పర్యాటక రంగంపై వైకాపా పడగ
గమ్య నగరంగా విశాఖకున్న పేరును వైకాపా పాలకులు బంగాళాఖాతంలో కలిపేశారు. జగన్ సర్కారు హయాంలో పర్యాటక రంగం కుదేలైంది.
అనుబంధ రంగాలు కుదేలు
ఉపాధి అవకాశాలకు గండి
ఈనాడు, విశాఖపట్నం
గమ్య నగరంగా విశాఖకున్న పేరును వైకాపా పాలకులు బంగాళాఖాతంలో కలిపేశారు. జగన్ సర్కారు హయాంలో పర్యాటక రంగం కుదేలైంది.
- ఏటా డిసెంబరులో మూడు రోజుల పాటు జరిగే విశాఖ ఉత్సవాల వీక్షణకు అనేక ప్రాంతాల నుంచి లక్షల మంది వచ్చేవారు. భీమిలి, అరకు ఉత్సవాల వంటివి కూడా నిర్వహించి పర్యాటకానికి తెదేపా కొత్త రూపురేఖలు తీసుకొచ్చింది. జగన్ ప్రభుత్వం వచ్చాక వాటిని పట్టించుకున్న దాఖలాలే లేవు. 2019లో మినహా మరెప్పుడూ నిర్వహించలేదు.
- 2017, 2018 సంవత్సరాల్లో జిల్లాకు రెండు కోట్ల మందికి పైగా సందర్శకులు వస్తే వైకాపా అయిదేళ్ల పాలనలో ఎప్పుడూ ఆ సంఖ్య దాటలేదు. విదేశీయులైతే ఇప్పుడు కనిపించడమే అరుదు.
- తెదేపా హయాంలో ఓ ట్రావెల్ సంస్థకు ఏడాదికి రూ.కోటి వ్యాపారం సాగితే... వైకాపా వచ్చాక రూ.30 లక్షల వ్యాపారం కూడా జరగలేదు. అలాగే టూరిజం ప్యాకేజీలు నిర్వహించే ఓ సంస్థకు ఏటా రూ.50 లక్షల వ్యాపారం జరగ్గా ఈ అయిదేళ్లు కలిపినా ఆ మొత్తం దాటలేదంటే పర్యాటకరంగం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
రెండుగా విడిపోయిన తేలియాడే వంతెన
నగరానికి ఆయువు పట్టులాంటి పర్యాటక రంగంపై శీతకన్నేయడంతో పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు దూరమయ్యాయి. ఈ రంగంపై ఆధారపడిన అనుబంధ రంగాలు కుదేలయ్యాయి. తెదేపా హయాంలో మొదలైన పలు నిర్మాణాలను వైకాపా అసంపూర్తిగా వదిలేసింది. రుషికొండపై రాజసౌధంలాంటి నిర్మాణం కట్టుకోవడం మినహా చేసిందేమీ లేదు. ఇలాంటి ప్రభుత్వానికి ఎన్నికల్లో తగు తీర్పు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని జనం చెబుతున్నారు.
రిసార్టులు అస్తవ్యస్తం: విశాఖ డివిజన్ కేంద్రంగా పర్యాటకశాఖకు చెందిన రిసార్టులు అధ్వానంగా మారాయి. టైడా, అరకు, అనంతగిరిలోని రిసార్టుల గదులు చాలా వరకు మరమ్మతులకు గురయ్యాయి. అందులో ఉండేందుకు సందర్శకులు ఇబ్బంది పడుతున్నారు. ఒక్కసారి వచ్చిన పర్యాటకులు మళ్లీ రావాలంటే సంకోచిస్తున్నారు. కొద్ది రోజుల కిందట అప్పూఘర్ వద్ద భవనాల నవీకరణ పేరుతో హడావుడి చేసి వదిలేశారు.
గతంలో రుషికొండ హిల్ రిసార్టు నుంచి అధిక మొత్తంలో ఆదాయం వచ్చేది. ఇప్పుడు రూపాయైనా రావడం లేదు. ఇక్కడి రాజసౌధ నిర్మాణాన్ని ఫిబ్రవరిలో అట్టహాసంగా టూరిజం రిసార్టుగానే ప్రారంభించారు. ప్రస్తుతం దాన్ని ఖాళీగా ఉంచారే తప్ప ఎటువంటి పర్యాటక సేవల కోసం వినియోగించలేదు.
మూలకు చేరిన పర్యాటక శాఖ పడవలు
ఎక్కడికక్కడ అధ్వానం: ఒడిశా, ఇతర రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో సందర్శకులు నగరానికి వస్తుంటారు. గతంలో విదేశీయులు ఎక్కువగా వచ్చేవారు. నగరానికి వచ్చే పర్యాటకులు తప్పనిసరిగా కైలాసగిరిని సందర్శిస్తారు. అటువంటి ప్రాంతాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. మూడేళ్ల పాటు అసంపూర్తి పనులతో కాలయాపన చేసింది.
- బ్లూఫ్లాగ్ గుర్తింపు వచ్చిన రుషికొండ బీచ్ నిర్వహణ అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండేది. మిరుమిట్లు గొలిపే విద్యుత్తు కాంతులతో ఆహ్లాదంగా ఉండేది. జగన్ సర్కారు దాన్ని గాలికొదిలేసింది. తాగునీటి సదుపాయం కూడా కల్పించలేదు.
- ‘ఎంవీ మా’ అనే ప్రైవేటు నౌక తెన్నేటి పార్కు తీరానికి కొట్టుకొచ్చింది. దాన్ని ఫ్లోటింగ్ రెస్టారెంట్గా మార్చి పర్యాటకాన్ని ఉద్ధరిస్తున్నట్లు వైకాపా నేతలు చెప్పుకొచ్చారు. ఆ తర్వాత పర్యాటకశాఖతో అయ్యే పని కాదని వదిలేశారు. ఎన్నికల ప్రకటనకు ముందు గొప్పలకు పోయి ఫ్లోటింగ్ బ్రిడ్జి ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించగా...అది రెండు ముక్కలవడంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా రౌడీల దౌర్జన్యం.. తెదేపాకు ఓటు వేశారని దాడి!
[ 16-05-2024]
పోలింగ్ పూర్తయినా వైకాపా రౌడీమూకల ఆగడాలు ఆగట్లేదు. విశాఖపట్నం నూకాలమ్మ ఆలయం వద్ద దౌర్జన్యానికి పాల్పడ్డారు. -
ఆ ఎక్కువ.. ఎవరి వైపు!!.. భారీ పోలింగ్పై నేతల విశ్లేషణలు
[ 16-05-2024]
మహిళల ఓట్లు ఎక్కువగా తమకే పడ్డాయని, గెలుపు అవకాశాలు తమవేనంటూ తెదేపా కూటమి, వైకాపా అభ్యర్థులు ఎవరికి వారు దీమా వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వారీ గణాంకాలను విశ్లేషిస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఉత్తరాంధ్ర వెంకటేష్ ఫ్యాన్స్ అధ్యక్షుడి మృతి
[ 16-05-2024]
మధురవాడ జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు పీఎంపాలెం సీఐ వై.రామకృష్ణ తెలిపారు. -
ఏదీ.. ఏమయింది నాటి కళ!
[ 16-05-2024]
వైకాపా ప్రభుత్వం రుషికొండపై సాగించిన విధ్వంసానికి సమీప బీచ్ కళావిహీనంగా మారింది. ఎన్నికలకు ముందు సీఎం క్యాంపు కార్యాలయం కోసమంటూ బీచ్లోని వసతులను ఎత్తేశారు. -
‘ఓటమి భయంతో వైకాపా మూకల దాడులు’
[ 16-05-2024]
రాష్ట్రంలో పోలింగ్ సరళిని పరిశీలిస్తే కూటమికే విజయావకాశాలు అధికంగా ఉన్నాయని, ఇది చూసి ఓర్వలేక రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా మూకలు తెదేపా నాయకులు, శ్రేణులపై దాడులకు దిగుతున్నాయని తెదేపా విశాఖ లోక్సభ నియోజకవర్గ అధ్యక్షులు గండి బాబ్జీ అన్నారు. -
నేటి నుంచి నిర్మాల్య చందనం విక్రయాలు
[ 16-05-2024]
చందనోత్సవం సందర్భంగా ఈనెల 10వ తేదీన అప్పన్న స్వామి దేహంపై నుంచి వేరుచేసిన నిర్మాల్య చందనం విక్రయాలు గురువారం నుంచి ప్రారంభించనున్నట్లు ఈవో సింగల శ్రీనివాసమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. -
నిధుల విడుదలలో.. కుట్ర కోణం?
[ 16-05-2024]
ఎన్నికలకు ముందు లబ్ధిదారుల ఖాతాల్లో సంక్షేమ పథకాల లబ్ధిని జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు నానా హడావుడి చేశారు. -
జిల్లాలో 70.03 శాతం పోలింగ్ నమోదు
[ 16-05-2024]
విశాఖ జిల్లా పరిధిలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని, 2019 ఎన్నికలతో పోల్చితే ఓటింగ్ శాతం 3.78 మేర పెరిగిందని జిల్లా కలెక్టర్ మల్లికార్జున తెలిపారు. -
అర్ధరాత్రి విధ్వంసం
[ 16-05-2024]
అధికారులు ఎన్నికల విధుల్లో ఉండగా జీవీఎంసీ 97వ వార్డు చినముషిడివాడ పరిధి వుడాకాలనీలోని ప్రభుత్వ స్థలంలో అర్ధరాత్రి వేళ కొందరు వ్యక్తులు జేసీబీతో రోడ్డు నిర్మాణం చేపట్టడంతో తీవ్ర చర్చనీయాంశమైంది. -
నేటి నుంచి గురుకులాల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్
[ 16-05-2024]
ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల ఆధ్వర్యంలో నడుస్తున్న బీఆర్ అంబేడ్కర్ గురుకుల కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికిగాను ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో మిగులు సీట్ల ప్రవేశాలకు ఈనెల 16, 17 తేదీల్లో కౌన్సెలింగ్ జరుపుతున్నామని విశాఖ, అనకాపల్లి జిల్లాల గురుకులాల సమన్వయకర్త ఎస్.రూపవతి వెల్లడించారు. -
పలు రైళ్ల రీ షెడ్యూల్
[ 16-05-2024]
లింక్ రైళ్లు ఆలస్యంగా నడుస్తుండడంతో పలు రైళ్ల బయలు దేరే సమయాలను మార్పు (రీ షెడ్యూల్) చేసినట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
ముందుకెళ్లే వీల్లేక.. మార్గ మధ్యలో నిలిచే..!
[ 16-05-2024]
గోపాలపట్నం నుంచి బాజీకూడలి మీదుగా ఎన్ఏడీకూడలికి వెళ్లే బీఆర్టీఎస్ సేవా మార్గంలో నిత్యం ట్రాఫిక్ వెతలతో వాహన చోదకులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. -
అన్న జమానాలో అంతా అనధికారమే!
[ 16-05-2024]
వైకాపా అధికారంలోకి వచ్చాక విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించడంతో ఉమ్మడి జిల్లాలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. -
డెంగీతో జాగ్రత్త సుమా!
[ 16-05-2024]
మే నెలలో ఒకవైపు మండే ఎండలు, మరోవైపు వాతావరణంలో ఒక్కసారిగా చోటుచేసుకున్న మార్పులతో చిరుజల్లులు పడుతున్నాయి. దీంతో ప్రజలకు కొంతమేర ఉపశమనం కలుగుతున్నా ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో వ్యాధులు పొంచి ఉంటాయి. -
మీ అభిమానం మరువలేనిది
[ 16-05-2024]
తనకు అనకాపల్లి పార్లమెంట్ కూటమి ఎంపీ అభ్యర్థిగా సీటు ఖరారు చేసినప్పటి నుంచి పోలింగు వరకు తెదేపా, భాజపా, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు చూపిన అభిమానానికి సీఎం రమేశ్ ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. -
నాడు-నేడు ప్రధానోపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు
[ 16-05-2024]
అనకాపల్లి జిల్లా పరిధిలో రెండో దశ నాడు-నేడు పనులు జరుగుతున్న పాఠశాలల్లోని 227 మంది ప్రధానోధ్యాయులకు డీఈఓ వెంకట లక్ష్మమ్మ బుధవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. -
అనకాపల్లిలో పెరిగిన పోలింగ్
[ 16-05-2024]
అనకాపల్లి జిల్లాలో పోలింగ్ శాతం గణనీయంగా పెరిగింది. అనకాపల్లి, ఎలమంచిలి, మాడుగుల నియోజకవర్గాల్లో ఓటర్లు ఉత్సాహంగా, ఓర్పుతో ఓటు వేశారు. కొన్ని కేంద్రాల్లో తెల్లవారుజాము వరకు పోలింగ్ జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
వారి బలహీనతే.. పీవోకేపై పట్టు కోల్పోయేలా చేసింది: జైశంకర్
-
ఐడీఎఫ్ పొరపాటు.. సొంత సైనికులను కోల్పోయిన ఇజ్రాయెల్
-
నగరంలో భారీ వర్షం.. కుంగిన నాలాలు.. జలమయమైన రోడ్లు
-
అలాంటి వాడినే పెళ్లి చేసుకుంటా: జాన్వీ కపూర్
-
వైకాపా నేత ఇంట్లో పెట్రోల్ బాంబుల కలకలం
-
హైదరాబాద్లో యువతికి అనుమానాస్పద రీతిలో గాయాలు!