logo

కదిలిన పసుపు దండు

జిల్లా కేంద్రం శుక్రవారం పసుపుమయమైంది. తెదేపా నుంచి ఎంపీ అభ్యర్థిగా కలిశెట్టి అప్పలనాయుడు నామినేషన్‌  వేసేందుకు అశోక్‌ బంగ్లాకు కుటుంబ సభ్యులతో చేరుకున్నారు.

Published : 20 Apr 2024 04:02 IST

కలిశెట్టి, అదితికి గజమాల వేసిన అభిమానులు

విజయనగరం, అర్బన్‌, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రం శుక్రవారం పసుపుమయమైంది. తెదేపా నుంచి ఎంపీ అభ్యర్థిగా కలిశెట్టి అప్పలనాయుడు నామినేషన్‌  వేసేందుకు అశోక్‌ బంగ్లాకు కుటుంబ సభ్యులతో చేరుకున్నారు. పొలిట్‌బ్యూరో సభ్యుడు అశోక్‌ గజపతిరాజు దంపతుల ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ర్యాలీగా నామినేషన్‌ వేసేందుకు బయలుదేరారు. ఈ సందర్భంగా అశోక్‌ మాట్లాడుతూ ఈ ఎన్నికలు ప్రజలకు మంచి అవకాశమని, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. గత ఎన్నికల్లో వైకాపాకు ఒక ఛాన్స్‌ ఇస్తే గుండు కొట్టేశారని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని అతీగతీ లేకుండా చేసేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అశోక్‌, ఆయన కుమార్తె అదితి గజపతిరాజు, భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి పావని, నడుకుదటి ఈశ్వరరావు, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి, తెదేపా జాతీయ ఉపాధ్యక్షురాలు ప్రతిభా భారతి, రాష్ట్ర కార్యదర్శి రామ్‌మల్లిక్‌ నాయుడు, కె.త్రిమూర్తుల రాజు, భాజపా నాయకులు భవిరెడ్డి శివప్రసాద్‌ రెడ్డి, కుసుమంచి సుబ్బారావు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని