ముందుకెళ్లే వీల్లేక.. మార్గ మధ్యలో నిలిచే..!
గోపాలపట్నం నుంచి బాజీకూడలి మీదుగా ఎన్ఏడీకూడలికి వెళ్లే బీఆర్టీఎస్ సేవా మార్గంలో నిత్యం ట్రాఫిక్ వెతలతో వాహన చోదకులు అవస్థలు ఎదుర్కొంటున్నారు.
ట్రాఫిక్ స్తంభించడంతో ప్రయాణికులకు అవస్థలు
ఎన్ఏడీకూడలి (బుచ్చిరాజుపాలెం) న్యూస్టుడే: గోపాలపట్నం నుంచి బాజీకూడలి మీదుగా ఎన్ఏడీకూడలికి వెళ్లే బీఆర్టీఎస్ సేవా మార్గంలో నిత్యం ట్రాఫిక్ వెతలతో వాహన చోదకులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ ట్రాఫిక్ సిబ్బంది నిర్లక్ష్యంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహన డ్రైవర్లు అయోమయానికి గురవుతున్నారు. ఆ వివరాలు.. ఎన్ఏడీ పైవంతెన కింద మార్గంలో భారీ వాహనాలు వెళ్లే వీల్లేకపోవడంతో... గోపాలపట్నం నుంచి ఎన్ఏడీకూడలికి వెళ్లే వాహనాలను బాజీకూడలి వద్ద మధ్య మార్గంలోకి చేరుకునేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు కూడలిలో భారీ వాహనాలకు మార్గం చూపేలా ట్రాఫిక్ సిబ్బందిని నియమించారు. బుధవారం సాయంత్రం విధుల్లో ఉన్న సిబ్బంది నిర్లక్ష్యంగా ఉండడంతో... ఇతర ప్రాంతానికి చెందిన భారీ కంటైనర్ సేవా మార్గంలో ముందుకు వెళ్లిపోయింది.
బుచ్చిరాజుపాలెం బస్షెల్టర్ సమీపంలోకి వెళ్లేసరికి కంటైనర్ లారీ డ్రైవర్ అప్రమత్తమై... వంతెన కింద నుంచి వెళ్లే వీల్లేదని గుర్తించి.. వాహనాన్ని రోడ్డు మధ్యలో నిలిపేశాడు. ఆ సమయంలో వెనక నుంచి వచ్చిన ఇతర వాహనాలన్నీ ట్రాఫిక్లో ఇరుక్కుపోయాయి. దాదాపు గంట పాటు ట్రాఫిక్ స్తంభించింది. చివరకు లారీ డ్రైవర్ అవస్థలు పడి... వాహనాన్ని వెనక్కి తీసుకొచ్చి.. బీఆర్టీఎస్ మధ్య మార్గం నుంచి ఎన్ఏడీ పైవంతెన మీదుగా వెళ్లాడు. తరచూ ఇదే సమస్య ఎదురవుతుందని, ట్రాఫిక్ ఉన్నతాధికారులు స్పందించి... కూడలిలో సమస్య పరిష్కారానికి శాశ్వత పద్ధతిలో చర్యలు చేపట్టాలని వాహనచోదకులు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రేషన్లో భారీగా కోత
[ 01-06-2024]
పౌర సరఫరాల ద్వారా కార్డుదారులకు సరకులు పంపిణీలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రతినెలా రేషన్ సరకుల్లో కోత విధిస్తూనే ఉంది. -
బీఆర్టీఎస్ పనులతో అష్టదిగ్బంధం
[ 01-06-2024]
సింహాచలం బీఆర్టీఎస్ కారిడార్ నిర్మాణ పనులు ప్రారంభించి ఆరు నెలలు పూర్తయినా అడివివరం గ్రామస్థుల కష్టాలు మాత్రం తీరలేదు. -
ఎవరి కన్ను పడింది?
