కదిలిన పసుపు దండు
జిల్లా కేంద్రం శుక్రవారం పసుపుమయమైంది. తెదేపా నుంచి ఎంపీ అభ్యర్థిగా కలిశెట్టి అప్పలనాయుడు నామినేషన్ వేసేందుకు అశోక్ బంగ్లాకు కుటుంబ సభ్యులతో చేరుకున్నారు.
కలిశెట్టి, అదితికి గజమాల వేసిన అభిమానులు
విజయనగరం, అర్బన్, న్యూస్టుడే: జిల్లా కేంద్రం శుక్రవారం పసుపుమయమైంది. తెదేపా నుంచి ఎంపీ అభ్యర్థిగా కలిశెట్టి అప్పలనాయుడు నామినేషన్ వేసేందుకు అశోక్ బంగ్లాకు కుటుంబ సభ్యులతో చేరుకున్నారు. పొలిట్బ్యూరో సభ్యుడు అశోక్ గజపతిరాజు దంపతుల ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ర్యాలీగా నామినేషన్ వేసేందుకు బయలుదేరారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ ఈ ఎన్నికలు ప్రజలకు మంచి అవకాశమని, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. గత ఎన్నికల్లో వైకాపాకు ఒక ఛాన్స్ ఇస్తే గుండు కొట్టేశారని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని అతీగతీ లేకుండా చేసేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అశోక్, ఆయన కుమార్తె అదితి గజపతిరాజు, భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి పావని, నడుకుదటి ఈశ్వరరావు, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి, తెదేపా జాతీయ ఉపాధ్యక్షురాలు ప్రతిభా భారతి, రాష్ట్ర కార్యదర్శి రామ్మల్లిక్ నాయుడు, కె.త్రిమూర్తుల రాజు, భాజపా నాయకులు భవిరెడ్డి శివప్రసాద్ రెడ్డి, కుసుమంచి సుబ్బారావు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాన్న ఎన్నో విలువలు నేర్పారు
[ 03-05-2024]
తన తండ్రి, దివంగత డా.పీవీజీ రాజు ఎన్నో విలువలు నేర్పించారని, ఆయన ఆశయాలతో ముందుకెళుతున్నానని కేంద్ర మాజీ మంత్రి, మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు అన్నారు. -
త్వరితగతిన పోస్టల్ బ్యాలెట్ల తరలింపు
[ 03-05-2024]
విజయనగరంలోని కలెక్టరేట్లో గురువారం పోస్టల్ బ్యాలెట్ల పరిశీలన కార్యక్రమం జరిగింది. బ్యాలెట్ పేపర్లు, ఇతర పత్రాలు, అభ్యర్థుల పేర్లను జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్ నాగలక్ష్మి పరిశీలించారు. -
ప్రాణాంతకమైన నకిలీ మద్యం పట్టివేత
[ 03-05-2024]
కొత్తవలస మండలం మంగళపాలేనికి సమీపంలోని ఓ ఇంట్లో ప్రాణాంతకమైన నకిలీ మద్యం తయారుచేస్తున్న ఇద్దరిని విశాఖ జిల్లాకు చెందిన ఎస్ఈబీ అధికారులు అరెస్టు చేశారు. -
అవినీతి బొత్స.. అక్రమాల కోలగట్ల
[ 03-05-2024]
చీపురుపల్లి, విజయనగరం సభల్లో నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ మరో అభినవ అంబేడ్కర్. ఆయన అమలు చేసిన పథకాలన్నీ ప్రజలకు ఆమోదయోగ్యమైనవి. -
అక్కసుతో.. ‘ఇంత’ కర్కశత్వమా?
[ 03-05-2024]
ఇదేం ప్రభుత్వం.. ఇదెక్కడి అరాచకం.. అభ్యాగులపై ఇంత పగ ఎందుకు.. అందరూ 60 ఏళ్లు దాటిన వృద్ధులే.. అనారోగ్యంతో కొందరు.. దీర్ఘకాలిక వ్యాధులతో మరికొందరు.. నడుము వంగక కూర్చుని పాకేవారు ఇంకొందరు.. వీరితోనా మీ ఓటు రాజకీయం.. చేతికిచ్చే అవకాశం ఉన్నా.. ఎక్కడెక్కడి నుంచో బ్యాంకులకు మండుటెండలో రప్పించి ఏడిపిస్తారా. -
బాలయ్య అన్స్టాపబుల్!
[ 03-05-2024]
సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేపట్టిన ‘స్వర్ణాంధ్ర సాకార యాత్ర’ సభ గురువారం సాయంత్రం చీపురుపల్లిలో దిగ్విజయంగా జరిగింది. -
పాలకొండను బంగారు కొండగా మారుస్తా!
[ 03-05-2024]
‘పాలకొండను బంగారుకొండగా మారుస్తా. ఇక్కడ అపారమైన వనరులు ఉన్నందున పర్యాటక రంగంగా అభివృద్ధి చేస్తే యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. -
నీడ కరవు.. భోజనం బాగోలేదు
[ 03-05-2024]
రాజాం పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రెండు రోజులుగా పీవోలు, ఏపీవోలకు ఎన్నికల శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. -
మాజీ వాలంటీర్లతో ఐప్యాక్ బృందం సమావేశం?
[ 03-05-2024]
కొత్తవలస మండలంలో రాజీనామాలు చేసిన వాలంటీర్లతో ఐప్యాక్ బృందం అర్ధానపాలెంలోని ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు క్యాంపు కార్యాలయం ఆవరణలో గురువారం ప్రత్యేకంగా భేటీ అయిందని తెలిసింది. -
జగ‘మొండి’.. ‘న’డవని బండి..!
[ 03-05-2024]
ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం అనేది నినాదం.. డొక్కు బండిలో ప్రయాణం భయం.. భయం నేటి వాస్తవం.
తాజా వార్తలు (Latest News)
-
పక్క వారిపై ఆ భావన ఉంటే ఈగోలు అడ్డురావు: శోభితా ధూళిపాళ్ల
-
ఆ ఒక్కడే.. ఐపీఎల్లో నన్ను భయపెట్టిన బ్యాటర్: గౌతమ్ గంభీర్
-
సునీత, వైఎస్ షర్మిల పిటిషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు
-
సూచీలకు ‘హెవీ’ స్ట్రోక్.. 700 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రోహిత్ తర్వాత పాండ్యనే కెప్టెన్.. మరింత బాధ్యతగా ఆడాలి: మాజీ క్రికెటర్
-
భారత కంపెనీపై దిల్లీ హైకోర్టుకు టెస్లా.. కారణం ఇదే..