేశారని దాడి!
[ 16-05-2024]
పోలింగ్ పూర్తయినా వైకాపా రౌడీమూకల ఆగడాలు ఆగట్లేదు. విశాఖపట్నం నూకాలమ్మ ఆలయం వద్ద దౌర్జన్యానికి పాల్పడ్డారు. -
ఆ ఎక్కువ.. ఎవరి వైపు!!.. భారీ పోలింగ్పై నేతల విశ్లేషణలు
[ 16-05-2024]
మహిళల ఓట్లు ఎక్కువగా తమకే పడ్డాయని, గెలుపు అవకాశాలు తమవేనంటూ తెదేపా కూటమి, వైకాపా అభ్యర్థులు ఎవరికి వారు దీమా వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వారీ గణాంకాలను విశ్లేషిస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఉత్తరాంధ్ర వెంకటేష్ ఫ్యాన్స్ అధ్యక్షుడి మృతి
[ 16-05-2024]
మధురవాడ జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు పీఎంపాలెం సీఐ వై.రామకృష్ణ తెలిపారు. -
ఏదీ.. ఏమయింది నాటి కళ!
[ 16-05-2024]
వైకాపా ప్రభుత్వం రుషికొండపై సాగించిన విధ్వంసానికి సమీప బీచ్ కళావిహీనంగా మారింది. ఎన్నికలకు ముందు సీఎం క్యాంపు కార్యాలయం కోసమంటూ బీచ్లోని వసతులను ఎత్తేశారు. -
‘ఓటమి భయంతో వైకాపా మూకల దాడులు’
[ 16-05-2024]
రాష్ట్రంలో పోలింగ్ సరళిని పరిశీలిస్తే కూటమికే విజయావకాశాలు అధికంగా ఉన్నాయని, ఇది చూసి ఓర్వలేక రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా మూకలు తెదేపా నాయకులు, శ్రేణులపై దాడులకు దిగుతున్నాయని తెదేపా విశాఖ లోక్సభ నియోజకవర్గ అధ్యక్షులు గండి బాబ్జీ అన్నారు. -
నేటి నుంచి నిర్మాల్య చందనం విక్రయాలు
[ 16-05-2024]
చందనోత్సవం సందర్భంగా ఈనెల 10వ తేదీన అప్పన్న స్వామి దేహంపై నుంచి వేరుచేసిన నిర్మాల్య చందనం విక్రయాలు గురువారం నుంచి ప్రారంభించనున్నట్లు ఈవో సింగల శ్రీనివాసమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. -
నిధుల విడుదలలో.. కుట్ర కోణం?
[ 16-05-2024]
ఎన్నికలకు ముందు లబ్ధిదారుల ఖాతాల్లో సంక్షేమ పథకాల లబ్ధిని జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు నానా హడావుడి చేశారు. -
జిల్లాలో 70.03 శాతం పోలింగ్ నమోదు
[ 16-05-2024]
విశాఖ జిల్లా పరిధిలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని, 2019 ఎన్నికలతో పోల్చితే ఓటింగ్ శాతం 3.78 మేర పెరిగిందని జిల్లా కలెక్టర్ మల్లికార్జున తెలిపారు. -
అర్ధరాత్రి విధ్వంసం
[ 16-05-2024]
అధికారులు ఎన్నికల విధుల్లో ఉండగా జీవీఎంసీ 97వ వార్డు చినముషిడివాడ పరిధి వుడాకాలనీలోని ప్రభుత్వ స్థలంలో అర్ధరాత్రి వేళ కొందరు వ్యక్తులు జేసీబీతో రోడ్డు నిర్మాణం చేపట్టడంతో తీవ్ర చర్చనీయాంశమైంది. -
నేటి నుంచి గురుకులాల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్
[ 16-05-2024]
ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల ఆధ్వర్యంలో నడుస్తున్న బీఆర్ అంబేడ్కర్ గురుకుల కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికిగాను ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో మిగులు సీట్ల ప్రవేశాలకు ఈనెల 16, 17 తేదీల్లో కౌన్సెలింగ్ జరుపుతున్నామని విశాఖ, అనకాపల్లి జిల్లాల గురుకులాల సమన్వయకర్త ఎస్.రూపవతి వెల్లడించారు. -
పలు రైళ్ల రీ షెడ్యూల్
[ 16-05-2024]
లింక్ రైళ్లు ఆలస్యంగా నడుస్తుండడంతో పలు రైళ్ల బయలు దేరే సమయాలను మార్పు (రీ షెడ్యూల్) చేసినట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
ముందుకెళ్లే వీల్లేక.. మార్గ మధ్యలో నిలిచే..!
[ 16-05-2024]
గోపాలపట్నం నుంచి బాజీకూడలి మీదుగా ఎన్ఏడీకూడలికి వెళ్లే బీఆర్టీఎస్ సేవా మార్గంలో నిత్యం ట్రాఫిక్ వెతలతో వాహన చోదకులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. -
అన్న జమానాలో అంతా అనధికారమే!
[ 16-05-2024]
వైకాపా అధికారంలోకి వచ్చాక విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించడంతో ఉమ్మడి జిల్లాలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. -
డెంగీతో జాగ్రత్త సుమా!
[ 16-05-2024]
మే నెలలో ఒకవైపు మండే ఎండలు, మరోవైపు వాతావరణంలో ఒక్కసారిగా చోటుచేసుకున్న మార్పులతో చిరుజల్లులు పడుతున్నాయి. దీంతో ప్రజలకు కొంతమేర ఉపశమనం కలుగుతున్నా ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో వ్యాధులు పొంచి ఉంటాయి. -
మీ అభిమానం మరువలేనిది
[ 16-05-2024]
తనకు అనకాపల్లి పార్లమెంట్ కూటమి ఎంపీ అభ్యర్థిగా సీటు ఖరారు చేసినప్పటి నుంచి పోలింగు వరకు తెదేపా, భాజపా, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు చూపిన అభిమానానికి సీఎం రమేశ్ ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. -
నాడు-నేడు ప్రధానోపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు
[ 16-05-2024]
అనకాపల్లి జిల్లా పరిధిలో రెండో దశ నాడు-నేడు పనులు జరుగుతున్న పాఠశాలల్లోని 227 మంది ప్రధానోధ్యాయులకు డీఈఓ వెంకట లక్ష్మమ్మ బుధవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. -
అనకాపల్లిలో పెరిగిన పోలింగ్
[ 16-05-2024]
అనకాపల్లి జిల్లాలో పోలింగ్ శాతం గణనీయంగా పెరిగింది. అనకాపల్లి, ఎలమంచిలి, మాడుగుల నియోజకవర్గాల్లో ఓటర్లు ఉత్సాహంగా, ఓర్పుతో ఓటు వేశారు. కొన్ని కేంద్రాల్లో తెల్లవారుజాము వరకు పోలింగ్ జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆఖర్లో కొనుగోళ్లు.. 677 పాయింట్లు దూసుకెళ్లిన సెన్సెక్స్
-
హైదరాబాద్ - గుజరాత్ మ్యాచ్కు వర్షం ముప్పు... మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి?
-
12GB ర్యామ్తో మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఫోన్.. ధర, ఫీచర్లివే..!
-
తెలంగాణ ప్రజలకు ఊరట.. ఐదు రోజులపాటు వర్షం
-
ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరిస్తే.. ఈడీ అరెస్టు చేయొద్దు: సుప్రీం కీలక తీర్పు
-
విజయ్ దేవరకొండ చేయలేకపోయిన ఆ నాలుగు హిట్ మూవీలేంటో తెలుసా?