[ 01-06-2024]
ఏళ్ల తరబడి భూమిపై సాగులో ఉన్న రైతులు వీఎంఆర్డీఏ ల్యాండ్ పూలింగ్కు ఇవ్వడానికి ఇష్టపడక న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇ -
అధినేతను కలిసిన ‘పల్లా’
[ 01-06-2024]
గాజువాక కూటమి (తెదేపా) ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు శుక్రవారం తెదేపా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడును హైదరాబాద్లో మర్యాద పూర్వకంగా కలిశారు. -
లెక్కింపు వేళవిజయోత్సవ ర్యాలీలు నిషేధం
[ 01-06-2024]
ఓట్ల లెక్కింపు వేళ విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించరాదని జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున స్పష్టం చేశారు. -
బకాయిల చెల్లింపుపై ఉద్యోగుల్లో ఆందోళన
[ 01-06-2024]
ఒక అంచనా ప్రకారం రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.25వేల కోట్ల మేర పేరుకుపోయాయని ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనుదారుల ఐక్యవేదిక ఛైర్మన్ కేఆర్ సూర్యనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. -
కేజీహెచ్లో నిబంధనలు అతిక్రమిస్తే ఉపేక్షించం: కలెక్టర్
[ 01-06-2024]
ఎవరైనా నిబంధనలకు లోబడే పనిచేయాలని, మంచి పనితీరు కనబర్చి రోగులకు ఉత్తమ సేవలందించాలని జిల్లా కలెక్టర్ మల్లికార్జున కేజీహెచ్ వైద్యాధికారులకు సూచించారు. -
బాలలకు పొగాకు ఉత్పత్తుల అమ్మకాలపై నిఘా
[ 01-06-2024]
పొగాకు ఉత్పత్తుల వల్ల కలిగే అనర్థాలకు సంబంధించిన అంశానికి తగిన ప్రాధాన్యం కల్పిస్తూ అధికారులు, సిబ్బందితో త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తామని సీపీ రవిశంకర్ తెలిపారు. -
‘ఎకో వైజాగ్’ కోసం కృషి చేయాలి
[ 01-06-2024]
ప్రతీ ఒక్కరూ తమ కర్తవ్యంగా భావించి ఎకో విశాఖ కోసం పర్యావరణహితంగా జీవించాలని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ పర్యావరణాధికారి పి.వి.ముకుందరావు అన్నారు. -
లారీలో ఇద్దరి అనుమానాస్పద మృతి
[ 01-06-2024]
విశాఖపట్నం నుంచి జగ్గయ్యపేటకు వస్తున్న లారీలో ఇద్దరు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. -
సరికొత్తగా.. మరింత సులువుగా..
[ 01-06-2024]
ఆన్లైన్లో జవాబు పత్రాలు దిద్దే విధానానికి విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు చెందిన జవాబు పత్రాలను ఆన్లైన్లో దిద్దేందుకు మూల్యాంకనం కార్యక్రమాన్ని జిల్లాలో చేపట్టనున్నారు. -
పవర్లిఫ్టింగ్ పోటీల్లో జిల్లా క్రీడాకారుల ప్రతిభ
[ 01-06-2024]
గుంటూరు జిల్లా మంగళగిరిలో మూడు రోజుల పాటు జరిగిన రాష్ట్రస్థాయి పవర్లిఫ్టింగ్ పోటీల్లో అనకాపల్లి క్రీడాకారులు ప్రతిభ చూపి పతకాలు సాధించారు. -
స్థానిక సమరానికి దీటుగా..
[ 01-06-2024]
గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సార్వత్రిక సమరంలో ఓటర్లు పోటెత్తారు. అన్ని నియోజకవర్గాల్లోనూ రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. -
లోయలోకి దూసుకెళ్లిన బైకు.. తండ్రీకుమారుల దుర్మరణం
[ 01-06-2024]
బంధువుల ఇంటి నుంచి తిరిగొస్తూ బైకు ప్రమాదంలో తండ్రీకుమారులు మృతి చెందారు. కొయ్యూరు పంచాయతీ చింతవానిపాలెం ఘాట్రోడ్డులో శుక్రవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. -
రాయితీల్లో కోత.. ధరల వాత
[ 01-06-2024]
ఓవైపు తమది రైతు పక్షపాత ప్రభుత్వమని బాకాలు ఊదుతున్నారు.. మరోవైపు విత్తు నుంచి ఎరువుల వరకు ధరలు పెంచి రైతులపై భారాన్ని మోపుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మన గుడిలో పూజ.. దిల్లీ సంస్థ సేవ!
-
అదృశ్యమైన కోటా విద్యార్థి.. 23 రోజులు.. దేశమంతా చక్కర్లు కొట్టి!
-
భారత ఎన్నికలపై కోవర్ట్ ఆపరేషన్.. ఓపెన్ఏఐ సంచలన నివేదిక
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/06/24)
-
ఆ విషయాలు నా పిల్లల నుంచే నేర్చుకున్నా.. మామా ఎర్త్ సీఈఓ
-
దీనస్థితిలో తల్లి ఏనుగు.. కాపాడిన అటవీ అధికారులు!